అన్వేషించండి

Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?

Telangana Govt News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల సర్కార్‌పై అదనంగా రూ.1500 కోట్ల భారం పడనుంది.

Telangana News: తెలంగాణలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా రేవంత్‌రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ‌్యం అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు అందజేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందజేయనున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా మరో 1500 కోట్ల భారం పడనుంది.

పేదలకు సన్నబియ్యం
తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం అందనున్నాయి. పేదలకు రూపాయికే  కిలో బియ్యం అందజేస్తున్నా...ప్రజలెవ్వవరూ వాటిని తినడం లేదు. కొందరు కనీసం బియ్యం తీసుకోకుండా రేషన్ దుకాణాల్లోనే ఆ మేరకు డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం ఏమాత్రం తినడానికి పనికిరావని ప్రజలు చెబుతున్నారు. దీంతో ఆ బియ్యం వివిధ మార్గాల ద్వారా  కాకినాడ, చెన్నై పోర్టులకు చేరి అక్కడి నుంచి విదేశాలకు తరలిపోతోంది. దీంతో పేదలకు సన్నబియ్యమే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ముందుగానే కసరత్తు ప్రారంభించిన  సర్కార్....ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు పెద్దఎత్తున సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించింది. క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో  రాష్ట్రవ్యాప్తంగా  రైతులు సైతం ఈసారి సన్న వడ్లు పండించారు.

అదనపు వ్యయం
రాష్ట్రంలో మొత్తం 89.60 లక్షల మంది  రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ బియ్యం పంపిణీ చేయాలంటే  నెలకు 2 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతుంది. ఏటా  24 లక్షల టన్నుల సన్న బియ్యం కావాలని అధికారులు అంచనాలు రూపొందించారు. మొత్తం 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు  ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ బియ్యంపై రాష్ట్రప్రభుత్వం 3వేల600 కోట్ల సబ్సిడీ భరిస్తుండగా... సన్నబియ్యంతో పంపిణీతో మరో 1,500 కోట్లు భారం పెరిగే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 20 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. 

ఉగాది నుంచి ప్రారంభం
తెలుగు సంవత్సరాది  ఉగాది నుంచే పేదలందరికీ రేషన్‌కార్డులపై ఉచితంగానే  సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు  నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కొత్త రేషన్‌ కార్డుల కోసం 20 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..వారిలో కనీసం 10 లక్షల మందికి కార్డులు ఇవ్వనున్నట్లు  సమాచారం. దొడ్డు బియ‌్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ ద్వారా  పేదలు ఉపయోగంతోపాటు వరి ధాన్యం పండించే రైతులనూ ఆదుకోవచ్చని సర్కార్ భావిస్తోంది. అలాగే రేషన్ బియ్యం అక్రమాలను అరికట్టవచ్చని  ప్రభుత్వం భావిస్తోంది.

బియ్యం బ్లాక్ మార్కెటింగ్‌కు కళ్లెం వేయవచ్చని అంచనా వేస్తోంది. సన్నబియ్యం సేకరణకు కిలోకు  55 రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 36 రూపాయలు  కేంద్రం భరిస్తుండగా...మిగిలిన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే సర్దుబాటు చేయాల్సి ఉంది. సంక్రాంతి కానుకగానే పేదలకు సన్నబియ్యం పంపిణీకి సర్కార్ ఏర్పాట్లు చేయగా....రైతుల నుంచి సేకరించిన సన్న వడ్లు కనీసం రెండు నెలలైనా  నిల్వ  చేస్తేనే బాగుంటాయని...ఇప్పటికిప్పుడు కొత్త బియ్యం అందజేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అధికారులు సీఎంకు సూచించారు. దీంతో ఉగాది నాటికి బియ్యం సిద్ధం చేసి పంపిణీ చేసేందుకు రేవంత్‌రెడ్డి  ప్రభుత్వం యోచిస్తోంది.

Also Read: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి`

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Embed widget