అన్వేషించండి

AP Pensions: పింఛన్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, వేలి ముద్రల కష్టాలకు ఏపీ ప్రభుత్వం చెక్

Andhra Pradesh News | పింఛన్ల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకనుంచి వేలి ముద్రల కష్టాలకు ఏపీ ప్రభుత్వం చెక్ పెడుతూ కొత్త స్కానర్లను కొనుగోలు చేసింది.

Biometric Fingerprint Device | అమరావతి: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల కంపెనీలో తలెత్తుతున్న ఇబ్బందులకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. పెన్షన్లు (AP Pensions) సమయంలో వేలిముద్రలు సరిగా పడక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుంటారు. దాంతో వచ్చే నెల నుంచి పింఛన్ల కోసం కొత్త స్కానర్ లను ప్రభుత్వం తీసుకు రానుంది. పింఛన్ల పంపిణీ సమయంలో ప్రస్తుతం L-0 స్కానర్ ద్వారా వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఇకనుంచి ఎల్0 స్కానర్ల స్థానంలో ఎల్ 1 స్కానర్లను ప్రభుత్వం వినియోగించనుంది. దాదాపు 2000 రూపాయలు ఖర్చుపెట్టి ఒక్కో స్కానర్ పరికరాన్ని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది.

యు ఐ డి ఏ ఐ (UIDAI) ఆధార్ సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేయడంతో పాత పరికరాలు ఉపయోగించడానికి వీలుండదు. ఈనెలాఖరు తర్వాత పాత స్కానింగ్ పరికరాలు పనిచేయవని సంస్థ ఇదివరకే తెలిపింది. దాంతో ఏపీ ప్రభుత్వం కొత్త స్కానర్లు కొనుగోలు చేసింది. వీటిని ఏపీలోని 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం అందించనుంది. దాంతో పింఛను లబ్ధిదారులకు వేలిముద్రల సమస్య తీరనుంది. తొలిరోజే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

64 లక్షల మందికి పింఛన్లు
పాత నెల చివరి రోజు లేక కొత్త నెలలో తొలిరోజే ఏపీలో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు గత నెలలో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఏపీ ప్రభుత్వం 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తోంది. రూ.200 ఉన్న పింఛన్ ను రూ.2000 చేసింది తానేనని చంద్రబాబు అన్నారు. కానీ హామీ ఇచ్చి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజల్ని ఏడిపించి ఏడిపించి ఐదేళ్లకు వెయ్యి పెంచి రూ.3000 ఫించన్ చేసిందన్నారు. ప్రజల మీద ప్రేమ, చిత్తశుద్ధితో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ రూ.4000కు  పెంచాం. ఏప్రిల్ నెల నుంచి బకాయిలు కూడా అందించాం అన్నారు. దివ్యాంగులకు రూ.500 నుంచి పింఛన్లు ఇప్పుడు రూ.6000 చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించాం అన్నారు. 8 లక్షల మందికి నెలకు రూ.6 వేలు ఇస్తున్నాం. దేశంలో అధికంగా పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం తమదేనని సీఎం చంద్రబాబు అన్నారు.

ఫేక్ పింఛన్ దారుల ఏరివేతపై ప్రభుత్వం ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫేక్ పెన్షనర్లకు ఏరివేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 18,036 మంది పింఛన్లను చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలగించింది. జనవరిలో 63,77,943 మందికి పింఛన్ పంపిణీ చేయగా, ఫిబ్రవరిలో లబ్ధిదారుల్లో భారీగా కోత పెట్టింది. ఫిబ్రవరిలో 63,59,907 మందికి పింఛన్ అందించింది. పింఛన్ల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిన వారికి దివ్యాంగ పింఛన్లు రావని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పింఛన్లు పొందుతున్నారని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. కొన్ని ఫిర్యాదులు కూడా రావడంతో పరిశీలించిన కూటమి ప్రభుత్వం 18 వేల మందికి పింఛన్ తొలగించినట్లు ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం దాదాపు 33 వేల కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget