అన్వేషించండి

Paris Olympics 2024: అమన్‌, సాధించెన్‌ ! రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకం

Olympic Games Paris 2024:: ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకం దక్కింది. కాంస్య పతక పోరులో అమన్‌ సెహ్రావత్‌ కాంస్య పతకంతో మెరిశాడు.

Aman Sehrawat Clinches Wrestling Bronze: రెజ్లింగ్‌లో వినేశ్‌ ఫొగాట్‌కు పతకం దక్కినట్లే దక్కి చేజారింది. ఆ నిర్వేదంలో ఈసారి భారత్‌కు కుస్తీ పోటీల్లో ఒక్క పతకమైనా రాకపోతుందా అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ ఆశలు నెరవేరలేదు. భారత కుస్తీ వీరులు అంచనాలను అందుకోలేకపోయారు. మరో రెండు రోజుల్లో విశ్వ క్రీడలకు తెరపడుతుందనగా.. రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌(Aman Sehrawat) సత్తా చాటాడు. విశ్వక్రీడల్లో సంచలన ప్రదర్శనతో మెరిశాడు. ఫైనల్ కు చేరడంలో విఫలమైన అమన్.. కాంస్య పతకపోరులో అద్భుత విజయాన్ని అందుకుని భారత్‌కు ఆరో పతకం అందించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ బౌట్ లో అమన్ సెరావత్ 13-5 పాయింట్లతో ప్యూర్టోరికాకు చెందిన డేరియన్ క్రూజ్‌పై ఏకపక్ష విజయం సాధించాడు. 
 

పతక సంబరం
అమన్‌ పతక ఆశలు నెరవేర్చడంతో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది. ఇప్పటి వరకు పారిస్‌ విశ్వక్రీడల్లో భారత్‌ ఆరు పతకాలను సాధించింది. ఇందులో ఒక రజతం.. ఐదు కాంస్యాలు ఉన్నాయి. బౌట్ ఆరంభంలో క్రూజ్ పాయింట్ సాధించి లీడ్ లోకి వెళ్లగా... అమన్‌ చాలా జాగ్రత్తగా ఆడాడు. అదును చూసుకుని క్రూజ్‌పై ఆధిపత్యం చెలాయించాడు. ఆరంభంలో వ్యూహాత్మకంగా క్రూజ్‌ను మ్యాచ్‌పై నుంచి బయటకు నెట్టి పాయింట్లు స్కోర్‌ చేసిన అమన్‌.. ఆ తర్వాత మ్యాట్‌పైనే క్రూజ్‌పై పట్టు సాధించాడు. చివరి నిమిషాల్లో దూకుడు ప్రదర్శించిన అమన్ వరుసగా పాయింట్లు సాధిస్తూ భారీ ఆధిక్యంలో వెళ్లి ఏకపక్ష విజయం అందుకున్నాడు. అమన్‌ ధాటికి ఓ దశలో క్రూజ్‌ నిశ్చేష్టుడయ్యాడు. ఆ తర్వాత ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన అమన్‌ కాంస్యాన్ని సాధించాడు. 
 

సెమీస్‌లో ఓడినా...
 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఒక్క సెమీస్‌ మినహా అమన్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. తొలి రౌండ్‌లో అమన్‌ నార్త్ మెసడోనియా రెజ్లర్ వ్లాదిమిర్ ఇగొరొవ్ పై ఏకంగా 10-0 పాయింట్లతో ఏకపక్ష విజయం సాధించాడు. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ బౌట్ లో అల్బేనియా రెజ్లర్ అబకరోవ్ పై కూడా అమన్ 12-0 పాయింట్ల తేడాతో సాధికారంగా ఘన విజయాన్ని అందుకుని సెమీస్ లోకి ప్రవేశించాడు. సెమీస్ పోరులో జపాన్ రెజ్లర్ హిగూచి చేతిలో అమన్ 0-10 పాయింట్ల తేడాతో ఓడాడు. పతకం సాధించిన తర్వాత భారత అభిమానులకు అమన్‌ అభివాదం చేశాడు. అనంతరం జాతీయ పతాకాన్ని చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ ఒలింపిక్స్‌లో కుస్తీ పోటీల్లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.  
 
హర్యాణ నుంచే...
అమ‌న్ సెహ్రావ‌త్ హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని బీరోహార్ ప్రాంతానికి చెందిన రెజ్లర్. 10 ఏళ్ల వయస్సులోనే తల్లిని కోల్పోయిన అమన్‌... 11 ఏళ్లకే తండ్రిని కోల్పోయాడు. మేనమామ సంర‌క్షణ‌లో పెరిగిన అమన్‌ కష్టాలు దాటుతూ ఇప్పుడు కాంస్య పతకంతో సత్తా చాటాడు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
NTRNeel Project: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
Sai Pallavi: సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?
సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా ?
Maha Kumbh: ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో  పుణ్యస్నానం చేయించేస్తున్నారు.
ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయించేస్తున్నారు.
Embed widget