అన్వేషించండి

Tirumala: తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!

Flight Flying Over Tirumala:తిరుమలలో మళ్లీ మళ్లీ అదే అపచారం జరుగుతోంది. శ్రీవారి ఆలయంపైనుంచి విమానాల రాకపోకలు ఆగడం లేదు..ఈ ఘటనపై కేంద్రం స్పందించాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయ ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై రాకపోకలు సాగించడం నిషిద్ధం. ఇలా రాకపోకలు సాగిస్తే ఏవైనా ఉపద్రవాలు జరుగుతాయని ఆగమ శాస్త్ర పండితులు చాలాసార్లు టీటీడీకి సూచించారు. స్పందించిన టీటీడీ అధికారులు ఆలయంపై   విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని..నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ మళ్లీ మళ్లీ అదే జరుగుతోంది.
 
జనవరి 02న శ్రీవారి ఆలయం సమీపంలో విమానం వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఈ విషయంపై టీటీడీ అధికారులు కేంద్రానికి ఫిర్యాదుచేసినా అదే జరుగుతోంది. రేణిగుంట విమానాశ్రయానికి ట్రాఫిక్ పెరగడంతో నో ఫ్లై జోన్‌గా ప్రకటించేందుకు సాధ్యం కాదని అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని కేంద్రం హమీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఇది కూడా అమలవుతున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే గత కొంత కాలంగా తరచూ శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలు సాగుతున్నాయి. 

Also Read: 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అన్ని వందల కోట్లా!

టీటీడీ అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విమానయాన అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విమానయాన శాఖ త్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు  జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. కోట్లాది భక్తులు విశ్వసించే తిరుమల ను నో ఫ్లై జోన్ గా ప్రకటించేలా చొరవ తీసుకోవాలంటున్నారు.  

గత 6 నెలల కాలంలోనే  రెండుసార్లు విమానాలు ఆలయం మీదుగా వెళ్లటం పై  అధికారులు నేరుగా విమానయాన శాఖతో చర్చించారు. జూన్ 7 ఉదయం 8.14 గంటలకు శ్రీవారి ఆలయంపై విమానం ప్రయాణించింది. అంతకుముందు ఫిబ్రవరి 15న కూడా శ్రీవారి ఆలయం గోపురంపైనుంచి రెండు జెట్ విమానాలు వెళ్లాయి.  

తిరుపతికి సమీపం రేణిగుంటలో విమాశ్రాయం ఉంది, మరోవైపు తిరుపతి సమీపంలో ఉన్న చెన్నైలోనూ విమానాశ్రయం ఉంది. అందుకే తరచూ శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు ప్రాయాణించే సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెబుతున్నారు. అయితే ఆగమశాస్త్ర నిబంధనలు, శ్రీవారి ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇకనైనా నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కోరుతున్నారు భక్తులు. 

Also Read: కోటి పుణ్యాలకు సాటి వైకుంఠ ఏకాదశి - 2025లో ఎప్పుడొచ్చిందంటే!

కలియుగదైవం కొలువైన తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతోంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి సన్నిధిలో వీఐపీల తాకిడి కూడా ఎక్కువే. సుప్రభాత సేవ నుంచి స్వామివారి పవళింపు సేవవరకూ రోజంతా తిరుమలేశుడికి ప్రత్యేక పూజలు, సేవలు, అలంకారాలు, అర్చనలు జరుగుతూనే ఉంటాయి. ఏడాదికి ఓసారి అయినా తిరుమల వెళ్లిరావాలని భావించే భక్తులెందరో. మరికొన్ని రోజుల్లో వైకుంఠ ఏకాదశి వస్తుండడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే తిరుమల శ్రీవారి ఆలయంపైనుంచి విమానాల రాకపోకలు సరికాదన్నది భక్తుల అభిప్రాయం. ఇలా జరగడం ఆగమశాస్త్ర ఉల్లంఘనే అంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు. మరి ఇప్పటికైనా కేంద్రం సానుకూలంగా స్పందించి నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు.

Also Read: ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం.. మకర సంక్రాంతి ఎందుకు పెద్ద పండుగ!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
The Raja Saab Pre Release Event : విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్

వీడియోలు

Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
The Raja Saab Pre Release Event : విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rohit Sharma Records: ఈ ఏడాది 50 రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్
ఈ ఏడాది 50 రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్
Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Embed widget