అన్వేషించండి

Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం

AP Assembly Budget Sessions | మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ అన్నారు, ఐదేళ్లు ఏం చేశారంటూ మండలిలో నారా లోకేష్ ప్రశ్నించారు.

Andhra Pradesh News | అమరావతి: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ అన్నారు.. అన్ని సీట్లు ఇచ్చి సీఎం చేస్తే ఎందుకు హోదా తేలేకపోయారని వైసీపీ సభ్యులను ఏపీ మంత్రి నారా లోకేష్ నిలదీశారు. అయిదేళ్లు కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు తెలుపుతూ ఓటేయడాన్ని ప్రశ్నించారు. నష్టపోయిన ఏపీని గాడిన పెట్టేందుకు ఏపీలో టీడీపీ, జనసేన రెండూ కలిసి ఎన్డీయేకు మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ముందుగానే చెప్పాం. చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే ఏపీకి రూ.13 వేల కోట్లు తీసుకొచ్చాం. దాంతోపాటు రాజధాని అమరావతి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఏపీ ప్రజల గుండె చప్పుడు అయిన విశాఖ ఉక్కు కార్మాగారాన్ని కాపాడుకోవడంతో పాటు విశాఖ రైల్వే జోన్ సాధించామని నారా లోకేష్ స్పష్టం చేశారు.

దళితులకు గుండు కొట్టించిన వాళ్ళు మీరు. మీరా దళితుల గురించి మాట్లాడేది? 
అమరావతి: దళితులకు గుండు కొట్టించిన వాళ్ళు ఎవరు, డోర్ డెలివరీలు చేసింది ఎవరో అందరికీ తెలుసునంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ వైసీపీ సభ్యులపై మండిపడ్డారు. దళితులపై దమనకాండ చేసి, వారి గురించి మీరా మాట్లాడేది? అంటూ నిప్పులు చెరిగారు. అనవసర రాద్ధాంతం చేయొద్దని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని వైసీపీ సభ్యులకు నారా లోకేష్ సూచించారు. గవర్నర్ స్పీచ్ నాలుగో పేజీ వివరాలు చదివి వినిపించేందుకు లోకేష్ ప్రయత్నించగా.. అడ్డుకునేందుకు వైసీపీ సభ్యులు యత్నించారు. ఇంగ్లీష్ మీడియం కావాలన్నారు, ఇంగ్లీషులో చెబితే ఎందుకు అల్లరి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి 6.5 లక్షల పెట్టుబడులతో, 4 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ పేర్కొన్నారు.

కూటమి సభ్యులు వర్సెస్ బొత్స సత్యనారాయణ

గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శాసన మండలిలో కూటమి సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీకి కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయని, ఆ పెట్టుబడులతో 4 లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయని ముందే ఎలా చెబుతారని మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రసంగంలో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని ప్రభుత్వానికి బొత్స సూచించారు. అయితే గవర్నర్ స్పీచ్ కాపీ ఇవ్వాలని మండలి ఛైర్మన్ మోషేను రాజు కోరగా, మంత్రి అనిత వెళ్లి ఇచ్చారు. పరిశ్రమల ద్వారా పెట్టుబడులు వస్తాయని, తద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పామని నారా లోకేష్ బదులిచ్చారు.

Also Read: Daggubati Meets Chandrababu: ఎన్నాళ్లకెన్నాళ్లకూ.. చంద్రబాబును నివాసానికి వెళ్లి కలిసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Uttarandhra Teachers Mlc: కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
MLC Results: గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
Rashmika Mandanna: 'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Oscar 2025 | 97వ ఆస్కార్‌ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన అనోరా సినిమా | ABP DeshamRaksha Khadse Daughter | తన కుమార్తెను వేధించిన పోకిరీలపై కేంద్రమంత్రి పోలీస్ కంప్లైంట్ | ABP DesamSpeaker suggests massage chairs for MLAs in Assembly | MLAలకు సభ తర్వాత విశ్రాంతి కావాలి | ABP DeshamPM Modi Lion Safari | గిర్ అభయారణ్యంలో సఫారీ కి వెళ్లిన ప్రధాని మోదీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttarandhra Teachers Mlc: కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
MLC Results: గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
Rashmika Mandanna: 'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
Causes of Snoring : గురక ఎక్కువగా వస్తుందా? కారణాలు ఇవే.. తగ్గించుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
గురక ఎక్కువగా వస్తుందా? కారణాలు ఇవే.. తగ్గించుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
CM Chandrababu: తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
Harish Rao Challenges Revanth Reddy: SLBCపై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
SLBC టన్నెల్ పై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
Embed widget