అన్వేషించండి

Today Top Headlines: తిరుమలకు వెళ్లే వీఐపీ భక్తులకు అలర్ట్ - తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:

1. తిరుమల వెళ్లే వీఐపీ భక్తులకు అలర్ట్

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 10 నుంచి మొదలవుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు టీడీడీ అధికారులు. టీటీడీ అడిషనల్ EO వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా SP సుబ్బరాయుడు, CVSO శ్రీధర్ ఏర్పాట్లు మొత్తం పరిశీలించారు. ఇంకా పెండింగ్ ఏర్పాట్లపై చర్చించారు. అదే సమయంలో భక్తులు అనుసరించాల్సిన నియమాల గురించి స్పష్టత ఇచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య 'జ‌న‌వ‌రి 10, 11, 12.. ఈ మూడు రోజుల్లో భారీగా ఉంటుంది. ఇంకా చదవండి.

2. వైసీపీ నేత సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా.?

ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి వరకు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అన్నీ తానై వ్యవహరించిన సజ్జలరామకృష్ణారెడ్డి మెడకు మరో వివాదం చుట్టుకునేలా కనిపిస్తోంది. టీడీపీ కార్యాలయం కేసులో ఆయన పేరు ఉందని తర్వాత కాదంబరి జత్వాని ఇలా వేర్వేరు కేసుల్లో ఆయన పేరు ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్‌ కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. అన్నీ సైలెంట్ అయ్యాయని అనుకుంటున్న టైంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండల రెవెన్యూ పరిధిలో సజ్జల కుటుంబానికి సాగుభూమి ఉంది. అందులో దాదాపు 50 ఎకరాల వరకు అటవీ భూమి ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా చదవండి.

3. మండపేటలో రేవ్ పార్టీ కలకలం

న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు... సొషల్ మీడియాలో వీడియోలు హ‌ల్‌చ‌ల్‌. మొన్న ఏలూరులో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పుట్టినరోజు పేరున రేవ్ పార్టీ నిర్వహించడం దుమారం రేపింది. తాజాగా అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా మండపేటలో నూతన సంవత్సర వేడుకల పేరిట రేవ్‌ పార్టీ చేయడం కలకలం రేపుతోంది. మహిళల చేత అశ్లీలంగా నృత్యాలు చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా భారీ లైటింగు డిజె సౌండ్లు పెట్టుకుని ఓ లేఔట్ లో చేసిన నృత్యాల వీడియోలు ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంకా చదవండి.

4. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా రేవంత్‌రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ‌్యం అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు అందజేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందజేయనున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా మరో 1500 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం అందనున్నాయి. పేదలకు రూపాయికే  కిలో బియ్యం అందజేస్తున్నా.. ప్రజలెవ్వవరూ వాటిని తినడం లేదు. కొందరు కనీసం బియ్యం తీసుకోకుండా రేషన్ దుకాణాల్లోనే ఆ మేరకు డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇంకా చదవండి.

5. మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి 3 రోజుల సెలవులు

తెలంగాణలో సంచలనంగా మారిన సీఎంఆర్ కాలేజీ హాస్టల్‌లో వీడియోల చిత్రీకరణ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్‌లో దొరికిన ఫింగర్ ప్రింట్స్‌, అనుమానితుల వేలి ముద్రలను మ్యాచ్‌ చేస్తూ ఎంక్వయిరీ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజీ హాస్టల్ నెలకొన్న వివాదం ఎంత సంచలనంగా మారిందో చెప్పనవసరం లేదు. జనవరి 1 రాత్రి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Embed widget