అన్వేషించండి

మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా

ఈజీగా మనీ సంపాదించేందుకు మైనర్ కొడుకును సీరియల్ కిల్లర్‌గా మార్చి మహిళలను హత్య చేయించిన కన్నతల్లి దారుణం సిద్ధిపేట జిల్లాలో వెలుగుచూసింది. ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తల్లి దురాశతో మైనర్ కుమారుడిని సీరియల్ కిల్లర్‌గా మార్చింది.
  • దుకాణం సాకుతో మహిళలను హత్య చేసి, దోపిడీలకు పాల్పడ్డారు.
  • ఆగస్టు 8న విజయ హత్యతో దారుణాలు వెలుగుచూశాయి.
  • గతంలో రేఖ హత్య, భర్త హత్య పథకంతో పట్టుకున్నారు.

సిద్దిపేట: ఈజీ మనీకి అలవాటు పడిన తల్లి దురాశతో కొడుకును సైతం నేరాలకు ప్రేరేపించింది. తన పెంపకంతో క్రమశిక్షణ నేర్పించాల్సిన మైనర్ కుమారుడిని ప్లాన్ ప్రకారం సీరియల్ కిల్లర్‌గా మార్చిందని తెలిసి పోలీసులు సైతం షాకయ్యారు. కొడుకు శారీరకంగా ఎక్కువ ఫిట్‌నెస్ ఉండాలని, ఇంట్లోనే జిమ్ పరికరాలు సమకూర్చింది. కుమారుడి సాయంతో అమాయక మహిళలను హత్య చేసి, దోపిడీలకు పాల్పడుతోంది. సిద్ధిపేట జిల్లా భూంపల్లి గ్రామంలో ఈ దారుణాలు జరిగాయి. 

 

సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సీపీ రష్మీ పెరుమాళ్, ఏసీపీ రవీందర్‌రెడ్డిలతో కలిసి ఈ హత్యలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల నుంచి కొన్నేళ్ల కిందటే వచ్చి భూంపల్లిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద  తెల్లాకుల రజిత (38) నివాసం ఉంటోంది. ఆమె భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఇంటర్ చదివిన కుమారుడు ఉన్నాడు. చిన్న కిరాణా దుకాణం నడుపుతున్న రజిత తన వద్ద కొనేందుకు వచ్చే వారితో మాటలు కలిపి వారి కుటుంబ సమస్యలు, భూతగాదాలను ఆరా తీసేది. ఈ క్రమంలో  ఆగస్టు 8న తన దుకాణానికి వచ్చిన అతికం విజయ (45) అనే మహిళను పలు విషయాలు అడిగింది. మాటల్లో పెట్టి లోపలికి తీసుకెళ్లి, కొడుకుతో కలిసి విజయ గొంతు నులిమి హత్య చేసింది. తరువాత ఆమె నగలు దోచేశారు. మృతదేహాన్ని బైక్‌పై రామక్కపేట శివారుకు తరలించి పెట్రోల్ పోసి దహనం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా రజితను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ సంచలన నిజాలు వెలుగుచూశాయి.

గతంలో చేసిన మరిన్ని దారుణాలు పోలీసుల విచారణలో బయటపడ్డాయి. మే 28న కుంట రేఖ అనే మహిళను కూడా ఇదే తీరుగా హత్య చేశారు. అచ్చుమాయపల్లి శివారులో డెడ్‌బాడీని దహనం చేసినట్లు తేలింది. గతేడాది జూన్‌లో సర్పంచ్ భార్యపై దాడి చేసి నగలు దోచుకోవడమే కాకుండా, మరో ముగ్గురు మహిళలను హత్య చేసేందుకు వీరు స్కెచ్ వేశారు. సర్పంచ్ భార్య మార్నింగ్ వాకింగ్ కు వెళ్లగా ముసుగు ధరించిన వచ్చిన తల్లీ కొడుకు ఆమెపై కర్ర, రాళ్లతో దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లారు.

భర్తను సైతం హత్య చేయాలని ప్లాన్..
భర్త పేరుపై ఇన్సూరెన్స్ చేయించి అతనిని కూడా హత్య చేయాలని నిందితురాలు రజిత ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. భర్తను టార్చర్ చేసి మంచానికే పరిమితం చేసింది. హత్యలు, దోపిడీలు చేయడానికి తల్లి కొడుకు యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు చూసేవారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 5.6 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి, బైక్, రూ. 1.03 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులు రజితను జిల్లా జైలుకు, ఆమె మైనర్ కుమారుడిని జువెనైల్ హోమ్‌కు తరలించారు. సిద్దిపేటలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. 

 

Frequently Asked Questions

సిద్దిపేటలో వెలుగుచూసిన దారుణం ఏమిటి?

ఈజీ మనీ కోసం తల్లి తన మైనర్ కుమారుడిని సీరియల్ కిల్లర్‌గా మార్చి అమాయక మహిళలను హత్యలు చేయించి దోపిడీలకు పాల్పడింది.

ఈ దారుణాలకు పాల్పడిన నిందితులు ఎవరు?

తెల్లాకుల రజిత అనే తల్లి, ఆమె మైనర్ కుమారుడు ఈ హత్యలు, దోపిడీలకు పాల్పడ్డారు. రజితను జిల్లా జైలుకు, కుమారుడిని జువెనైల్ హోమ్‌కు తరలించారు.

నిందితులు నేరాలకు ఎలా పాల్పడేవారు?

రజిత మహిళలను మాటల్లో పెట్టి లోపలికి తీసుకెళ్లి, కొడుకు సాయంతో గొంతు నులిమి హత్య చేసేది. నగలు దోచుకుని మృతదేహాలను బైక్ పై తరలించి దహనం చేసేవారు.

నిందితులు ఎన్ని హత్యలు, దోపిడీలకు పాల్పడ్డారు?

నిందితులు అతికం విజయను, కుంట రేఖను హత్య చేశారు. సర్పంచ్ భార్యపై దాడి చేసి నగలు దోచుకున్నారు. మరో ముగ్గురు మహిళలను హత్య చేయాలని కూడా ప్లాన్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget