అన్వేషించండి

Revanth Reddy on KCR: వేల కోట్లు సంపాదించుకుంటే జాతిపిత అవుతారా - కేసీఆర్‌పై రేవంత్ సెటైర్లు

CM Revanth: తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ చేస్తున్న వాదనపై రేవంత్ కౌంటర్ ఇచ్చారు. వేల కోట్లు దోచుకున్నవారు జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు.

Revanth counters BRS on Phone Tapping Case: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత గా అభివర్ణిస్తూ, ఆయనకు నోటీసులు ఇవ్వడాన్ని ప్రశ్నించడంపై  సీఎం రేవంత్ రెడ్డి  సెటైర్లు వేశారు.  నిజమైన జాతిపిత మహాత్మా గాంధీ.. పదవులను త్యాగం చేసి, తూటాలకు ప్రాణాలర్పించారు. కానీ, ఇక్కడ జాతిపిత అని చెప్పుకుంటున్న వారు పదవులు, వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు  అని మండిపడ్డారు. ప్రజలు తమను తిరస్కరించినప్పుడు హుందాగా తప్పులు ఒప్పుకుంటే గౌరవం ఉండేదని, కానీ ప్రజలే తప్పు చేశారనే ధోరణిలో మాట్లాడటం ఏ రకమైన ఉద్యమకారుడి లక్షణమని ఆయన ప్రశ్నించారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారణ చేయడంతో  బీఆర్ఎస్ శ్రేణుల విమర్శలకు ముఖ్యమంత్రి అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు.  రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన  ప్రసంగించారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణను బీఆర్ఎస్ నేతలు 'రాజకీయ కక్ష సాధింపు'గా అభివర్ణించడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారని, అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.  మనం దైవాంశ సంభూతులం కాదు.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని అంబేద్కర్ చెప్పారు  అని గుర్తు చేశారు.  శిబు సోరెన్ వంటి పెద్ద నాయకులే విచారణ ఎదుర్కొన్నప్పుడు, ఇక్కడ ప్రత్యేక మినహాయింపులు ఎవరికీ ఉండవని తేల్చి చెప్పారు.
  
గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారుల పట్ల వ్యవహరించిన తీరును రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి, బెడ్ రూమ్ నుంచి ఈడ్చుకెళ్లి అరెస్టు చేసినప్పుడు ఈ  ఉద్యమ స్ఫూర్తి' ఏమైంది? అని నిలదీశారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం నోటీసులు ఇచ్చి, గౌరవప్రదంగా విచారణకు పిలిచిందని.. బీఆర్ఎస్ హయాంలా అరాచకంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. రావి నారాయణ రెడ్డి వంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారని, అలాంటి మహనీయుల వారసత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని అన్నారు.        

 
మధ్యయుగాల చక్రవర్తులు తమ వ్యక్తిగత బాధను  రాజ్యం బాధగా ప్రచారం చేసుకునేవారని, ఇప్పుడు కేసీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు కూడా తమపై జరుగుతున్న విచారణలను తెలంగాణకు జరిగిన అవమానంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.  చక్రవర్తుల కాలం చెల్లిపోయింది, ఇది ప్రజాస్వామ్యం అని గుర్తు చేస్తూ, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూనే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Malkajgiri Police: రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget