అన్వేషించండి

Free Meal in Railway station : విమానం లాగా, రైలు ఆలస్యమైనా 'ఉచితంగా ఆహారం' - చాలామందికి ఈ విషయం తెలీదు

Free Meal For Train Running Late: రైలు ఆలస్యం అయితే ప్రయాణీకులకు ఉచితంగా ఆహారాన్ని అందించే రూల్‌ ఉంది. చాలామందికి ఈ విషయం తెలీక, ఈ బెనిఫిట్‌ను మిస్‌ అవుతున్నారు.

Indian Railway Rules For Free Meal: మీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు విమానం టిక్కెట్‌ బుక్‌ చేసుకుని ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లినప్పుడు, మీ విమానం నాలుగు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం సదరు విమానయాన సంస్థ మీకు ఉచితంగా ఆహారాన్ని (Free Meal) అందిస్తుంది. విశేషం ఏంటంటే... ఈ రకమైన రూల్‌ కేవలం విమానాలకు సంబంధించిది మాత్రమే కాదు. భారతీయ రైల్వే నిర్వహించే రైళ్లకు కూడా ఈ రూల్‌ వర్తిస్తుంది. రైలు షెడ్యూల్ చేసిన సమయం కంటే ఆలస్యంగా నడుస్తుంటే (Late Train) ఈ నియమం వర్తిస్తుంది. లేట్‌గా నడుస్తున్న రైలులో టిక్కెట్‌ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులకు భారతీయ రైల్వే ఉచిత ఆహారాన్ని అందించాలి. అయితే, ఆలస్యంగా నడుస్తున్న ప్రతి రైలుకు ఈ రూల్‌ వర్తించదు. ప్రయాణీకులకు ఉచిత ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు, షరతులు విధించారు.

రైలు ఆలస్యాన్ని బట్టి ఉచిత ఆహారం       
భారతీయ రైల్వే, ప్రయాణీకుల సౌకర్యం కోసం చాలా నియమాలను రూపొందించింది. రైలు ఆలస్యానికి సంబంధించిన రూల్‌ వాటిలో ఒకటి. రైల్వే నిబంధనల ప్రకారం, రైలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయిన సందర్భంలో  ఆ రైలులోని ప్రయాణికులకు రైల్వే శాఖ ఉచితంగా ఆహారం అందిస్తుంది. ఇక్కడ కూడా మరో షరతు ఉంది, ఈ నియమం అన్ని రైళ్లకు వర్తించదు. రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajdhani Express), శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (Satabdi Express), దురంతో ఎక్స్‌ప్రెస్ (Duronto Express) వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులకు మాత్రమే ఉచిత ఆహారం అందుతుంది.

మరో ఆసక్తికర కథనం: ITR ఫైలింగ్‌, తప్పుల సవరణకు ఇప్పటికీ ఛాన్స్‌ - ఆలస్యం చేస్తే జైలుకు వెళ్తారు! 

రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే వ్యక్తులు మాత్రమే భారతీయ రైల్వే నుంచి ఉచిత ఆహార సౌకర్యాన్ని పొందేందుకు అర్హులు. మీరు ఎప్పుడైనా ఈ తరహా రైలు ప్రయాణిస్తున్నట్లయితే, ఆ రైలు నిర్ణీత సమయం కంటే 3 గంటల కంటే ఆలస్యంగా నడుస్తుంటే, మీకు ఉచితంగా ఆహారం అందుతుంది. ఒకవేళ రైల్వే శాఖ మీకు ఉచితంగా ఆహారం ఇవ్వకపోతే, ఆ విషయంపై మీరు ఫిర్యాదు చేయవచ్చు.

అందుబాటులోకి ఆహార దుకాణాలు
ఇలాంటిదే మరో రూల్‌ ఉంది. ఏదైనా రైలులో చాలా ఆలస్యంగా నడుస్తుంటే, ప్రయాణీకుల సౌకర్యం కోసం, రైల్వే యంత్రాంగం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఫుడ్ స్టాల్స్‌ను నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచుతుంది. తద్వారా ప్రయాణికులకు ఆహారం, పానీయాల విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తుంది. దీనితో పాటు, ప్రయాణీకుల భద్రత కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా RPF సిబ్బందిని కూడా మోహరిస్తుంది.

మరో ఆసక్తికర కథనం:  గోల్డ్‌ కొనేవాళ్లకు షాక్‌ - పెరిగిన పసిడి రేట్లు, రూ.లక్ష నుంచి దిగని వెండి 

టాప్ హెడ్ లైన్స్

EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget