అన్వేషించండి

Kullu Dussehra 2024 : అయోధ్య రాముడిని దొంగతనం చేసి జరుపుకునే " కుల్లు దసరా"

Dussehra 2024: అయోధ్య రాముడిని దొంగతనం చేసి జరుపుకునేదే " కుల్లు దసరా" . ఈ రాజ్యానికి రఘునాథుడే రాజు . హిమాచల్ ప్రదేశ్ లో ఏటా జరిగే ఈ వేడుకలకు లక్షల మంది భక్తులు హాజరవుతారు. ఈ విశేషాలు మీకోసం..

Kullu Dussehra 2024 :  మన దేశంలో దసరా అనేది  చాలా ముఖ్యమైన పండుగ అయితే ఒకొక్క ప్రాంతంలో ఒక్కో కారణంతో  దసరా వేడుకలు  జరుపుకుంటారు. సౌత్ ఇండియా , బెంగాల్లోనూ దుర్గాదేవి, మహిషాసురుడ్ని  అంతం చేసిన  సందర్భంగా  విజయదశమి  జరుపుకుంటే, నార్త్ ఇండియాలో  రావణుడి పై రాముడు సాధించిన  విజయాన్ని గుర్తు చేసుకుంటూ దసరా జరుపుతారు.  దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో   వేర్వేరు  కారణాలతో కూడా చిత్ర పండుగ జరుపుకుంటుంటారు. అలాంటి వాటిలో ముఖ్యమైనది హిమాచల్ ప్రదేశ్ లో చేసే"కుల్లు దసరా "

 కుల్లు లోయకు రాముడే రాజు 

హిమాచల్ ప్రదేశ్ లో  అందమైన లోయ ప్రాంతం కుల్లు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి  రెండు కళ్ళు సరిపోవు అని అంటారు. ఆ లోయలో  ప్రతి ఏటా  విజయదశమి రోజు నుండి  ఏడు రోజులు పాటు  దసరా ఉత్సవాలు జరుపుతారు. కుల్లు రాజ్యానికి రాజైనా, దేవుడైనా రఘునాథుడే. అయోధ్య రామున్ని  "రఘునాథ్" గా ఇక్కడి ప్రజలు పిలుచుకుంటారు. రఘునాథ్ విగ్రహాన్ని  రథంపై ఉంచి  కుల్లు లోయలో జరిపే రథయాత్రకు  ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ప్రతి ఏటా  ఈ కుల్లు దసరా ను చూడడానికి  5 లక్షల మంది వరకు పర్యాటకులు ఆ చిన్న లోయకు క్యూ కడుతుంటారు.

Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు

అయోధ్య రామున్ని దొంగతనం చేసి జరుపుకునే" కుల్లు దసరా "

కుల్లు దసరా వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. 17వ శతాబ్దంలో  కుల్లు లోయను జగత్ సింగ్ అనే రాజు పాలించేవాడు. అదే రాజ్యంలో నివసించే దుర్గాదత్త అనే సాధువు  వద్ద చాలా అందమైన,  విలువైన ముత్యాలు ఉండేవి. వాటి గురించి విన్న రాజు జగత్ సింగ్  ముత్యాలను తనకు ఇవ్వాలని అడగగా దుర్గా దత్ అవి "జ్ఞానానికి సంబంధించిన ముత్యాల"ని రాజుకి ఇవ్వడానికి నిరాకరించాడు. ముత్యాలను తనకు ఇవ్వకుంటే ఉరి తీస్తానని  రాజు హెచ్చరించడంతో వేరే దారిలేని దుర్గాదత్ అగ్నిలోకి దూకి ఆత్మహుతి చేసుకున్నాడు. చనిపోయే ముందు "రాజు తినే తిండి పురుగులతోనూ, త్రాగే నీరు రక్తం గానూ " మారిపోవాలంటూ శపించాడు. ఆ శాపం వల్ల  తిండీ,నీరు లేక బాధపడ్డ  రాజు జగత్ సింగ్ శాపం పోవాలంటే  ఏం చేయాలి అంటూ రామానంది శాఖకు  చెందిన కృష్ణదాస్  పాయహరి అనే పీఠాధిపతిని అడగడంతో అయోధ్య రామున్ని  తీసుకువచ్చి  కుల్లులోయలో ప్రతిష్టించాలని చెప్పాడు. దానితో రాజు ఒక బ్రాహ్మణుడిని  అయోధ్యకు పంపగా  ఆయన అయోధ్యలోని రాముడు విగ్రహాన్ని దొంగిలించుకుని వస్తూ సరయు నది తీరంలో అయోధ్య ప్రజలకు పట్టుపడ్డాడు. వారు ఆయననః ప్రశ్నించగా తమ రాజుకు ఉన్న శాపం గురించి తెలిపాడు. అక్కడే ఒక విచిత్రం జరిగింది. బ్రాహ్మణుడి నుంచి  తీసుకుని రాముడి విగ్రహాన్ని అయోధ్య వైపు ప్రజలు తీసుకెళుతుంటే  అది మోయలేనంతగా  బరువెక్కి పోయింది. అదే కుల్లు లోయ దిశగా  వెళుతుంటే  మాత్రం దూదిపింజలా తేలికగా పోయేది. దానితో రాముని ఆజ్ఞగా భావించి  విగ్రహాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చేశారు. ఆయన తీసుకువచ్చిన విగ్రహాన్ని రఘునాథ్ పేరుతో కుల్లు రాజ్య సింహాసనం పై ఉంచి దాని పాదామృతాన్ని త్రాగాడు  రాజు జగత్ సింగ్. దానితో ఆయన శాపం తీరిపోయింది. ఆ క్షణం నుంచి రాజ్యానికి రఘునాథుడే రాజు అని  ప్రకటించి ఉత్సవాలు జరపడం ప్రారంభమైంది. దీనినే కుల్లు దసరా  గా పిలుస్తారు. విజయదశమి రోజు ప్రారంభమయ్యే  కుల్లు దసరా ఏడు రోజులు పాటు జరుగుతాయి.   ఈ ఉత్సవాలు 1606 CE నుండి జరుగుతున్నట్టు గుర్తించారు. ఆ ఉత్సవాల టైంలో రఘునాద్ విగ్రహాన్ని  రథంపై ఉంచి  లోయ చుట్టూ  రథోత్సవం జరుపుతారు.  ఈ సమయంలో జరిపే నట్టి ట్రైబల్ డాన్స్ చాలా పాపులర్. 

Also Read: దసరాల్లో మీ ఇంట ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులివే!

 గిన్నిస్ రికార్థుల కెక్కిన నట్టి ట్రైబల్ డాన్స్ 

 కుల్లు దసరా లో ప్రత్యేక ఆకర్షణ నట్టి ట్రైబల్ డాన్స్. ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో బాగా పాపులర్. ఈ డాన్స్ లో  వెరైటీలు ఉన్నాయి. కుల్లు నట్టి, మహాసువి నట్టి, సిర్ మౌరి నట్టి, కిన్నౌరి నట్టి,బంగాని నట్టి ఇలా చాలా వెరైటీలు ఈ నట్టి డాన్స్ లు ఉన్నాయి. 2015 అక్టోబర్ 26 న దసరా వేడుకల్లో భాగం గా 9892 మంది మహిళలు కుల్లవి గిరిజన డ్రెస్సుల్లో చేసిన నట్టి డాన్స్ అతిపెద్ద జానపద నృత్యం గా గిన్నిస్ రికార్థుల కెక్కింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu in Assembly: విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే ప్రపంచబ్యాంక్ జీతగాడినన్నారు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రసంగం
నన్ను ప్రపంచబ్యాంక్ జీతగాడినన్నారు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రసంగం
Telangana: స్టాలిన్‌ సమావేశానికి వెళ్తామని కేటీఆర్ ప్రకటన - మరి రేవంత్ హాజరైతే ?
స్టాలిన్‌ సమావేశానికి వెళ్తామని కేటీఆర్ ప్రకటన - మరి రేవంత్ హాజరైతే ?
Microsoft AP Govt:  రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
Telangana New Ration Cards: తెలంగాణ రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్- పాతకార్డులకు కాలం చెల్లినట్టేనా!
తెలంగాణ రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్- పాతకార్డులకు కాలం చెల్లినట్టేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Parvatmala project Explained in Telugu | రోడ్లు వేయలేని మార్గాల్లో రోప్ వే తో మహారాజులా ప్రయాణం |ABPMS Dhoni Dance in Pant Sister Marriage | అన్నీ మర్చిపోయి హ్యాపీగా డ్యాన్స్ చేసిన ధోనీ | ABP DesamHow To Use Shakthi App | శక్తి యాప్ తో ఎక్కడికెళ్లినా సేఫ్ గా ఉండండి | ABP DesamChitrada Public Talk | చిత్రాడలో జనసేన విజయకేతనం సభపై స్థానికుల అభిప్రాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu in Assembly: విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే ప్రపంచబ్యాంక్ జీతగాడినన్నారు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రసంగం
నన్ను ప్రపంచబ్యాంక్ జీతగాడినన్నారు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రసంగం
Telangana: స్టాలిన్‌ సమావేశానికి వెళ్తామని కేటీఆర్ ప్రకటన - మరి రేవంత్ హాజరైతే ?
స్టాలిన్‌ సమావేశానికి వెళ్తామని కేటీఆర్ ప్రకటన - మరి రేవంత్ హాజరైతే ?
Microsoft AP Govt:  రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
Telangana New Ration Cards: తెలంగాణ రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్- పాతకార్డులకు కాలం చెల్లినట్టేనా!
తెలంగాణ రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్- పాతకార్డులకు కాలం చెల్లినట్టేనా!
Happy Holi Wishes : హోలీ శుభాకాంక్షలు.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాలో ఈ ఫోటోలు షేర్ చేసి, ఈ మెసేజ్​లతో విషెష్ చెప్పేయండి
హోలీ శుభాకాంక్షలు.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాలో ఈ ఫోటోలు షేర్ చేసి, ఈ మెసేజ్​లతో విషెష్ చెప్పేయండి
Aamir Khan: 'ఏడాది కాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నా' - తన గర్ల్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆమిర్ ఖాన్, ఎవరో తెలుసా.?
'ఏడాది కాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నా' - తన గర్ల్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆమిర్ ఖాన్, ఎవరో తెలుసా.?
Fact Check:   ఏంటీ.. అది ఘటోత్కచుడి కత్తా…? నిజంగానే దొరికిందా..?
Fact Check:   ఏంటీ.. అది ఘటోత్కచుడి కత్తా…? నిజంగానే దొరికిందా..?
Teacher: పిల్లలు మాట వినడం లేదని గుంజీలు తీసిన హెడ్మాస్టర్ - లోకేష్ స్పందన ఇదే !
పిల్లలు మాట వినడం లేదని గుంజీలు తీసిన హెడ్మాస్టర్ - లోకేష్ స్పందన ఇదే !
Embed widget