KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
KTR: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖ రాశారు. రేవంత్ అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ చేయించాలని కోరారు.

KTR demands CBI inquiry into Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బినామీ కంపెనీలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘాటైన లేఖ రాశారు. ముఖ్యంగా KLSR ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ ముఖ్యమంత్రికి బినామీ సంస్థ అని, అది దివాలా తీసిన స్థితిలో ఉన్నప్పటికీ సుమారు రూ. 2,500 కోట్ల విలువైన భారీ కాంట్రాక్టులను దానికి అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు. సాగునీరు, తాగునీరు, యంగ్ ఇండియా స్కూల్స్ , రోడ్డు నిర్మాణ పనుల్లో ఈ అక్రమాలు జరిగాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ - కేటీఆర్
ముఖ్యమంత్రి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని KLSR కంపెనీపై ఉన్న కేసుల సాక్ష్యాధారాలను మాయం చేయిస్తున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణమని, ఇది అధికారులపై ముఖ్యమంత్రి చేస్తున్న ఒత్తిడికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర విచారణ సంస్థలు, పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని, విచారణ సజావుగా సాగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.
ఎన్సీఎల్టీ విచారణలోనూ జోక్యం చేసుకున్నారు - కేటీఆర్
నేషనల్ లా ట్రిబ్యునల్ విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారని, ఇప్పటికే ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చాలని సుప్రీంకోర్టు సూచించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు. నిష్పాక్షిక విచారణ జరగాలంటే కేంద్ర సంస్థలైన సీబీఐ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ , సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ రంగంలోకి దిగాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ఆర్థిక అక్రమాలే కాకుండా, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న తీరుపై సమగ్ర దర్యాప్తు అవసరమని కోరారు.
🔷 రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న బినామీ వ్యాపారాలపైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— ShashanKTRS🚗 (@Shashanktrs8) March 13, 2026
అన్న
🔷 కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు లేఖ ప్రతులను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు,… pic.twitter.com/9H7EO5tcTv
ఇతర కేంద్ర మంత్రులకూ లేఖల కాపీలు పంపిన కేటీఆర్
అమిత్ షాతో పాటు ఈ లేఖ ప్రతులను కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, పీయూష్ గోయల్, మరియు అర్జున్ రామ్ మేఘ్వాల్లకు కూడా కేటీఆర్ పంపించారు. బినామీ కంపెనీల ద్వారా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నారని, కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వర్సెస్ కేటీఆర్ పోరును జాతీయ స్థాయికి తీసుకెళ్లినట్లయింది.
ట్రెండింగ్ వార్తలు






















