అన్వేషించండి

Hyderabad Crime News:గుజరాత్‌లో కాన్పులు- హైదరాబాద్‌లో ఏడుపులు- పోలీసుల స్టింగ్ ఆపరేషన్‌ సంచలనం 

Hyderabad Crime News:గుజరాత్ నుంచి పసి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారితోపాటు కొంటున్న దంపతులను కూడా అరెస్టు చేశారు.

Hyderabad Crime News:చిన్న పిల్లలతో వ్యాపారం చేసే ముఠాలు ఈ మధ్య కాలంలో రెచ్చిపోతున్నాయి. సంతానం లేని దంపతుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని చేయకూడని నీచమైన పనులు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలాంటి వారంతా ముఠాలుగా ఏర్పడి పెద్ద పెద్ద నెట్‌వర్క్‌లను ఫామ్ చేసి అప్పుడే పుట్టిన పసికందులను కిడ్నాప్‌ చేస్తూ దందాలు సాగిస్తున్నాయి. 

హైదరాబాద్‌ పోలీసుల స్టింగ్ ఆపరేషన్

చైతన్యపురి పోలీసుల, మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి ఓ స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌లో సంచలనం సృష్టించిన ఓ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు అయింది. అంతర్‌రాష్ట్ర గ్యాంగ్‌కు చెందిన 11 మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడే పుట్టిన శిశువులను తీసుకొచ్చి అవసరమైన తల్లిదండ్రులకు అమ్మకాలు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన నలుగురు పిల్లల అమ్మకాలు చేయనీయకుండా అడ్డుకున్నారు. 

వీళ్లంతా కలిసి ఓ నెట్‌వర్క్‌గా ఏర్పడి వివిధ రాష్ట్రాల్లో టీంలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా గుజరాత్‌ నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్మకాలు సాగించారు. విషయం ముందే తెలుసుకున్న పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు. అంతే ముఠా గుట్టు వీడింది. వీళ్లతోపాటు చట్ట విరుద్ధంగా పిల్లలను కొంటున్న తల్లిదండ్రులను కూడా అరెస్టు చేశారు. 

Also Read: ఒకే వేదికపై పెళ్లి మంత్రాలు, క్రికెట్‌ కామెంటరీ- ఆదిలాబాద్‌ వివాహ వేడుక వైరల్

ఈ ముఠాకు చెందిన వారు గుజరాత్‌లో పిల్లల్ని పోషించలేని తల్లిదండ్రులను పట్టుకుంటారు. వారికి డబ్బులను ఎర చూపించి అప్పుడే పుట్టిన పిల్లల్ని కొనుక్కొని తీసుకొస్తారు. హైదరాబాద్‌లో ఉన్న ముఠా సభ్యులు ముందుగానే ఇక్కడ కొనే వ్యక్తులను గుర్తించి వారితో మాట్లాడి పెడతారు. అలా తీసుకొచ్చిన బిడ్డల్ని వాళ్లకు ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. 

గుజరాత్‌ నుంచి తీసుకొచ్చే ఆడ శిశువును రెండున్నర లక్షలకు, మగ శిశువు అయితే నాలుగున్నర లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. ముందుగా కొంత డబ్బులు ఇచ్చిన తర్వాతే వీళ్లకు బిడ్డల్ని తీసుకొచ్చి ఇస్తారు. గుజరాత్‌ నుంచి హైదరాబాద్‌ వరకు ఇదో పెద్ద నెట్‌వర్క్‌ అనిపోలీసులు చెబుతున్నారు. ఇంకా ఇందులో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం చిక్కిన వారిని విచారించి మరిన్ని వివరాలు రాబడతామన్నారు. 

Also Read: తెలంగాణలో ఎరువుల కొరతపై కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి కీలక ప్రకటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget