అన్వేషించండి

KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!

KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు, పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

KCR Petition: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఉదంతం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, డిజైన్ వైఫల్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ తీరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కమిషన్ నివేదికను, దాని ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 

ఏ ప్రాతిపదికన బాధ్యుడిని చేస్తారు?

ప్రాజెక్టు ప్రణాళిక, డిజైనింగ్, నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్ణయానికి ముఖ్యమంత్రిగా తానే బాధ్యుడినని జస్టిస్ ఘోష్ కమిషన్ ఏ ప్రాతిపదికన నిర్దారించిందో చెప్పాలని కేసీర్ హైకోర్టును కోరారు. కేవలం ప్రభుత్వం అందించిన రికార్డుల ఆధారంగా ఒక తుది నిర్ణయానికి రావడం సరికాదని, దానికి సంబంధించిన ఆధారాలను తన ముందు ఉంచి, తన వివరణ తీసుకున్న తర్వాతే కమిషన్ ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ ప్రక్రియలో కనీస విధివిధానాలు పాటించలేదని ధర్మాసనానికి నివేదించారు. 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమారు సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్ధీన్‌తో కూడిన ధర్మానసనం ఈ విచారణను చేపట్టింది. కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీష్‌రావు, ఐఏఎస్‌ అధికారి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్‌ ఎస్‌కే జోషి కూడా కమిషన్ ఏర్పాటు సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు. 

సాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారించడమేంటీ?

కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయమూర్తి దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ కమిషన్ విచారణ ప్రక్రియలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు. కమిషన్ చట్టంలోని సెక్షన్ 5 కింద కేసీఆర్‌కు నోటీసు ఇచ్చి, ఒక సాక్షిగా విచారణకు రావాలని పిలిచారని, కానీ నివేదికలో మాత్రం ఆయనను నేరుగా దోషిగా చెప్పారని పేర్కొన్నారు. ప్రాజెక్టు స్థల మార్పు  సలహాలను పట్టించుకోలేదని, డిజైన్ నుంచి టెండర్ల వరకు అన్నింటికీ కేసీఆరే బాధ్యుడని కమిషన్ నిర్దారించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి 7,500 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని కమిషన్‌ నివేదికలో పేర్కొందని వివరించారు. ఒక వ్యక్తి ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే అంశాలు ఉన్నప్పుడు సెక్షన్ 8బి, సీ ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వాలని, కానీ ఇక్కడ అది జరగలేదని వాదించారు. తనపై ఎవరూ ఆరోపణలు చేశారో చెప్పలేదని, ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం కూడా ఇవ్వలేదని వివరించారు. 

రాజకీయ లక్ష్యంతోనే సంక్షిప్త నివేదిక 

జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలోని అంశాలను సరి చూసుకోకుండానే కొందరు అధికారులు ఒక బృందంగా ఏర్పడి 60పేజీల నివేదికను తయారు చేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది ఆరోపించారు. ఈ నివేదికను కేవలం రాజకీయంగా దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రులు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ద్వారా మీడియాకు వెల్లడించారని పేర్కొన్నారు. విచారణ కమిషన్ నివేదికను నేరుగా అసెంబ్లీలో చర్చించకుండా పిటిషనర్లు కనీసం కాపీ ఇవ్వకుండా బహిర్గతం చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని అందుకే కమిషన్‌ను, నివేదికను రద్దు చేయాలని కోరారు. 

పిటిషనర్ల తరఫున వాదనలు పూర్తి కావడంతో, ప్రభుత్వం తన వాదనలు వినిపించాల్సి ఉంది. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించినందున ఈ పిటిషన్లపై విచారణ అవసరం లేదన్న వాదన కేసిఆర్ తరఫున న్యాయవాదులు తోసిపుచ్చారు.     

Frequently Asked Questions

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు సంబంధించి కేసీఆర్ పిటిషన్ ఎందుకు వేశారు?

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్ వైఫల్యాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను, దాని ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

జస్టిస్ ఘోష్ కమిషన్ తనను ఏ ప్రాతిపదికన బాధ్యుడిగా చేసిందని కేసీఆర్ ప్రశ్నించారు?

ప్రాజెక్టు ప్రణాళిక, డిజైనింగ్, నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్ణయానికి ముఖ్యమంత్రిగా తానే బాధ్యుడినని కమిషన్ ఏ ప్రాతిపదికన నిర్ధారించిందో చెప్పాలని కేసీఆర్ కోరారు.

కమిషన్ విచారణ ప్రక్రియలో కేసీఆర్ తరఫు న్యాయవాదులు ఎటువంటి లోపాలను ఎత్తి చూపారు?

కేసీఆర్ ను సాక్షిగా పిలిచి, నివేదికలో మాత్రం నేరుగా దోషిగా పేర్కొన్నారని, ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, వివరణ తీసుకోలేదని వాదించారు.

జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక వెనుక రాజకీయ లక్ష్యం ఉందని పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎందుకు ఆరోపించారు?

ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా మీడియాకు వెల్లడించారని, రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఈ నివేదిక తయారు చేయబడిందని ఆరోపించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Joginapally Santosh Kumar: మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ గ్రీన్‌ ఐకాన్‌ అవార్డు
మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ గ్రీన్‌ ఐకాన్‌ అవార్డు
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Tank Bund Shiva:ట్యాంక్‌బండ్‌లో దూకేవాళ్ల కథలన్నీ అలాంటివే! ట్యాంక్ బండ్ శివతో ABPదేశం ఇంట్రాక్షన్
ట్యాంక్‌బండ్‌లో దూకేవాళ్ల కథలన్నీ అలాంటివే! ట్యాంక్ బండ్ శివతో ABPదేశం ఇంట్రాక్షన్
Hyderabad Crime News: పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
Advertisement

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
World Health Day : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget