అన్వేషించండి
In Pics: సీఎం జగన్ నివాసంలో 41 రోజులుగా రాజశ్యామల యాగం, నేడే పూర్తి - ఫోటోలు
CM Jagan Yagam: యాగం పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్ జగన్ కు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వచనం అందించారు.

రాజశ్యామల యాగం అనంతరం సీఎం జగన్ కు ఆశీర్వచనం
1/8

సీఎం జగన్ శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించారు.
2/8

తాడేపల్లిలోని జగన్ నివాసంలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో ఈ చండీయాగం జరిగింది.
3/8

శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్ జగన్ కు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వచనం అందించారు.
4/8

బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదా రెడ్డి దంపతులు రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు సహకారంతో సహస్ర చండీయాగం నిర్వహించారు.
5/8

చండీయాగం, రాజశ్యామల యాగం వంటివి చేసేవారు.. రాష్ట్ర క్షేమం, ప్రజా సంక్షేమం కాంక్షించి ఈ యాగం చేస్తుంటారని చెబుతారు.
6/8

గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తరచూ ఈ యాగం చేసేవారు.
7/8

గత ఫిబ్రవరి నెలలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.
8/8

ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు.. లేదా మండలం రోజులు అంటే 41 రోజులు చేయడానికి వీలుంటుంది. లేదా 21 రోజులు, 16 రోజులు, 3 రోజులు కూడా వీలును బట్టి చేస్తుంటారు.
Published at : 15 May 2024 05:40 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
ఐపీఎల్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion