అన్వేషించండి

AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం

Volunteers system in Andhra Pradesh | ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని.. వైసీపీ హయాంలోనే వాలంటీర్ వ్యవస్థను అప్పటి ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని మంత్రి బాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు.

Volunteers system no longer in operation in Andhra Pradesh | అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. వాలంటీర్లు ఎవ్వరు లేరు, రెన్యూవల్ చెయ్యలేదని మంత్రి బాల వీరంజనేయ స్వామి చెప్పడంతో సభలో దుమారం మొదలైంది. వాలంటీర్ల తొలగింపు అంశంపై మండలిలో అధికార కూటమి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీలుగా పరిస్థితి తయారైంది. వాలంటీర్ల తొలగింపు ప్రకటనపై వైసీపీ ఎమ్మెల్సీ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. వాలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలు కి పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నేడు వలంటీర్ వ్యవస్థనే లేదని చెప్తున్నారు. 2024 సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చినప్పుడు ఎలా డ్యూటీ చేయించారు. నవంబర్ 2024 వరకు వాళ్లకి సీ ఎఫ్ ఎం ఎస్ ఐడీలు ఎలా కొనసాగించారో చెప్పాలి. కూటమి ప్రభుత్వం 2,56,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు తొలగించి, వారిని రోడ్డు పడేసింది. 

ఎన్నికల సమయంలో హామీ ఎలా ఇచ్చారన్న వైసీపీ ఎమ్మెల్సీలు

వాలంటీర్లకు 10 వేలు గౌరవ వేతనం చేస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంపై ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. 2023 ఆగస్టు నుండి రాష్ట్రంలో వలంటీర్లు వ్యవస్థ లేదని దారుణంగా మాట్లాడుతున్నారు. ఆ వ్యవస్థ లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్ల గురించి ఎలా పెట్టారు. 2024 ఏప్రిల్ నెలలో ఎన్నికల ప్రచారం ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని ప్రభుత్వాన్ని వరుదు కళ్యాణి నిలదీశారు. జీతం పెంచగానే చించినాడా పుతారేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారు. ఏకంగా 2.6 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించేయడం అన్యాయం అన్నారు. వాలంటీర్లు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి అన్యాయం చేయకూడదని కోరారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. వలంటీర్లు లేకపోతే విపత్తు శాఖ ఎందుకు ఆదేశాలు ఇచ్చిందని ప్రశ్నించారు. లేని వాలంటీర్ వ్యవస్థను వరదల సమయంలో ఎలా వినియోగించారని నిలదీశారు.

Also Read: AP Cabinet Meeting: నేటి మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ - పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం 

ధరలు, ఛార్జీలు పెంచేది వాళ్లే.. ధర్నాలు చేసేది వాళ్లే

కరెంట్ ఛార్జీలు పెంచింది వాళ్లే.. ధర్నాలు చేసేది వైసీపీ వాళ్లే, ప్రైవేట్ కాలేజీలలో పీజీ చదివే వారికి ఫీజు చెల్లించడం లేదని వైసీపీ హయాంలో 2020లో జీవో కూడా తెచ్చారు. కానీ మేం అందరు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్ మెంట్ లో 640 కోట్లు బకాయిలు పెట్టారు. ఎంతో మంది విద్యార్థులు ఫీజులు చెల్లించుకోలేక చదువుకు దూరమయ్యారు. వైసీపీ హయాంలో నేతల్ని ప్రశ్నించే స్వేచ్చ లేకపోవడంతో ప్రభుత్వాన్ని అడగలేకపోయారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
Telangana Jobs: ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్- కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Jobs: ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్- కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం
Samantha : నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
KTR News: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP DesamTDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
Telangana Jobs: ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్- కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Jobs: ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్- కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం
Samantha : నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
KTR News: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
AP Cabinet Meeting: నేటి మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ - పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
నేటి మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ - పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
Arjun S/O Vijayanthi Teaser: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌ Vs కొడుకు - ఈ తల్లీకొడుకుల కథేంటో?, 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' టీజర్ చూశారా!
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌ Vs కొడుకు కోపం - ఈ తల్లీకొడుకుల కథేంటో?, 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' టీజర్ చూశారా!
Ashwin Vs Dhoni: వందో టెస్టుకి ధోనీని ర‌మ్మ‌ని పిలిచా.. కానీ రాలేదు.. అంత‌కంటే మిన్న‌గా నాకు గిఫ్ట్ ఇచ్చాడు: అశ్విన్
వందో టెస్టుకి ధోనీని ర‌మ్మ‌ని పిలిచా.. కానీ రాలేదు.. అంత‌కంటే మిన్న‌గా నాకు గిఫ్ట్ ఇచ్చాడు: అశ్విన్
Tirupati News: తిరుపతిలో చిరుత సంచారంతో కలకలకం, వేదిక్ వర్సిటీలో కనిపించడంతో టెన్షన్ టెన్షన్
తిరుపతిలో చిరుత సంచారంతో కలకలకం, వేదిక్ వర్సిటీలో కనిపించడంతో టెన్షన్ టెన్షన్
Embed widget