అన్వేషించండి

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..

Todays Top 10 headlines:

పట్టాలపై మృత్యు కేళి

ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయి. కోల్‌కతా సమీపంలోని షాలిమార్ స్టేషన్ నుంచి కోరమాండల్ ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ వెళ్తుండగా బహంగా బజార్ స్టేషన్లో రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ టీం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

రైళ్లు రద్దు

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించగా, 900 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రధాని మోదీ మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం తర్వాత రైల్వే శాఖ చాలా రైళ్లను దారి మళ్లించింది. ఆ పరిస్థితి లేని ట్రైన్స్‌ రద్దు చేసింది. అలాంటి రైళ్లా జాబితాను విడుదల చేసింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

సంతాప దినం 

శనివారం (జూన్ 3) ఉదయం వరకు సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైలు బోగీల నుండి మృతదేహాన్ని తొలగించడానికి వారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ ఘటనతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో ఒక రోజు సంతాప దినాలు ప్రకటించారు.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

కేసీఆర్‌ గైర్హాజరు

" దేశంలో మూడో.. నాలుగో ఫ్రంట్‌కు ఉనికి లేదు " అని భారత రాష్ట్ర సమితి తేల్చేసింది.  బీజేపీకి ప్రత్యామ్నాయం ఉండాల్సిందేనని ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించి.. నేరుగా జాతీయ పార్టీపెట్టిన కేసీఆర్ మూడో కూటమికి చాన్స్  లేదని ప్రకటించడం ఆశ్చర్యకరమే. జూన్12 వ తేదీన  పట్నాలో  విపక్షాల సమావేశం జరుగుతోంది. గతంలో కేసీఆర్ కలిసిన..కేసీఆర్‌ను కలిసిన వాళ్లంతా హాజరవుతున్నారు.  కానీ కేసీఆర్ మాత్రం వెళ్లడం లేదు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

కిరణ్ ఏం చేస్తున్నారు?

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరినా ఆయన ఏ పనీ చేయలేదు. ఏ పదవీ తీసుకోలేదు. ఆయన అంగీకరించి ఉంటే ఏపీ పీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చి ఉండేవాళ్లు. కానీ ఆయన తీసుకోలేదు.  ఇటీవల బీజేపీలో చేరారు. చేరగానే కర్ణాటక సహా తెలంగాణలోనూ కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకున్నారు. కానీ ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. పార్టీ హైకమాండ్ కూడా ఆయన ఫలానా పని చేయాలని చెప్పడం లేదు.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

స్పెషల్ ట్రీట్‌మెంట్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రత్యేక కేటగిరి విచారణ ఖైదీగా చూడాలని సీబీఐ కోర్టు సూచించింది. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు సీబీఐ న్యాయస్థానం శుక్రవారం సాయంత్రం సిఫార్సు చేసింది. ఈ కేసులో ఇదివరకే అరెస్టైన భాస్కర్ రెడ్డి.. తనను ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలన్న ఆయన అభ్యర్థనకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది. ఏప్రిల్ 16 నుంచి ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నారు.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

పోటీ గట్టిగానే ఉంది

తెలంగాణలో పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించిన ఫైనల్ పరీక్షల ఫలితాలు మే 31న వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో నియామక ప్రక్రియ తుదిదశకు చేరినట్లయింది. తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు తర్వాతి దశలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తెలంగాణ పోలీసు నియామక మండలి మొత్తం 17,516 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

క్యాష్‌ తీయడం లేదు

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో, UPI ట్రాన్జాక్షన్లు 9 బిలియన్లకు చేరుకున్నాయని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. దేశంలో రిటైల్ పేమెంట్లు & సెటిల్‌మెంట్ సిస్టమ్‌ను నిర్వహించే ఈ అంబ్రెల్లా బాడీ, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ సమాచారాన్ని షేర్‌ చేసింది.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

ఏ పాలు బెటర్

కప్పుడు సైకిల్ వేసుకుని పాల వాడు వచ్చి ఇంటింటికీ తిరిగి పాలు పోసి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు మనం నిద్రలేచేసరికి ఇంటి ముందు పాల ప్యాకెట్ దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాల ప్యాకెట్లు లభిస్తున్నాయి. వీధికి కనీసం రెండు మూడు డెయిరీలు వెలుస్తున్నాయి. తాజా పాలు దొరకడం అంటే ఈ రోజుల్లో కష్టమే. కానీ కొన్నేళ్ళ క్రితం తాజా పాలు మాత్రమే దొరికేవి. ప్యాకెట్ పాలు, తాజా పాలు ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరం అనే దాని గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. వీటిలో ఏది ఆరోగ్యకరమైన ఎంపిక అనే విషయం తప్పకుండా తెలుసుకోవాలి.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

గధ ఎవరిది?

మరో ఐదు రోజుల్లో  ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే  వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌పై  క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే ఈ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగిస్తే పరిస్థితి ఏంటి..? ‘ఒకపక్క ఎండలు మండిపోతుంటే వర్షం ఏంట్రా అప్రాచ్ఛపు వెధవ..’ అని తిట్టుకోవద్దు.  ఏమో.. ఐపీఎల్ -16 ఫైనల్‌లో  మండు వేసవిలో అహ్మదాబాద్‌ను వాన ముంచెత్తుతుందని ఎవరైనా అనుకున్నారా..? అసలే ఇంగ్లాండ్‌లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం..!  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs RR Match Highlights | లాస్ట్ ఓవర్ థ్రిల్లర్..KKR పై రాజస్థాన్ సూపర్ విక్టరీ | IPL 2024 | ABPCivils Ranker Sahana Interview | యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి సత్తా | ABP DesamCivils Ranker Arpitha Khola Interview | IPS అవుతున్నారుగా.. ఏం మార్చగలరు..! | ABP DesamCivils Ranker Dheeraj Reddy Interview | ప్లాన్ 'B' నమ్ముకున్నా.. అందుకే సివిల్స్ సాధించా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Embed widget