అన్వేషించండి

Telangana Latest News: తెలంగాణలో ఎరువుల కొరతపై కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి కీలక ప్రకటన

Telangana Latest News: తెలంగాణలో ఎరువుల కొరత లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కావాలనే కొందరు కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

Telangana Latest News: తెలంగాణలో ఎరువుల కొరత ఉందంటు జరిగిన ప్రచారంపై కేంద్రమంత్రి స్పందించారు. కావాలనే కొరత సృష్టింటే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎరువుల కొరత ఉందంటూ సోషల్ మీడియాలో ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు హరీష్‌రావు. 

తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరతపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దేశంలో రైతాంగానికి అండగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని నిలబడిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. పీఎం కిసాన్​ డబ్బులు రైతుల ఖాతాల్లో వేసిన వేల మాట్లడుతూ ఏడాదికి మూడు సార్లు, ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. వందకు వందశాతం రైతుల పంట ఉత్పత్తులు పెంచేందుకు, సాగు, ఎరువులు, విత్తనాలు ఖర్చుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా ఈ నిధులు ఉపయోగపడుతున్నాయని అన్నారు. అనేక అడ్డంకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉన్నా కేంద్రప్రభుత్వం రెగ్యులర్‌గా పీఎం కిసాన్​ నిధులు అందజేస్తుందన్నారు కిషన్ రెడ్డి. 19వ విడత డబ్బులు 9.08 కోట్ల మంది అకౌంట్లలో రూ. 22 కోట్లు జమ చేశామన్నారు. తెలంగాణలో 31 లక్షల మంది రైతులు లబ్ధి పొందారన్నారు. డైరెక్టర్​ బెనిఫిట్​ ట్రాన్స్​ ఫర్​ కింద పీఎం కిసాన్​ సన్మాన్​ నిధి డబ్బులు అందజేస్తున్నామన్నారు. 

ఇటీవల తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు క్యూలైన్లలో చెప్పులు పెట్టుకొని ఎరువుల కోసం  ఎదురు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయన్నారు. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జేపీ నడ్డాతో మాట్లాడానన్నారు. అనేక ప్రాంతాల్లో రైతులు ఎరువుల కోసం ఆందోళన చేస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తే, ప్రభుత్వం అడిగిన దాని కంటేఎక్కువ కోటా విడుదల చేశామన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే కొంతమంది వ్యాపారస్థులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. 

పాత అలవాటు ప్రకారం కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు కిషన్‌ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ అంచనాల ప్రకారం 2024–25 రబీ సీజన్​ 9.5 లక్షల మెట్రిక్​ టన్నులు ఎరువులు అవసరమున్నట్లు, కేంద్రం జాయింట్​ సమావేశంలో నిర్ణయించాయన్నారు. కేంద్రం పది లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపించిందన్నారు. 1 అక్టోబర్​ నుంచి 22 ఫిబ్రవరి వరకు కూడా తెలంగాణలో యూరియా అందుబాటులో ఉందన్నారు. గతేడాదితో పోలిస్తే 27.37 శాతం అత్యధికంగా కేంద్రం సరఫరా చేసిందన్నారు. 22వ తేది ఫిబ్రవరిలో 40వేల టన్నుల యూరియాను కేంద్రం అదనంగా పంపిందన్నారు. 23, 24 తేదీల్లో అదనంగా మరో 48వేల టన్నుల యూరియా ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం రైతాంగాన్ని ఆదుకోవడం కోసం పంపిస్తున్నట్లు వెల్లడించిందన్నారు.

Also Read: తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?

మూడు రోజుల్లో 16వేల టన్నుల యూరియాను పంపిందన్నారు. లెక్కల్లో 1.22 లక్షల టన్నుల యూరియా.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 1.22 లక్షల టన్నుల యూరియా లెక్కల్లో ఉందన్నారు. ఇదిగాక 6వేల టన్నులు ఆంధ్రప్రదేశ్‌ పోర్టుల నుంచి తెలంగాణకు తీసుకువచ్చేందుకు ప్రణాళిక చేశామన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా తెలంగాణకు ఎరువుల సరఫరా చేస్తుందన్నారు. యూరియాను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అందుబాటులో ఉంచామన్నారు. వీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. కేంద్రం కావాల్సిన స్దాయిలో ఎరువులు తెలంగాణకు పంపినా , రైతులు క్యూలో ఉండడం దురదృష్టకరమన్నారు. 

Also Read: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?

టాప్ హెడ్ లైన్స్

Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget