అన్వేషించండి

UPI: ఫోన్‌ తియ్‌-పే చెయ్‌, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్‌

మే నెలలో జరిగిన 9.41 బిలియన్ల లావాదేవీల ద్వారా 14.89 లక్షల కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి.

UPI Payments in May 2023: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో, UPI ట్రాన్జాక్షన్లు 9 బిలియన్లకు చేరుకున్నాయని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. దేశంలో రిటైల్ పేమెంట్లు & సెటిల్‌మెంట్ సిస్టమ్‌ను నిర్వహించే ఈ అంబ్రెల్లా బాడీ, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ సమాచారాన్ని షేర్‌ చేసింది.

మే నెలలో జరిగిన 9.41 బిలియన్ల లావాదేవీల ద్వారా 14.89 లక్షల కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. 2022 మే నెలతో పోలిస్తే, లావాదేవీల సంఖ్య 2023 మే నెలలో 58% పెరిగింది. అదే కాలంలో, లావాదేవీల మొత్తం విలువ 43% పెరిగింది.

ఏప్రిల్‌లో 8.89 బిలియన్ల లావాదేవీలు జరిగాయి, రూ. 14.07 లక్షల కోట్లు చేతులు మారాయి. అంతకుముందు నెల మార్చిలో 8.68 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. రూ. 14.10 లక్షల కోట్లు ఒక అకౌంట్‌ నుంచి మరొక అకౌంట్‌కు మొబైల్‌ ద్వారా బదిలీ అయ్యాయి. గత మూడు నెలల్లో, యూపీఐ ద్వారా ప్రతి నెలలోనూ రూ. 14 లక్షల కోట్లకు తక్కువ విలువైన లావాదేవీలు జరిగాయి. డేటా ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంలో 83 బిలియన్ల లావాదేవీలను NPCI ప్రాసెస్ చేసింది, వాటి మొత్తం విలువ రూ. 139 లక్షల కోట్లు. 2022 ఆర్థిక సంవత్సరంలోని రూ. 84 లక్షల కోట్ల విలువైన 38 బిలియన్ల లావాదేవీల నుంచి ఇది పెరిగింది.

2026-27 నాటికి 379 బిలియన్ల లావాదేవీలు 
"ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్‌బుక్ - 2022-27" రిలీజ్‌ చేసిన మరొక నివేదిక ప్రకారం, 2022-23 కాలంలో, మొత్తం UPI లావాదేవీల పరిమాణంలో రిటైల్ చెల్లింపుల వాటా 75 శాతంగా ఉంది. ఇండియన్‌ డిజిటల్ పేమెంట్స్‌ 50 శాతం CAGR వద్ద స్థిరంగా వృద్ధి సాధిస్తున్నాయని ఆ రిపోర్ట్‌ పేర్కొంది. ఆ లెక్క ప్రకారం, FY 2022-23లో 103 బిలియన్ల నుంచి FY 2026-27లో 411 బిలియన్ల లావాదేవీలకు భారత్‌ చేరుకుంటుందని అంచనా. 2027 నాటికి ప్రతిరోజూ 1 బిలియన్ డాలర్ల రికార్డు లావాదేవీలు జరుగుతాయని, 2026-27 నాటికి 83.71 బిలియన్ లావాదేవీల నుంచి 379 బిలియన్ లావాదేవీలకు పెరుగుతుందని నివేదిక పేర్కొంది.

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌ పెరుగుతాయి 
ఇటీవల, క్రెడిట్ కార్డ్‌లను కూడా యూపీఐకి అనుసంధానం చేయడం వల్ల డిజిటల్‌ పేమెంట్స్‌లో మరింత వేగం పెరుగుతుంది. ఇకపై, డెబిట్ కార్డ్‌ల కంటే క్రెడిట్ కార్డ్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతాయని "ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్‌బుక్ - 2022-27" నివేదికలో వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి, డెబిట్ కార్డ్‌ల కంటే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే UPI లావాదేవీలు ఎక్కువగా ఉంటాయని అంచనా. వచ్చే ఐదేళ్లలో క్రెడిట్ కార్డుల జారీ 21 శాతం CAGR వద్ద వృద్ధి చెందుతుందని ఆ రిపోర్ట్‌ వెల్లడించింది. అయితే డెబిట్ కార్డ్‌ల జారీ మాత్రం 3 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని అంచనా వేసింది.

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: సిబిల్‌ స్కోర్‌ తక్కువైనా ఎడ్యుకేషన్‌ లోన్‌ వస్తుంది, హైకోర్ట్‌ కీలక నిర్దేశం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget