అన్వేషించండి

Mysuru Dasara 2024: దసరా ఉత్సవాలకు రారాజు మైసూరు దసరా - రాచరికం ఉట్టిపడేలా జంబూసవారి!

Navratri 2024: దసరాల్లో రారాజు - మైసూర్ దసరా. చాముండేశ్వరిని కొలుస్తూ 10 రోజులు పాటు జరిగే అద్భుతంగా వేడుకలు నిర్వహిస్తారు... నేటికీ మైసూర్ దసరా వేడుకలు అంటే స్పెషల్ క్రేజ్

Mysore Dasara 2024:  దేశవ్యాప్తంగా ఏటా దసరా వేడుకలు  జరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ప్రాంతాల్లో జరిగే  వేడుకలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో  మైసూర్ నగరంలో జరిగే  దసరా ఒకటి.   ఈ వేడుకలు చూసి తరించేందుకు  ఎక్కడెక్కడ నుండో టూరిస్టులు,  భక్తులు మైసూర్ చేరుకుంటారు. మైసూర్ రాజ వంశీకులు  పది రోజులు పాటు జరిపే ఈ ఉత్సవాలను చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఈ టైంలో  మొత్తం మైసూర్ నగరం  విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది. 

 మహిషాసురుడి రాజధాని - మైసూర్ 

మైసూర్ అసలు పేరు  "మహిషూరు " అని చెబుతారు.  పురాణాల ప్రకారం  మహిషాసురుడు అనే రాక్షసుడి రాజధాని ఈ నగరం. ప్రజా కంటకుడైన  మహిషాసురుడ్ని ఇక్కడికి దగ్గరలో కొండపై  కొలువైయున్న  చాముండేశ్వరి  దేవి తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసి పదో రోజున సంహరించింది  ఆ విజయాన్ని చేసుకుంటూ  ఏటా  దసరా వేడుకలు మైసూర్ లో ఘనంగా  జరుగుతూ వస్తున్నాయి.

Also Read: అయోధ్య రాముడిని దొంగతనం చేసి జరుపుకునే " కుల్లు దసరా"

 విజయనగర సామ్రాజ్య హయాంలో ఘనంగా దసరా వేడుకలు

 దక్షిణ భారతదేశానికే గర్వకారణమైన విజయనగర సామ్రాజ్యం హయాంలో దసరా వేడుకలు  ఘనంగా జరుగుతూ ఉండేవి. వీటిని చూడడానికి ఇతర రాజ్యాల నుంచి ఇంకా చెప్పాలంటే ఇతర దేశాల నుంచి కూడా అతిథులు వస్తూ ఉండేవారు. ఆ  సామ్రాజ్యకాలంలో పర్యటించిన విదేశీ యాత్రికులు ఈ దసరా వేడుకల గురించి  తమ పుస్తకాల్లో రాశారు..  ఇవన్నీ నాటి చరిత్రకు సాక్ష్యాలుగా గా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యం పతనం అయ్యాక  వారి సామంతులుగా ఉన్న మైసూర్ వడయార్లు తమరాజ్యంలోనూ దసరా ఉత్సవాలు జరపడం కొనసాగించారు. 1637లో  మైసూర్ స్వతంత్ర రాజ్యాంగ  మారినా దసరా వేడుకలు మాత్రం పాత పద్ధతుల్లోనే ఘనంగా జరుగుతూ వచ్చాయి. మధ్యలో కొంతకాలం  హైదరాలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ చేతిల్లోకి మైసూర్ రాజు వెళ్లినా 1799 లో బ్రిటిష్ సేనల చేతిలో టిప్పు ఓటమి తర్వాత మళ్లీ వడయారులకే రాజ్యాన్ని అప్పగించారు బ్రిటిష్ పాలకులు. అప్పటినుండి  దసరా ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుతూ వస్తున్నారు వడయార్  మహారాజులు.

Also Read: ఉపవాసాల దసరాగా పేరుబడ్డ తమిళనాడు ముత్త రమ్మన్ దసరా గురించి తెలుసా!

దసరా ప్రత్యేకం - మైసూర్ రాజ దర్బార్

మైసూర్ రాజుల రికార్థుల ప్రకారం 1610 లో వడయార్ రాజులు శ్రీరంగపట్నంలో  పది రోజుల దసరా వేడుకలకు నాంది పలికారు . 1805లో మూడవ కృష్ణరాజ వడయార్ దసరా ఉత్సవాల్లో మైసూర్ ప్యాలెస్ లో  ప్రత్యేక రాజధర్బార్  ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఆరోజు రాజ కుటుంబీకులు, రాజ్య ప్రముఖులు, అతిథులు, అధికారులు,  ప్రజలు ఒకేసారి దర్బార్ కు హాజరై దసరా వేడుకలను చూసి ఆనందిస్తారు. ఈ సంప్రదాయం  2013 లో శ్రీకంఠ వడయార్ మరణించే వరకు కొనసాగింది. ప్రస్తుతం బంగారు సింహాసనంపై  వడయార్ వంశీకులు బదులు వారి రాచఖడ్గం "పట్టడ కత్తి " ని ఉంచి దర్బార్ నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో 9వ రోజున  ఈ రాజ ఖడ్గాన్ని అంబారి పై ఉంచి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తో ఊరేగింపుగా తీసుకొని వచ్చి అమ్మవారి ముందు ప్రత్యేక పూజలు చేస్తారు.  ఈ సమయంలో జరిగే జంబూ సవారి అత్యంత ప్రత్యేకం.  అటవీ అధికారులు తీసుకొచ్చిన ఏనుగుల గుంపుని ప్రత్యేకంగా అలంకరించి జంబూ సవారీ నిర్వహిస్తారు..ఇందులో పాల్గొనబోయే ఏనుగులకు ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సవారీలో భాగంగా దేవతను తీసుకెళ్లే ఏనుగుకు 750 కిలోల హౌడాను ధరింపచేస్తారు...ఇది రాజవైభవానికి చిహ్నం.

Also Read: కాకతీయ వారసులు జరిపే బస్తర్ దసరా గురించి తెలుసా!

 మైసూర్ ప్యాలెస్ లైటింగ్ ఒక అద్భుతం 

మైసూర్ దసరా ఉత్సవాల్లో  ప్రత్యేక ఆకర్షణగా  మైసూర్ ప్యాలెస్, చాముండేశ్వరి ఆలయాల లైటింగ్ నిలుస్తాయి.  ఉత్సవాల సమయంలో విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోయే  మైసూర్ ప్యాలెస్ చూసేందుకు  రెండు కళ్లు సరిపోవు.   కర్ణాటక ప్రభుత్వం మైసూర్ దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా జరుపుతోంది. ఈ ఉత్సవాలు చూడడానికి వచ్చే  పర్యాటకుల కోసం  ప్రత్యేక బస్సులు, రైళ్లు నడుస్తుంటాయి. పది రోజులూ మైసూర్ నగరం అతిథులతో కిటికిటలాడిపోతూ ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Family Digital Card : తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
YS Jagan : లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
Actor Rajendra Prasad Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Haryana Elections 2024: హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP DesamIsrael attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP DesamIsrael attack in Beirut | లెబనాన్‌ యుద్ధ క్షేత్రంలో ABP News గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Family Digital Card : తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
YS Jagan : లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
లడ్డూ కల్తీ విషయంలో విచారణే వద్దంటున్న జగన్ - తప్పు బయటపడుతుందని భయపడుతున్నారా?
Actor Rajendra Prasad Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Haryana Elections 2024: హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
హర్యానా ఎన్నికల పోలింగ్ ప్రారంభం- 90 అసెంబ్లీ స్థానాలకు 1,031 మంది పోటీ
Revanth Reddy : రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
రేవంత్ రెడ్డిపై సూపర్ సీనియర్స్ అసంతృప్తి - కాంగ్రెస్ కల్చర్‌ను రేవంత్ ఇంకా వంటబట్టించుకోలేదా?
Women's World Cup 2024: ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
Navratri 2024: వ్యభిచార గృహాల ప్రాంగణంలో మట్టితో దుర్గామాత విగ్రహం తయారీ!
వ్యభిచార గృహాల ప్రాంగణంలో మట్టితో దుర్గామాత విగ్రహం తయారీ!
Weather Today: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Embed widget