జనరల్/EWS కేటగిరీకి 90, బీసీలకు 75, ఎస్సీ/ఎస్టీలకు 60 మార్కులు వస్తే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు.
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్కు నోటిఫికేషన్.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Telangana Special TET Notification | తెలంగాణలోని ఇన్-సర్వీస్ ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నేటి నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

- ప్రమోషన్లకు టెట్ అర్హత అవసరం; టీచర్లు ఉమ్మడి మార్కులు కోరుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం తొలిసారిగా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్ను మంగళవారం జారీ చేసింది. ఇన్-సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలంటూ గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం టీచర్లు 2028 సెప్టెంబరు నాటికి (మూడేళ్ల వ్యవధిలో) టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి అయింది. లేనిపక్షంలో వారు ఉద్యోగాల్లో కొనసాగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా 2 సార్లు టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం, తాజాగా తొలి ప్రత్యేక టెట్ నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది టీచర్లు ఇప్పటివరకు టెట్ పాస్ కాలేదని విద్యాశాఖ అంచనా వేస్తోంది.
మరోవైపు, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఎస్జీటీలుగా (SGT) పనిచేస్తూ బి.ఎడ్ పూర్తి చేసిన టీచర్లు సైతం టెట్ పేపర్-2 పరీక్ష రాయనున్నారు. మోడల్ స్కూళ్లలోని కొందరు టీజీటీలు (TGT) కూడా పేపర్-2 రాసే అవకాశం కల్పించారు. దాని ఫలితంగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది టీచర్లు సైతం కూడా ఈ ప్రత్యేక టీచర్ టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోనున్నారు.
నిరుద్యోగ అభ్యర్థుల తరహాలో తమకు టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ వర్తించదని, కనుక అందరికీ ఉమ్మడిగా ఒకే విధమైన అర్హత మార్కులు నిర్ణయించాలని కొందరు గవర్నమెంట్ టీచర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 150 మార్కులకు గాను జనరల్/EWS కేటగిరీకి 90, బీసీలకు 75, ఎస్సీ/ఎస్టీలకు 60 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు.
పరీక్షల షెడ్యూల్ వివరాలు
జులై 22 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పణ
సెప్టెంబరు 7 నుంచి 11 వరకు టెట్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు
సెప్టెంబరు 28 నుంచి 30 తేదీల మధ్య ఫలితాల వెల్లడించనున్నారు
తెలంగాణ టెట్ ఫలితాల విడుదల.. ఉత్తీర్ణత శాతం వివరాలు
హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2026) ఫలితాలను విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ జులై 13న విడుదల చేశారు. జూన్ 16 నుంచి 22 వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 43.94 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 1,53,752 మందిలో 74.81 శాతం (1,15,028 మంది) అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, ఈ పరీక్ష రాసిన 23,623 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల్లో కేవలం 37.29 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్తో అధికారిక వెబ్సైట్ నుండి స్కోర్ కార్డ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
Frequently Asked Questions
టెట్ పాస్ అవ్వడానికి అర్హత మార్కులు ఎంత?
ట్రెండింగ్ వార్తలు























