అన్వేషించండి

Deputy CM Pawan Kalyan త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh News | త్రిభాషా విధానం, నియోజక వర్గాల పునర్ విభజన అంశాలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ నేర్చుకోవడం కంపల్సరీ కాదన్నారు.

Pawan Kalyan on Delimitation | ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో త్రిభాషా విధానం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. త్రిభాషా విధానం (Three Language Formula) పేరుతో హిందీని మాత్రమే నేర్చుకోవాలని, ఏ భాష అయినా బలవంతంగా రుద్దడాన్ని తన వ్యతిరేకిస్తానని చెప్పారు. ఏపీ, కర్ణాటకలో త్రిభాషా విధానం అదనపు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అనే కోణంలో చూడాలన్నారు. తమిళనాడుకు చెందిన తంతి టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిభాషా విధానం, డీలిమిటేషన్‌పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. 

ఇటీవల పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన (Janasena) ఆవిర్భావ దినోత్సవంలో ప్రముఖ తమిళ కవితతో పవన్ కళ్యాణ్ ప్రారంభించడం తెలిసిందే. తమిళంతో అనుబంధంపై ప్రశ్నకు బదిలిస్తూ.. టీనేజీలో ఉన్నప్పుడు తనకు జీవితంపై భయం కలిగిందని అప్పుడు అచ్చమెలై అచ్చమిళ్ళై (భయం లేదు.. భయం లేదు) అనే భారతీయార్ కవిత చదవగా తనకు ధైర్యం వచ్చిందన్నారు.
 మాతృభాషపై ప్రేమ ఉంటుంది
ప్రతి భాషకు గౌరవం దక్కాలి. భాషను, సంస్కృతలను ప్రారంభించడం తన మార్గదర్శకాల్లో ఒకటని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 400 ఉర్దూ, 107 ఒరియా, 57 కన్నడ, 30 తమిళ, ఐదు సంస్కృతం, 37 వేల పైగా తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎవరి మాతృభాషపై వారికి ప్రేమ ఉండడం సహజం. ఏ రాష్ట్రం పైన వేరే వారి భాషను బవంతంగా రుద్దకూడదు. అలా జరిగితే నేను కచ్చితంగా వ్యతిరేకిస్తాను. హిందీ నేర్చుకోవాలని, తమిళం నేర్చుకోవాలని తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 


హిందీ నేర్చుకోవడం కంపల్సరీ కాదు
భాషా విధానాల్లో హిందీ నేర్చుకోవడం కంపల్సరీ కాదని, నచ్చిన భాషలు పెంచుకోవచ్చు అన్నారు. నేను త్రిభాషా విధానంలోనే ఎదిగా అన్నారు పవన్ కళ్యాణ్. తనకు తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలు తెలుసు అన్నారు. తాను హిందీ భాష నేర్చుకున్నాక తెలుగుకు మరింత దగ్గర అయ్యానని తెలిపారు. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడానికి లేని భయం దేశంలోని హిందీ భాష నేర్చుకునేందుకు ఎందుకు అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని నేతలు పలువురు హిందీ భాషలో ప్రసంగాలు చేస్తుంటారు. కానీ హిందీని వ్యతిరేకిస్తుంటారు. త్రిభాషా విధానం అంటే వాళ్ళు భాషలు నేర్చుకునేందుకు అవకాశమే కానీ, ఏ భాషను బలవంతంగా రుద్దడం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 
డీలిమిటేషన్‌పై రాద్దాంతం వద్దు..
డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు అంటూ చెన్నైలో ఇటీవల జరిగిన సదస్సుపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సమస్యపై మొదటగా పార్లమెంట్లో గళం విప్పాలి. ఆ తర్వాతే పోరాటం చేయాలని సూచించారు. ఇలా రోడ్లమీదకు వస్తే ఏ ప్రయోజనం ఉండదన్నారు. లోక్‌సభలో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడాన్ని అంగీకరించకూడదు అన్నారు. నియోజకవర్గాల పునర్ విభజనతో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గదని తాను నమ్ముతానని తెలిపారు. రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని, తమిళనాడులో బిజెపి పుంజుకుంటుందా అనే ప్రశ్నకు అలా బదులిచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Movie Ticket Rates : టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
Tamil Nadu Assembly Elections 2026: కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
IAF Wing Commander commits suicide: చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
Sensex tumbles: మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
Embed widget