అన్వేషించండి

YSRCP : వైఎస్ఆర్‌సీపీలో మళ్లీ ఆ సీనియర్లకే జిల్లాలను రాసిచ్చిన జగన్ - ఓటమికి బాధ్యుల్ని చేయకుండా పెత్తనం ఎందుకిస్తున్నారు ?

YSRCP senior leaders have been announced as district incharges dissatisfaction among the cadre

YSRCP senior leaders : వైఎస్ఆర్‌సీపీలో పరిస్థితుల్ని చక్క బెట్టాలని జగన్ అనుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీగా పూర్తి రోల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల అధ్యక్షుల్ని నియమించారు. చాలా చోట్ల సీనియర్లకు అవకాశం కల్పించారు. తాజాగా ఆరుగురు సీనియర్ నేతలకు ఆ బాధ్యతలు ఇచ్చారు. వారు కొత్తవాళ్లు కాదు. గత ఎన్నికల్లో కీలకంగా  వ్యవహరించిన వాళ్లే. వాళ్ల వాళ్ల జిల్లాల్లో ఘోరంగా ఓటములు తెచ్చి పెట్టిన వాళ్లే. జిల్లాలు మార్చినా మళ్లీ వారికే బాధ్యతలివ్వడంతో వైసీపీ క్యాడర్‌లో నమ్మకం ఏర్పడటం లేదు. 

ఆ ఆరుగురే పార్టీని నడిపేది ! 

ఆంధ్రప్రదేశ్ ని ఆరుగా విభజించి  ఆరుగురు కోఆర్డినేటర్లకు జగన్  బాధ్యతలిచ్చారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎంపీ మిథున్ రెడ్డిని నియమించారు. గతంలో మిధున్ రెడ్డి గోదావరి జిల్లాలకు ఇంచార్జ్  గా ఉన్నారు.  ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఇంచార్జ్ గా  వ్యవహరించనున్నారు.  గత ఎన్నికల్లో అనంతపురం , చిత్తూరు జిల్లాలకు ఇంచార్జ్ గా ఉన్నారు. అయోధ్యరామిరెడ్డికి  ఈ సారి ఉమ్మడి కృష్ణా జిల్లా ఇచ్చారు.  వైవీ సుబ్బారెడ్డికి కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాలకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు.  విజయసాయిరెడ్డికి ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు ఇంచార్జులుగా ఇచ్చారు.  

సరైన ప్రతిపక్షం లేకనే టీడీపీ ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం - చంద్రబాబు అడ్డుకట్ట వేయగలరా ?

మళ్లీ వాళ్లకేనా అని క్యాడర్‌లో ఆేదన ! 

ఇంచార్జుల జాబితా ప్రకటన తర్వాత  పార్టీని పాతాళంలోకి నెట్టింది వీరే అయినా మళ్లీ వీళ్లకే ఎందుకు చాన్స్ ఇచ్చారన్న ప్రశ్నలు క్యాడర్ నుంచి వస్తున్నాయి.  పెద్దిరెడ్డి, ఆయన కుమారుు మిధున్ రెడ్డి గత ఎన్నికల్లో బాధ్యతలు తీసుకున్న జిల్లాల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది.  చిత్తూరు, అనంతపురం జిల్లాల ఇంచార్జిగా ఉన్న పెద్దిరెడ్డి రెండు సీట్లలో మాత్రమే పార్టీని గెలిపించగలిగారు. అందులో ఆయన ఒకటి, ఆయన సోదరుడు మరొకటి గెలిచారు.  మిథున్ రెడ్డి రెండు గోదావరి జిల్లాలకు ఇంచార్జిగా వ్యవహరించారు. కానీ ఒక్కటీ గెలవలేదు.  ఉత్తరాంధ్రకు వైవీ సుబ్బారెడ్డి, బొత్స ఇంచార్జులుగా చేశారు. రెండు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తప్ప దిగ్గజాలు కూడా గెలవలేదు. అంటే ఇప్పుడు జిల్లాలకు  బాధ్యతలు తీసుకున్న  వారంతా గత ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహించాల్సిన వారే. కానీ అందరికీ మళ్లీ పెత్తనం వచ్చింది. 

Also Read: సైలెంట్‌గా పార్టీ ప్రక్షాళన చేస్తున్న జగన్- ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగింత- ప్రతిపాడులో వైసీపీకి టీడీపీ నేత హోప్

పార్టీ క్యాడర్‌లోనే కాదు బయట కూడా అన్ని వర్గానికేనా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం ఆరుగురు ఇంచార్జుల్లో ఐదుగురు ఒకే సామాజికవర్గానికి చెందినవారు. ఒక్క  బొత్స మాత్రమే ఇతర వర్గం. ఆయనకు ఉభయగోదావరి జిల్లాలు ఇచ్చారు. గతంలో వైసీపీలో బీసీలకు ఇతర వర్గాలకు పదవులు ఇచ్చినా పవర్ మాత్రం ఓ వర్గం చేతుల్లో ఉంటందని ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు  పార్టీలో కూడా జిల్లాల అధ్యక్షులుగా ఇతర వర్గాలను నియమించినా కోఆర్డినేటర్లుగా  ఒకే వర్గం వారిని పెట్టడంతో ఇక వారిదే పెత్తనం అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జగన్  మాత్రం వారిపైనే నమ్మకం  పెట్టుకుంటున్నారు. 
 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget