అన్వేషించండి

KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!

KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు, పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాళేశ్వరం బ్యారేజీల లోపాలపై కమిషన్ ఏర్పాటును కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు.
  • కనీస విధివిధానాలు పాటించకుండానే తనను దోషిగా ప్రకటించారని కేసీఆర్ వాదించారు.
  • నివేదికను రాజకీయ లక్ష్యంతోనే బహిర్గతం చేశారని పిటిషనర్లు ఆరోపించారు.
  • తదుపరి విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా పడింది.

KCR Petition: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఉదంతం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, డిజైన్ వైఫల్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ తీరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కమిషన్ నివేదికను, దాని ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 

ఏ ప్రాతిపదికన బాధ్యుడిని చేస్తారు?

ప్రాజెక్టు ప్రణాళిక, డిజైనింగ్, నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్ణయానికి ముఖ్యమంత్రిగా తానే బాధ్యుడినని జస్టిస్ ఘోష్ కమిషన్ ఏ ప్రాతిపదికన నిర్దారించిందో చెప్పాలని కేసీర్ హైకోర్టును కోరారు. కేవలం ప్రభుత్వం అందించిన రికార్డుల ఆధారంగా ఒక తుది నిర్ణయానికి రావడం సరికాదని, దానికి సంబంధించిన ఆధారాలను తన ముందు ఉంచి, తన వివరణ తీసుకున్న తర్వాతే కమిషన్ ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ ప్రక్రియలో కనీస విధివిధానాలు పాటించలేదని ధర్మాసనానికి నివేదించారు. 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమారు సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్ధీన్‌తో కూడిన ధర్మానసనం ఈ విచారణను చేపట్టింది. కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీష్‌రావు, ఐఏఎస్‌ అధికారి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్‌ ఎస్‌కే జోషి కూడా కమిషన్ ఏర్పాటు సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు. 

సాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారించడమేంటీ?

కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయమూర్తి దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ కమిషన్ విచారణ ప్రక్రియలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు. కమిషన్ చట్టంలోని సెక్షన్ 5 కింద కేసీఆర్‌కు నోటీసు ఇచ్చి, ఒక సాక్షిగా విచారణకు రావాలని పిలిచారని, కానీ నివేదికలో మాత్రం ఆయనను నేరుగా దోషిగా చెప్పారని పేర్కొన్నారు. ప్రాజెక్టు స్థల మార్పు  సలహాలను పట్టించుకోలేదని, డిజైన్ నుంచి టెండర్ల వరకు అన్నింటికీ కేసీఆరే బాధ్యుడని కమిషన్ నిర్దారించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి 7,500 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని కమిషన్‌ నివేదికలో పేర్కొందని వివరించారు. ఒక వ్యక్తి ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే అంశాలు ఉన్నప్పుడు సెక్షన్ 8బి, సీ ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వాలని, కానీ ఇక్కడ అది జరగలేదని వాదించారు. తనపై ఎవరూ ఆరోపణలు చేశారో చెప్పలేదని, ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం కూడా ఇవ్వలేదని వివరించారు. 

రాజకీయ లక్ష్యంతోనే సంక్షిప్త నివేదిక 

జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలోని అంశాలను సరి చూసుకోకుండానే కొందరు అధికారులు ఒక బృందంగా ఏర్పడి 60పేజీల నివేదికను తయారు చేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది ఆరోపించారు. ఈ నివేదికను కేవలం రాజకీయంగా దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రులు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ద్వారా మీడియాకు వెల్లడించారని పేర్కొన్నారు. విచారణ కమిషన్ నివేదికను నేరుగా అసెంబ్లీలో చర్చించకుండా పిటిషనర్లు కనీసం కాపీ ఇవ్వకుండా బహిర్గతం చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని అందుకే కమిషన్‌ను, నివేదికను రద్దు చేయాలని కోరారు. 

పిటిషనర్ల తరఫున వాదనలు పూర్తి కావడంతో, ప్రభుత్వం తన వాదనలు వినిపించాల్సి ఉంది. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించినందున ఈ పిటిషన్లపై విచారణ అవసరం లేదన్న వాదన కేసిఆర్ తరఫున న్యాయవాదులు తోసిపుచ్చారు.     

Frequently Asked Questions

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు సంబంధించి కేసీఆర్ పిటిషన్ ఎందుకు వేశారు?

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్ వైఫల్యాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను, దాని ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

జస్టిస్ ఘోష్ కమిషన్ తనను ఏ ప్రాతిపదికన బాధ్యుడిగా చేసిందని కేసీఆర్ ప్రశ్నించారు?

ప్రాజెక్టు ప్రణాళిక, డిజైనింగ్, నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్ణయానికి ముఖ్యమంత్రిగా తానే బాధ్యుడినని కమిషన్ ఏ ప్రాతిపదికన నిర్ధారించిందో చెప్పాలని కేసీఆర్ కోరారు.

కమిషన్ విచారణ ప్రక్రియలో కేసీఆర్ తరఫు న్యాయవాదులు ఎటువంటి లోపాలను ఎత్తి చూపారు?

కేసీఆర్ ను సాక్షిగా పిలిచి, నివేదికలో మాత్రం నేరుగా దోషిగా పేర్కొన్నారని, ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, వివరణ తీసుకోలేదని వాదించారు.

జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక వెనుక రాజకీయ లక్ష్యం ఉందని పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎందుకు ఆరోపించారు?

ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా మీడియాకు వెల్లడించారని, రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఈ నివేదిక తయారు చేయబడిందని ఆరోపించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
Revanth Friendship With Modi: రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget