అన్వేషించండి

Maha Shivratri 2025: న‌దీసాగ‌ర సంగ‌మం వ‌ద్ద స్నానాలు ఎందుకు చేస్తారు - మహా శివరాత్రి ఎందుకు ప్రత్యేకం!

Sagara Sangamam: న‌దీసాగ‌ర సంగ‌మంలో పుణ్య‌స్నానాలు ఆచ‌రిస్తే మంచిది అని చాలా మంది భ‌క్త‌లు ప్రగాఢ విశ్వాసం.. అయితే మ‌హాశివ‌రాత్రి రోజున దీనిని ఆచ‌రించేందుకు మ‌రింత మంది వెళ్తుంటారు..

నదీసాగర సంగమం..ఇక్కడి పుణ్యస్నానం అత్యంత పవిత్రం..

నదీసాగర సంగమం అంటే పరమ పవిత్రమైనదిగా చెబుతుంటారు.. నది సుదూరం నుంచి ప్రవహించి సముద్రంతో కలిసిపోయినప్పడు అవిభాజ్యమవుతుంది.. సాగర సంగమం నందు నది తన  రూపాన్ని పేరును, రుచిని వదిలిపెట్టి మరిచిపోయి కలిసిపోయినట్లే భక్తులు ఇక తాను అన్న మాట విడిచిపెట్టి పరబ్రహ్మంలో ఐక్యమవుతాడని, అంటే బ్రతికుండగానే జీవన్ముఖుడవుతాడని చెబుతారు. అందుకే నదీసాగర సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఎందుకు ప్రాముఖ్యతనిస్తుంటారు. అందులోనూ మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నదీసాగర సంగమాల వద్ద అయితే మరీ ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. కోనసీమ ప్రాంతంలో మూడుచోట్ల నదీ సాగర సంగమాలు ఉన్నాయి.. అఖండ గోదావరి నుంచి గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలుగా విడిపోయిన గోదావరి కోనసీమ ప్రాంతంలోనే మూడు చోట్ల సాగరంలో మమేకమవుతుంది.. 

Also Read: శివరాత్రి మహత్యాన్ని చెప్పే అద్భుతమైన కథలివి.. లింగోద్భవ సమయానికి ఇలా చేయండి!

అంతర్వేదిలో వశిష్ట నదీసాగర సంగమం..

ధవళేశ్వరం నుంచి వశిష్టా నదిగా విడిపోయిన గోదావరి సిద్ధాంతం, చించినాడల మీదుగా అంతర్వేది వరకు ప్రవహిస్తుంది.. ఇది అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పాలెం వరకు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది.. ఈప్రాంతంలోనే భక్తులు ఎక్కువగా పుణ్యసానాలు ఆచరిస్తుంటారు. పైగా అంతర్వేదిలోనే ప్రసిద్ధి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉండడంతో భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతంలో స్నానమాచరిస్తారు.  ఇక్కడికి చేరుకోవాలంటే అమలాపురం నుంచి అంతర్వేది కు 49 కిలోమీటర్లు రోడ్డుమార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి వచ్చేవారు రావులపాలెం మీదుగా రెండు గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చు. 65కిలోమీటర్లు దూరం కాగా రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇక పాలకొల్లు నుంచి 35 కిలోమీటర్లు దూరం కాగా రోడ్డుమార్గం ద్వారా చేరుకునేందుకు రవాణా సదుపాయాలు చాలా ఉంటాయి.. 

Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!

యానాం వద్ద గౌతమి నదీసాగర సంగమం.. 

ధవళేశ్వరం నుంచి ప్రవహించే గౌతమీ నదీపాయ నేరుగా రామచంద్రపురం, ముక్తేశ్వరం ప్రాంతాల మీదుగా ప్రవహిస్తూ వృద్ధగౌతమి నదీపాయగా మారి పుదుచ్చేరీ యానాం, ఐ.పోలవరం మండలప్రాంతాలను తాకుతూ సాగరంలో కలుస్తుంది.. పుదుచ్చేరీ యానాంలో కానీ, ఇటు కాట్రేనికోన మండలం తీర ప్రాంతంలో కానీ నదీసాగర సంగమం వద్దకు చేరుకోవచ్చు.. యానాం ప్రాంతంలో ఉన్న సాగర సంగమం వద్దకు చేరుకోవడమే సులభం.. అమలాపురం నుంచి కాకినాడ నుంచి, రామచంద్రపురం నుంచి ఇక్కడికి రోడ్డుమార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అమలాపురం నుంచి 32 కిలోమీటర్లు దూరం యానాం ఉండగా బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక రామచంద్రపురం నుంచి 25 కిలోమీటర్లు దూరం.కాకినాడ నుంచి యానాం కు 31.7 కిలోమీటర్లు దూరం కాగా బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి.. 

Also Read: గంగనెత్తికెత్తినోడు , గౌరీదేవి మెచ్చినోడు శివయ్య..ఈ శివరాత్రికి మంగ్లీ సాంగ్ వచ్చేసింది చూశారా!

ఓడలరేవులో వైనతేయ నదీ సాగర సంగమం..

వశిష్టా నదీపాయ గన్నవరం నుంచి విడిపోయి బోడసకుర్రు మీదుగా ఓడలరేవు వరకు ప్రవహించేదే వైనతేయ నదీపాయ.. ఇది అల్లవరం మండలం ఓడలరేవు గ్రామ పరిధిలోను, ఆవలి తీరం అయిన సఖినేటిపల్లి మండలం కేశనపల్లి వద్ద సముద్రంలో కలుస్తుంది. ఇక్కడకు చేరుకోవాలంటే అమలాపురం నుంచి ఓడలరేవు గ్రామానికి 35 కిలోమీటర్లు దూరం కాగా బస్సు సదుపాయం ఉంటుంది.. ఓడలరేవు నుంచి తీరానికి సుమారు 5 కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. పాలకొల్లు నుంచి వై.జంక్షన్‌ వయా మీదుగా 56 కిలోమీటర్లు దూరం ఉంటుంది.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

April 2026 Festivals: అక్షయ తృతీయ, సింహా చలంలో చందనోత్సవం, నృసింహ జయంతి సహా ఏప్రిల్ (వైశాఖమాసం) నెలలో పండుగలు ఇవే!
అక్షయ తృతీయ, సింహా చలంలో చందనోత్సవం, నృసింహ జయంతి సహా ఏప్రిల్ (వైశాఖమాసం) నెలలో పండుగలు ఇవే!
Vontimitta: ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం! భక్తులకు తలంబ్రాలు, ప్రసాదాల పంపిణీ ఏర్పాట్లు పూర్తి, పార్కింగ్ వివరాలు!
ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం! భక్తులకు తలంబ్రాలు, ప్రసాదాల పంపిణీ ఏర్పాట్లు పూర్తి, పార్కింగ్ వివరాలు!
Budh Gochar 2026: ఏప్రిల్ 1 నుంచి గురు నక్షత్రరాశిలో బుధ గ్రహ సంచారం! వృషభం, మిథునం సహా ఈ 4 రాశుల వారికి ప్రయోజనకరం!
ఏప్రిల్ 1 నుంచి గురు నక్షత్రరాశిలో బుధ గ్రహ సంచారం! వృషభం, మిథునం సహా ఈ 4 రాశుల వారికి ప్రయోజనకరం!
April 2026 Grah Gochar: ఏప్రిల్ 2026లో గ్రహాల మార్పు! మీ రాశిపై, రాజకీయాలు, మార్కెట్ పై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
ఏప్రిల్ 2026లో గ్రహాల మార్పు! మీ రాశిపై, రాజకీయాలు, మార్కెట్ పై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Chicken Shops: హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
Chandigarh Blast: చండీగఢ్‌ బీజేపీ కార్యాలయం ముందు భారీ పేలుడు - విద్రోహ చర్యేనా?
చండీగఢ్‌ బీజేపీ కార్యాలయం ముందు భారీ పేలుడు - విద్రోహ చర్యేనా?
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
Indian Stock Market Rally: భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 
భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 
 Drum Brakes vs Disc Brakes: డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!
 డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!
Fuel Price Hike:భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
Spain vs USA: అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Embed widget