Ajith Kumar Madhavan : దుబాయ్లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
Ajith Kumar Reaction : ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వేళ దుబాయ్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో దుబాయ్లో ఉన్న హీరోస్ అజిత్, మాధవన్ గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Ajith Kumar Madhavan Are Safe In Dubai : ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వేళ... కువైట్, ఖతార్, యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. కొందరు భారతీయ నటులు ఆయా దేశాల్లో చిక్కుకోగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో దుబాయ్లో కోలీవుడ్ స్టార్స్ అజిత్ కుమార్, ఆర్ మాధవన్ల గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీంతో వారి టీమ్స్ రియాక్ట్ అవుతూ కీ అనౌన్స్మెంట్ చేశాయి.
స్టార్స్ సేఫ్
హీరో అజిత్ కుమార్, మాధవన్ ఇద్దరూ సేఫ్గానే ఉన్నట్లు తెలిపింది. మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం ఇటీవల అజిత్ ఎక్కువగా దుబాయ్లోనే ఉంటున్నారు. రీసెంట్గా ఆయన చెన్నై రిటర్న్ కావాల్సి ఉండగా దుబాయ్ ఎయిర్ పోర్ట్ మూసేయడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అజిత్ క్షేమంగానే ఉన్నారని... ఆయన ప్రణాళికల్లో మార్పులు చేసుకున్నట్లు అజిత్ మేనేజర్ తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు.
ఇక ఆర్ మాధవన్ సైతం తాను సేఫ్గానే ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను దుబాయ్లో లేనని ఫ్యామిలీతో సహా అమెరికాలో ఉన్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
రీసెంట్గా టాలీవుడ్ హీరో విష్ణు మంచుకు కూడా దుబాయ్లో భయానక అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో పాటు దుబాయ్ పర్యటనలో ఉండగా... మిస్సైల్ పేలుడు టైంలో వారి ఇల్లు షేక్ అయినట్లు విష్ణు తెలిపారు. ఈ వీడియో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇక దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుడు తమను ఎంతో భయాందోళనకు గురి చేసిందని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వీడియో రిలీజ్ చేశారు.
అటు, హీరోయిన్ సోనాల్ చౌహాన్ సైతం ప్రధాని మోదీ సహాయం కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న ఆమె... వార్ టెన్షన్ మధ్య చిక్కుకున్నానని... ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడంతో ఇండియాకు తిరిగి రావడానికి క్లియర్ రూట్ కనిపించడం లేదని తెలిపారు. సురక్షితంగా రావడానికి వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు.

























