అన్వేషించండి

AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం

Volunteers system in Andhra Pradesh | ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని.. వైసీపీ హయాంలోనే వాలంటీర్ వ్యవస్థను అప్పటి ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని మంత్రి బాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు.

Volunteers system no longer in operation in Andhra Pradesh | అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. వాలంటీర్లు ఎవ్వరు లేరు, రెన్యూవల్ చెయ్యలేదని మంత్రి బాల వీరంజనేయ స్వామి చెప్పడంతో సభలో దుమారం మొదలైంది. వాలంటీర్ల తొలగింపు అంశంపై మండలిలో అధికార కూటమి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీలుగా పరిస్థితి తయారైంది. వాలంటీర్ల తొలగింపు ప్రకటనపై వైసీపీ ఎమ్మెల్సీ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. వాలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలు కి పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నేడు వలంటీర్ వ్యవస్థనే లేదని చెప్తున్నారు. 2024 సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చినప్పుడు ఎలా డ్యూటీ చేయించారు. నవంబర్ 2024 వరకు వాళ్లకి సీ ఎఫ్ ఎం ఎస్ ఐడీలు ఎలా కొనసాగించారో చెప్పాలి. కూటమి ప్రభుత్వం 2,56,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు తొలగించి, వారిని రోడ్డు పడేసింది. 

ఎన్నికల సమయంలో హామీ ఎలా ఇచ్చారన్న వైసీపీ ఎమ్మెల్సీలు

వాలంటీర్లకు 10 వేలు గౌరవ వేతనం చేస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంపై ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. 2023 ఆగస్టు నుండి రాష్ట్రంలో వలంటీర్లు వ్యవస్థ లేదని దారుణంగా మాట్లాడుతున్నారు. ఆ వ్యవస్థ లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్ల గురించి ఎలా పెట్టారు. 2024 ఏప్రిల్ నెలలో ఎన్నికల ప్రచారం ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని ప్రభుత్వాన్ని వరుదు కళ్యాణి నిలదీశారు. జీతం పెంచగానే చించినాడా పుతారేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారు. ఏకంగా 2.6 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించేయడం అన్యాయం అన్నారు. వాలంటీర్లు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి అన్యాయం చేయకూడదని కోరారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. వలంటీర్లు లేకపోతే విపత్తు శాఖ ఎందుకు ఆదేశాలు ఇచ్చిందని ప్రశ్నించారు. లేని వాలంటీర్ వ్యవస్థను వరదల సమయంలో ఎలా వినియోగించారని నిలదీశారు.

Also Read: AP Cabinet Meeting: నేటి మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ - పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం 

ధరలు, ఛార్జీలు పెంచేది వాళ్లే.. ధర్నాలు చేసేది వాళ్లే

కరెంట్ ఛార్జీలు పెంచింది వాళ్లే.. ధర్నాలు చేసేది వైసీపీ వాళ్లే, ప్రైవేట్ కాలేజీలలో పీజీ చదివే వారికి ఫీజు చెల్లించడం లేదని వైసీపీ హయాంలో 2020లో జీవో కూడా తెచ్చారు. కానీ మేం అందరు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్ మెంట్ లో 640 కోట్లు బకాయిలు పెట్టారు. ఎంతో మంది విద్యార్థులు ఫీజులు చెల్లించుకోలేక చదువుకు దూరమయ్యారు. వైసీపీ హయాంలో నేతల్ని ప్రశ్నించే స్వేచ్చ లేకపోవడంతో ప్రభుత్వాన్ని అడగలేకపోయారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Jubilee Hills by-election : 42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
Advertisement

వీడియోలు

Proud India | భారతదేశంపై అమెరికా అక్కసు వెనక కారణం ఇదే | ABP Desam
Jubilee Hills By Election Counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు భారీ భద్రత ! | ABP Desam
రోహిత్, కోహ్లీల కెరీర్‌లో విలన్‌గా మారిన బీసీసీఐ!
సంజూ కోసం జడ్డూని వదిలేస్తారా? CSKకి పిచ్చి పట్టింది: శడగొప్పన్ రమేష్
నితీష్‌కి బీసీసీఐ అన్యాయం.. మండిపడుతున్న తెలుగు ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Jubilee Hills by-election : 42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
Pawan Kalyan vs Mithun Reddy: డిప్యూటీ సీఎం పవన్‌కు మిథున్ రెడ్డి ఘాటు హెచ్చరిక - క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు
డిప్యూటీ సీఎం పవన్‌కు మిథున్ రెడ్డి ఘాటు హెచ్చరిక - క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు
America shutdown ends:  43 రోజుల కష్టాలకు చెక్ -  అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ తాత్కాలిక ముగింపు - ట్రంప్ సంతకం పూర్తి
43 రోజుల కష్టాలకు చెక్ - అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ తాత్కాలిక ముగింపు - ట్రంప్ సంతకం పూర్తి
Alluri Seetharamaraju district: ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
Red Fort Blasts Conspiracy: 32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
Embed widget