అన్వేషించండి

Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?

Telangana Govt News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల సర్కార్‌పై అదనంగా రూ.1500 కోట్ల భారం పడనుంది.

Telangana News: తెలంగాణలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా రేవంత్‌రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ‌్యం అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు అందజేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందజేయనున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా మరో 1500 కోట్ల భారం పడనుంది.

పేదలకు సన్నబియ్యం
తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం అందనున్నాయి. పేదలకు రూపాయికే  కిలో బియ్యం అందజేస్తున్నా...ప్రజలెవ్వవరూ వాటిని తినడం లేదు. కొందరు కనీసం బియ్యం తీసుకోకుండా రేషన్ దుకాణాల్లోనే ఆ మేరకు డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం ఏమాత్రం తినడానికి పనికిరావని ప్రజలు చెబుతున్నారు. దీంతో ఆ బియ్యం వివిధ మార్గాల ద్వారా  కాకినాడ, చెన్నై పోర్టులకు చేరి అక్కడి నుంచి విదేశాలకు తరలిపోతోంది. దీంతో పేదలకు సన్నబియ్యమే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ముందుగానే కసరత్తు ప్రారంభించిన  సర్కార్....ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు పెద్దఎత్తున సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించింది. క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో  రాష్ట్రవ్యాప్తంగా  రైతులు సైతం ఈసారి సన్న వడ్లు పండించారు.

అదనపు వ్యయం
రాష్ట్రంలో మొత్తం 89.60 లక్షల మంది  రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ బియ్యం పంపిణీ చేయాలంటే  నెలకు 2 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతుంది. ఏటా  24 లక్షల టన్నుల సన్న బియ్యం కావాలని అధికారులు అంచనాలు రూపొందించారు. మొత్తం 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు  ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ బియ్యంపై రాష్ట్రప్రభుత్వం 3వేల600 కోట్ల సబ్సిడీ భరిస్తుండగా... సన్నబియ్యంతో పంపిణీతో మరో 1,500 కోట్లు భారం పెరిగే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 20 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. 

ఉగాది నుంచి ప్రారంభం
తెలుగు సంవత్సరాది  ఉగాది నుంచే పేదలందరికీ రేషన్‌కార్డులపై ఉచితంగానే  సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు  నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కొత్త రేషన్‌ కార్డుల కోసం 20 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..వారిలో కనీసం 10 లక్షల మందికి కార్డులు ఇవ్వనున్నట్లు  సమాచారం. దొడ్డు బియ‌్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ ద్వారా  పేదలు ఉపయోగంతోపాటు వరి ధాన్యం పండించే రైతులనూ ఆదుకోవచ్చని సర్కార్ భావిస్తోంది. అలాగే రేషన్ బియ్యం అక్రమాలను అరికట్టవచ్చని  ప్రభుత్వం భావిస్తోంది.

బియ్యం బ్లాక్ మార్కెటింగ్‌కు కళ్లెం వేయవచ్చని అంచనా వేస్తోంది. సన్నబియ్యం సేకరణకు కిలోకు  55 రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 36 రూపాయలు  కేంద్రం భరిస్తుండగా...మిగిలిన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే సర్దుబాటు చేయాల్సి ఉంది. సంక్రాంతి కానుకగానే పేదలకు సన్నబియ్యం పంపిణీకి సర్కార్ ఏర్పాట్లు చేయగా....రైతుల నుంచి సేకరించిన సన్న వడ్లు కనీసం రెండు నెలలైనా  నిల్వ  చేస్తేనే బాగుంటాయని...ఇప్పటికిప్పుడు కొత్త బియ్యం అందజేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అధికారులు సీఎంకు సూచించారు. దీంతో ఉగాది నాటికి బియ్యం సిద్ధం చేసి పంపిణీ చేసేందుకు రేవంత్‌రెడ్డి  ప్రభుత్వం యోచిస్తోంది.

Also Read: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి`

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget