అన్వేషించండి

YSRCP : వైఎస్ఆర్‌సీపీలో మళ్లీ ఆ సీనియర్లకే జిల్లాలను రాసిచ్చిన జగన్ - ఓటమికి బాధ్యుల్ని చేయకుండా పెత్తనం ఎందుకిస్తున్నారు ?

YSRCP senior leaders have been announced as district incharges dissatisfaction among the cadre

YSRCP senior leaders : వైఎస్ఆర్‌సీపీలో పరిస్థితుల్ని చక్క బెట్టాలని జగన్ అనుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీగా పూర్తి రోల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల అధ్యక్షుల్ని నియమించారు. చాలా చోట్ల సీనియర్లకు అవకాశం కల్పించారు. తాజాగా ఆరుగురు సీనియర్ నేతలకు ఆ బాధ్యతలు ఇచ్చారు. వారు కొత్తవాళ్లు కాదు. గత ఎన్నికల్లో కీలకంగా  వ్యవహరించిన వాళ్లే. వాళ్ల వాళ్ల జిల్లాల్లో ఘోరంగా ఓటములు తెచ్చి పెట్టిన వాళ్లే. జిల్లాలు మార్చినా మళ్లీ వారికే బాధ్యతలివ్వడంతో వైసీపీ క్యాడర్‌లో నమ్మకం ఏర్పడటం లేదు. 

ఆ ఆరుగురే పార్టీని నడిపేది ! 

ఆంధ్రప్రదేశ్ ని ఆరుగా విభజించి  ఆరుగురు కోఆర్డినేటర్లకు జగన్  బాధ్యతలిచ్చారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎంపీ మిథున్ రెడ్డిని నియమించారు. గతంలో మిధున్ రెడ్డి గోదావరి జిల్లాలకు ఇంచార్జ్  గా ఉన్నారు.  ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఇంచార్జ్ గా  వ్యవహరించనున్నారు.  గత ఎన్నికల్లో అనంతపురం , చిత్తూరు జిల్లాలకు ఇంచార్జ్ గా ఉన్నారు. అయోధ్యరామిరెడ్డికి  ఈ సారి ఉమ్మడి కృష్ణా జిల్లా ఇచ్చారు.  వైవీ సుబ్బారెడ్డికి కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాలకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు.  విజయసాయిరెడ్డికి ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు ఇంచార్జులుగా ఇచ్చారు.  

సరైన ప్రతిపక్షం లేకనే టీడీపీ ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం - చంద్రబాబు అడ్డుకట్ట వేయగలరా ?

మళ్లీ వాళ్లకేనా అని క్యాడర్‌లో ఆేదన ! 

ఇంచార్జుల జాబితా ప్రకటన తర్వాత  పార్టీని పాతాళంలోకి నెట్టింది వీరే అయినా మళ్లీ వీళ్లకే ఎందుకు చాన్స్ ఇచ్చారన్న ప్రశ్నలు క్యాడర్ నుంచి వస్తున్నాయి.  పెద్దిరెడ్డి, ఆయన కుమారుు మిధున్ రెడ్డి గత ఎన్నికల్లో బాధ్యతలు తీసుకున్న జిల్లాల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది.  చిత్తూరు, అనంతపురం జిల్లాల ఇంచార్జిగా ఉన్న పెద్దిరెడ్డి రెండు సీట్లలో మాత్రమే పార్టీని గెలిపించగలిగారు. అందులో ఆయన ఒకటి, ఆయన సోదరుడు మరొకటి గెలిచారు.  మిథున్ రెడ్డి రెండు గోదావరి జిల్లాలకు ఇంచార్జిగా వ్యవహరించారు. కానీ ఒక్కటీ గెలవలేదు.  ఉత్తరాంధ్రకు వైవీ సుబ్బారెడ్డి, బొత్స ఇంచార్జులుగా చేశారు. రెండు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తప్ప దిగ్గజాలు కూడా గెలవలేదు. అంటే ఇప్పుడు జిల్లాలకు  బాధ్యతలు తీసుకున్న  వారంతా గత ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహించాల్సిన వారే. కానీ అందరికీ మళ్లీ పెత్తనం వచ్చింది. 

Also Read: సైలెంట్‌గా పార్టీ ప్రక్షాళన చేస్తున్న జగన్- ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగింత- ప్రతిపాడులో వైసీపీకి టీడీపీ నేత హోప్

పార్టీ క్యాడర్‌లోనే కాదు బయట కూడా అన్ని వర్గానికేనా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం ఆరుగురు ఇంచార్జుల్లో ఐదుగురు ఒకే సామాజికవర్గానికి చెందినవారు. ఒక్క  బొత్స మాత్రమే ఇతర వర్గం. ఆయనకు ఉభయగోదావరి జిల్లాలు ఇచ్చారు. గతంలో వైసీపీలో బీసీలకు ఇతర వర్గాలకు పదవులు ఇచ్చినా పవర్ మాత్రం ఓ వర్గం చేతుల్లో ఉంటందని ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు  పార్టీలో కూడా జిల్లాల అధ్యక్షులుగా ఇతర వర్గాలను నియమించినా కోఆర్డినేటర్లుగా  ఒకే వర్గం వారిని పెట్టడంతో ఇక వారిదే పెత్తనం అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జగన్  మాత్రం వారిపైనే నమ్మకం  పెట్టుకుంటున్నారు. 
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఉచిత ఇసుక విధానంలో మార్పులు - ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఉచిత ఇసుక విధానంలో మార్పులు - ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Skill University: స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
Indian Army: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, ఎక్కడంటే?
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, ఎక్కడంటే?
KTR : అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్  ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Hamas Chief Yahya Sinwar Killed | హమాస్ చీఫ్‌ సిన్వర్‌ని ఇజ్రాయేల్ ఎలా చంపింది | ABP Desamనటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఉచిత ఇసుక విధానంలో మార్పులు - ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఉచిత ఇసుక విధానంలో మార్పులు - ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Skill University: స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
Indian Army: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, ఎక్కడంటే?
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, ఎక్కడంటే?
KTR : అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్  ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
Airtaxi: గంటన్నర జర్నీ ఐదు నిమిషాల్లో - ఎయిర్ ట్యాక్సీ త్వరలో - కానీ చాలా కాస్ట్లీ!
గంటన్నర జర్నీ ఐదు నిమిషాల్లో - ఎయిర్ ట్యాక్సీ త్వరలో - కానీ చాలా కాస్ట్లీ!
Monthly Income: నెలనెలా రూ.లక్ష ఆదాయం, మీ పెట్టుబడి పెరుగుతూనే ఉంటుంది - ఇదొక స్మార్ట్‌ స్ట్రాటెజీ!
నెలనెలా రూ.లక్ష ఆదాయం, మీ పెట్టుబడి పెరుగుతూనే ఉంటుంది - ఇదొక స్మార్ట్‌ స్ట్రాటెజీ!
BYD Seal Offer: ఈ కారుపై ఏకంగా రూ.2.5 లక్షల తగ్గింపు - బీవైడీ భారీ ఆఫర్!
ఈ కారుపై ఏకంగా రూ.2.5 లక్షల తగ్గింపు - బీవైడీ భారీ ఆఫర్!
Embed widget