అన్వేషించండి

AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం

Andhra Pradesh: ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికి ఆయన మారిటైం బోర్డు సీఈవోగా ఉన్నారు. అదనపు బాధ్యతలు ఇచ్చారు.

AP Fiber Net MD: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలకు కారణం అయిన పైబర్ నెట్ వ్యవహారంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఎండీగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్యకు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం  ప్రవీణ్ ఆదిత్య మారిటైంబోర్డు సీఈవోగా ఉన్నారు. ఆ బాధ్యలతో పాటు ఫైబర్ నెట్ ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అలాగే బదిలీ అయిన దినేష్ నిర్వహిస్తున్న డ్రోన్, గ్యాస్ కార్పొరేషన్ల చైర్మన్ బాధ్యతలను కూడా అదనంగా ప్రవీణ్ ఆదిత్యకే ఇచ్చారు. దినేష్ కుమార్ ను అన్ని పోస్టుల నుంచి రిలీవ్ చేసి..పోస్టింగ్ లేకుండా జీఏడీలో రిపోర్టు చేయమని ప్రభుత్వం ఆదేశించింది.

ఫైబర్ నెట్‌లో ఏర్పడిన వివాదం కారణంగా జీవీ రెడ్డి తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇక ఏ పార్టీలో చేరబోనని లాయర్ గా పని చేసుకుంటానని ప్రకటించారు. ఆ తర్వాత కాసేపటికే ఎండీ దినేష్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. పోస్టింగ్ లేకుండా జీఏడీలో రిపోర్టు చేయమని ఆదేశించింది. దినేష్ కుమార్ వైసీపీ నేతల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. రెండు నెలల కిందట తాను ఉద్యోగం నుంచి తీసేయమని చెప్పిన 410 మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల కూడా వారికి జీతాల బిల్లు రెడీ అయిందని అంటున్నారు.               

అలాగే రామ్ గోపాల్ వర్మకు చెల్లించిన డబ్బులవిషయంలోనూ ఆయన తిరిగి ఇచ్చేది లేదని సమాధానం ఇచ్చారని ఆయనపై కేసు పెట్టాలని తాను ఉత్తర్వులు ఇస్తే  దానిపై సంతకం చేయలేదని జీవీ రెడ్డి అన్నారు. అయితే ఈ వ్యవహారాలన్నీ ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా.. ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడటంతోనే వివాదం అయింది. ప్రభుత్వ  పెద్దల దృష్టికి తీసుకెళ్లి విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలా ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయడమేమిటని టీడీపీ హైకమాండ్ మండిపడింది. దీంతో చివరికి ఆయన  రాజీనామా చేయాల్సి వచ్చింది. తనకు అవమానంగా భావించి జీవీ రెడ్డి పార్టీకి కూడా రాజీనామా చేశారు.                    

జీవీరెడ్డి రాజీనామా అంశం .. టీడీపీ క్యాడర్ లో ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల్లో అలజడి రేపింది. ఆయనకు అందరూ మద్దతుగా నిలిచారు. అయితే టీడీపీ మాత్రం జీవీ రెడ్డి ఇటీవలి కాలంలో పార్టీ ను ధిక్కరిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారని అంటున్నారు.  మొదటి విడత కార్పొరేషన్ చైర్మన్ల జాబితాలో ఆయన  పేరు లేదు. అయితే మీడియాలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తర్వాత రెండో జాబితాలో ఆయనకు కీలకమైన ఫైబర్ నెట్ పదవి ఇచ్చారు. విద్యాధికుడు అియన ఆయన రాజకీయంగా ఆ పదవికి ఉన్న అధికారాలను బట్టి నడుచుకోకుండా..ఏదో చేయాలని అనుకోవడంతోనే సమస్య వచ్చిందని భావిస్తున్నారు.                 

Also Read:  పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
YSRCP Mavigun Vs Amaravati 2026: వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget