Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
ఆంధ్రప్రదేశ్లో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుండి ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మధ్య కొత్త హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

Crore Kovvur Jeelugumilli Highway | తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు- ఏలూరు జిల్లా లోని జీలుగుమిల్లి మధ్య 86.7 కిమీ ల హైవే కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు మాజీ కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధ్రీశ్వరి ఈ వివరాలు తెలిపారు. మొత్తం 368కోట్ల రూపాయలతో నిర్మించే ఈ డబుల్ లైన్ హైవే ఏజెన్సీ గ్రామాలకూ, పోలవరం ప్రాజెక్ట్ కూ చాలా రకాలుగా ఉపయోగపడనున్నట్టు ఆమె ప్రకటించారు.

పోలవరం ప్రాజెక్ట్ కు కొత్త హైవే వచ్చినట్టే
ఆల్రెడీ కొవ్వూరు నుండి గోదావరి గట్టు వెంబడి పోలవరం వరకూ ఒకరోడ్డు, పోలవరం నుండి జీలుగుమిల్లి వరకూ మరొక రోడ్డు ఉన్నాయి. అయితే ఇవి సింగిల్ లైన్ రోడ్లు. రవాణా సౌకర్యం కూడా తక్కువే. ఇప్పుడు ఆ రెండు రోడ్లనూ కలుపుతూ ఓకే రోడ్డు క్రింద మార్చబోతున్నారు.మొత్తం 86.7 కిమీ పొడవైన ఈ రోడ్డు కొవ్వూరు లోని గోదావరి మాత విగ్రహం నుండి మొదలై గోదావరి ఫై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ క్రింద నుండి పట్టిసీమ,పోలవరం మీదుగా జీలుగుమిల్లి వరకూ వెళుతుంది. ఈ రూట్ లో 30 మైదాన గ్రామాలు, 100 ఏజెన్సీ గ్రామాలు కవర్ అవుతాయి.

ఆయా ప్రాంతాల స్టూడెంట్స్, ఉద్యోగులు, చిన్నకారు వ్యాపారస్తులు, వ్యవసాయ దారులకు ఈరోడ్డు మెరుగైన ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కలిగిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. క్రొత్త గా వచ్చే ఈ హైవే వలన హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య మరింత దూరం తగ్గనుంది. ఈ హైవే పూర్తి అయితే ఆల్రెడీ నిర్మాణం చివరి దశ లో ఉన్న ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే కి మరొక ప్రత్యామ్నాయం వచ్చినట్టే అవుతుంది. 
టూరిస్ట్ ప్లేస్ లు కవర్ అయ్యేలా హైవే నిర్మాణం
కొవ్వూరు -జీలుగుమిల్లి రెండు వరుసలు హైవే చాలా టూరిస్ట్ ప్రాంతాలను కవర్ చేస్తూ వెళుతుంది. వాటిలో 200ల సినిమా షూటింగ్ లు జరుపుకున్న సినిమా చెట్టు ఉండే కుమారదేవం, పట్టిసీమ ప్రాజెక్టు, పట్టిసీమ టెంపుల్, పోలవరం ప్రాజెక్టు లతో పాటు పోలవరం -జీలుగుమిల్లి మధ్య ఉన్న ఏజెన్సీ (అటవీ ప్రాంతాలు ) గ్రామాలు ఉన్నాయి. ఈ హైవే వల్ల ట్రాన్స్ పోర్ట్ తో పాటు టూరిజం కూడా డెవలప్ అవుతుంది అని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ హైవే పూర్తి అయితే ఇది పోలవరం ప్రాంతాల అభివృద్ధి కి గేమ్ చేంజర్ అవుతుందని అక్కడి ప్రజలు అంటున్నారు.
ఖమ్మం నుండి దేవరపల్లి మధ్య రెడీ అవుతోన్న గ్రీన్ ఫీల్డ్ హైవే కొవ్వూరు కి 20కిమీ దూరం లోనే ఉండబోతోంది. అడిగాక చెన్నై -హౌరా నేషనల్ హైవే కూడా కొవ్వూరు ఫై నుండే వెళుతోంది. వీటి జతకి క్రొత్తగా కొవ్వూరు -జీలుగుమిల్లి హైవే కూడా శాంక్షన్ కావడం తో కొవ్వూరు అభివృద్ధి స్కై రేకెట్ వేగంతో ముందుకి వెళుతుంది అని అక్కడి ప్రజలు అంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















