అన్వేషించండి

CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు

Vijayawada News: 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ పటమటలోని దత్త పీఠాన్ని సందర్శించిన ఆయన గణపతి సచ్చిదానంద స్వామితో సమావేశమయ్యారు.

CM Chandrababu Visit Datta Peetham In Vijayawada: ఉమ్మడి రాష్ట్రంలో విజన్ - 2020 అని ప్రకటిస్తే చాలా మంది తప్పుబట్టారని.. కానీ, ఆ విజన్ ఫలితాలు నేడు అందరికీ కనిపిస్తున్నాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. విజయవాడ (Vijayawada) పటమటలోని దత్త పీఠాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీఎంకు గణపతి సచ్చిదానంద స్వామి ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలోని 42 ప్రాంతాల్లో చేపట్టబోయే దత్త క్షేత్రనాథ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అనంతరం మాట్లాడారు. సమాజహితం కోసమే సచ్చిదానంద పని చేస్తున్నారని కొనియాడారు. 'స్వామీజీని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. సంపద రావాలి.. ప్రజలు సంతోషంగా ఉండాలి. ఈ విషయంలో వెనకడుగు వేసేదే లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మనకు తోడుగా ఉండాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలి. పేదరికం పూర్తిగా పోవాలి. ప్రజలు సంతోషంగా ఉండాలి. పేదరికం పూర్తిగా పోవాలి. రాష్ట్రాన్ని స్వర్ణాంద్ర వైపు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

అటు, చంద్రబాబు కర్మయోగి అని.. ఆయన సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని గణపతి సచ్చిదానందస్వామి అన్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడమే కాకుండా.. స్వర్ణాంధ్ర సాకారం కావడం తథ్యమని పేర్కొన్నారు. ఆయనకు కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులు

మరోవైపు, రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు రానున్నాయి. వీటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను గ్రౌండ్ చేసే పనులు మొదలుపెట్టింది. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం ఎయిర్‌పోర్టులను అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. కర్నూల్ ఎయిర్ పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా... పుట్టపర్తి ప్రైవేటు ఎయిర్ స్ట్రిప్‌గా ఉంది. వీటికి తోడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సిద్ధం అవుతోంది. అయితే పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో కొత్తగా మరో 7 ఎయిర్‌పోర్టులను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్ పోర్టుల విస్తరణ, నిర్మాణంతో పాటు, కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష చేశారు. ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడుతో పాటు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ప్రభుత్వం కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని - అన్నవరం, ఒంగోలులో కొత్తగా ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయనుంది. కుప్పం ఎయిర్‌పోర్ట్ కోసం ఫీజిబులిటీ రిపోర్ట్ సిద్ధం చేయగా.. 2 దశల్లో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరగనుంది. మొత్తం 1200 ఎకరాలు ఇప్పటికే గుర్తించారు. శ్రీకాకుళం ఎయిర్‌పోర్టును 2 ఫేజుల్లో 1,383 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. దగదర్తి పోర్టుకు 635 ఎకరాల భూసేకరణ పూర్తి కాగా.. మరో 745 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఒంగోలు ఎయిర్‌పోర్ట్ కోసం 657 ఎకరాలు గుర్తించారు.

Also Read: Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma: అన్నీ ఉమ్మడి ఆస్తులే - అందరికీ సమానంగా చెందుతాయి - వైఎస్ విజయమ్మ సంచలన అఫిడవిట్
అన్నీ ఉమ్మడి ఆస్తులే - అందరికీ సమానంగా చెందుతాయి - వైఎస్ విజయమ్మ సంచలన అఫిడవిట్
Lokesh Latest News: వీడిన నారా లోకేశ్ పూజ గదిలోని బొమ్మ మిస్టరీ! క్షుద్ర పూజలంటూ వస్తున్న విమర్శలపై మంత్రి వివరణ! 
వీడిన నారా లోకేశ్ పూజ గదిలోని బొమ్మ మిస్టరీ! క్షుద్ర పూజలంటూ వస్తున్న విమర్శలపై మంత్రి వివరణ! 
Ambedkar Konaseema Latest News: మృతదేహం త‌ర‌లింపులో వివాదం- చివ‌రి మ‌జిలీలోనూ వివ‌క్ష చూపిస్తున్నారంటూ ద‌ళిత సంఘాల ఆందోళన!
మృతదేహం త‌ర‌లింపులో వివాదం- చివ‌రి మ‌జిలీలోనూ వివ‌క్ష చూపిస్తున్నారంటూ ద‌ళిత సంఘాల ఆందోళన!
Chiranjeevi : ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్
ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana Budget 2026-27: 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
Ustaad Bhagat Singh Collection Day 1 : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget