అన్వేషించండి

Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?

TelanganaFormer Maoists: తెలంగాణలో మాజీ మావోయిస్టులు రాజకీయ రంగప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వారికి సీఎం రేవంత్ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Telangana Congress Maoist ties:  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టులపై సానుభూతి చూపిస్తున్నారు.  లొంగిపోడానికి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. మంచి పునరావాస ప్యాకేజీలు ఇస్తున్నారు.  అయితే రాజకీయ నేతలు ఇదంతా ఊరికనే చేయరు. ఖచ్చితంగా రాజకీయం ఉంటుంది.   రేవంత్ రెడ్డి మాజీ మావోయిస్టు అగ్రనేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయిని రాజకీయవర్గాలంటున్నాయి.  మావోయిస్టులపై ప్రజల్లో ఎంతో కొంత సానుభూతి ఉటుందని.. బీజేపీ పూర్తిగా వ్యతిరేకంఅయింది కాబట్టి  తమకు అనుకూలంగా మార్చుకునేందుకు లొంగుబాట్లకు ఎక్కువ ప్రాధాన్యం తెలంగాణలో కల్పించారని భావిస్తున్నారు.  

తెలంగాణలోనే మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు 

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన పునరావాస ప్యాకేజీలను ప్రకటించడం వెనుక స్పష్టమైన రాజకీయ సంకేతాలు ఉన్నాయని అనుకోవచ్చు.  గతంలో మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన అగ్రనేతలను, వారి భావజాలంతో ప్రభావితమైన వర్గాలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. కేవలం ఆర్థిక సాయంతోనే కాకుండా, వారిని గౌరవప్రదంగా సమాజంలో కలిపే ప్రయత్నం చేయడం ద్వారా ఒక రకమైన సామాజిక మద్దతు ను కూడగట్టుకునే ప్రయత్నం జరుగుతోందని అంచనా వేస్తున్నారు. 

బీజేపీకి విరుగుడుగా సానుభూతి  అస్త్రం:

భారతీయ జనతా పార్టీ (BJP) మావోయిస్టు భావజాలాన్ని, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ  క్రమంలో మావోయిస్టుల పట్ల సానుకూల ధోరణిని ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ ఒక భిన్నమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకుంది. తెలంగాణ సమాజంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టుల పట్ల ఇప్పటికీ ఎంతో కొంత సానుభూతి ఉంటుంది. ఈ వర్గాలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీ హిందుత్వ ఎజెండాకు వ్యతిరేకంగా ఒక బలమైన సామాజిక కూటమిని నిర్మించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రాజకీయ పునరావాసం - భవిష్యత్తు ప్రణాళిక 

ఇటీవల మాజీ మావోయిస్టు అగ్రనేతలతో రేవంత్ రెడ్డి స్వయంగా సమావేశమవ్వడం, వారి రాజకీయ ఆకాంక్షల పట్ల సానుకూలంగా స్పందించినట్లుగా ప్రచారం జరుగుతోంది.  మాజీ నక్సలైట్లు చట్టపరంగా రాజకీయాల్లోకి రావాలని ఆయన ఇచ్చిన సలహా, భవిష్యత్తులో వారికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందనే సంకేతాలను పంపుతోంది. క్షేత్రస్థాయిలో పట్టున్న మాజీ నేతలను ఎన్నికల బరిలో దింపడం ద్వారా ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చేయవచ్చని రేవంత్ భావిస్తున్నారు. అంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాజీ మావోయిస్టులకు ఒక సురక్షితమైన రాజకీయ పునరావాస కేంద్రం గా మారే అవకాశం ఉందని అనుకోవచ్చు. 

వ్యూహాత్మక ప్రయోజనం - దీర్ఘకాలిక ప్రభావం

మాజీ మావోయిస్టులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌కు రెండు విధాల లాభం చేకూరుతుంది. ఒకటి, వారికున్న కేడర్ బలం పార్టీకి తోడవుతుంది. రెండు, అట్టడుగు వర్గాల గొంతుకగా కాంగ్రెస్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. అయితే, ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది భవిష్యత్తులో జరిగే ఎన్నికలే నిర్ణయిస్తాయి. ఒకవైపు ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూనే, మరోవైపు సాయుధపోరాటం చేసి తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోయిన  వారిని తమ గూటికి చేర్చుకోవడం రేవంత్ రెడ్డి మార్కు  బోల్డ్  పాలిటిక్స్‌.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
Tamil Nadu Assembly Elections 2026: విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?
విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget