అన్వేషించండి

Tirumala: తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!

Flight Flying Over Tirumala:తిరుమలలో మళ్లీ మళ్లీ అదే అపచారం జరుగుతోంది. శ్రీవారి ఆలయంపైనుంచి విమానాల రాకపోకలు ఆగడం లేదు..ఈ ఘటనపై కేంద్రం స్పందించాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయ ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై రాకపోకలు సాగించడం నిషిద్ధం. ఇలా రాకపోకలు సాగిస్తే ఏవైనా ఉపద్రవాలు జరుగుతాయని ఆగమ శాస్త్ర పండితులు చాలాసార్లు టీటీడీకి సూచించారు. స్పందించిన టీటీడీ అధికారులు ఆలయంపై   విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని..నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ మళ్లీ మళ్లీ అదే జరుగుతోంది.
 
జనవరి 02న శ్రీవారి ఆలయం సమీపంలో విమానం వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఈ విషయంపై టీటీడీ అధికారులు కేంద్రానికి ఫిర్యాదుచేసినా అదే జరుగుతోంది. రేణిగుంట విమానాశ్రయానికి ట్రాఫిక్ పెరగడంతో నో ఫ్లై జోన్‌గా ప్రకటించేందుకు సాధ్యం కాదని అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని కేంద్రం హమీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఇది కూడా అమలవుతున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే గత కొంత కాలంగా తరచూ శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలు సాగుతున్నాయి. 

Also Read: 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అన్ని వందల కోట్లా!

టీటీడీ అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విమానయాన అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విమానయాన శాఖ త్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు  జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. కోట్లాది భక్తులు విశ్వసించే తిరుమల ను నో ఫ్లై జోన్ గా ప్రకటించేలా చొరవ తీసుకోవాలంటున్నారు.  

గత 6 నెలల కాలంలోనే  రెండుసార్లు విమానాలు ఆలయం మీదుగా వెళ్లటం పై  అధికారులు నేరుగా విమానయాన శాఖతో చర్చించారు. జూన్ 7 ఉదయం 8.14 గంటలకు శ్రీవారి ఆలయంపై విమానం ప్రయాణించింది. అంతకుముందు ఫిబ్రవరి 15న కూడా శ్రీవారి ఆలయం గోపురంపైనుంచి రెండు జెట్ విమానాలు వెళ్లాయి.  

తిరుపతికి సమీపం రేణిగుంటలో విమాశ్రాయం ఉంది, మరోవైపు తిరుపతి సమీపంలో ఉన్న చెన్నైలోనూ విమానాశ్రయం ఉంది. అందుకే తరచూ శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు ప్రాయాణించే సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెబుతున్నారు. అయితే ఆగమశాస్త్ర నిబంధనలు, శ్రీవారి ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇకనైనా నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కోరుతున్నారు భక్తులు. 

Also Read: కోటి పుణ్యాలకు సాటి వైకుంఠ ఏకాదశి - 2025లో ఎప్పుడొచ్చిందంటే!

కలియుగదైవం కొలువైన తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతోంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి సన్నిధిలో వీఐపీల తాకిడి కూడా ఎక్కువే. సుప్రభాత సేవ నుంచి స్వామివారి పవళింపు సేవవరకూ రోజంతా తిరుమలేశుడికి ప్రత్యేక పూజలు, సేవలు, అలంకారాలు, అర్చనలు జరుగుతూనే ఉంటాయి. ఏడాదికి ఓసారి అయినా తిరుమల వెళ్లిరావాలని భావించే భక్తులెందరో. మరికొన్ని రోజుల్లో వైకుంఠ ఏకాదశి వస్తుండడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే తిరుమల శ్రీవారి ఆలయంపైనుంచి విమానాల రాకపోకలు సరికాదన్నది భక్తుల అభిప్రాయం. ఇలా జరగడం ఆగమశాస్త్ర ఉల్లంఘనే అంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు. మరి ఇప్పటికైనా కేంద్రం సానుకూలంగా స్పందించి నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు.

Also Read: ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం.. మకర సంక్రాంతి ఎందుకు పెద్ద పండుగ!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
మీన రాశి ఆగస్టు 23-29 వారఫలం
మీన రాశి ఆగస్టు 23-29 వారఫలం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget