అన్వేషించండి

Top Headlines Today: పాలనలో చంద్రబాబే ఆదర్శమన్న పవన్ కళ్యాణ్! మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ - నేటి టాప్ న్యూస్

AP Telangana News | ఏపీలో పల్లె పండుగ కార్యక్రమం మొదలైంది. లిక్కర్ టెండర్ విజేతల్ని ప్రకటిస్తారు. తెలంగాణలో ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Andhra Pradesh News Today | సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం
ప్రొఫెసర్‌ సాయిబాబా పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు మౌలాలిలోని ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు, నేతలు, ఆయన అభిమానులు క్యూ కట్టారు. సీపీఐ నేత నారాయణ సహా పలువురు వామపక్ష నేతలు సాయిబాబాకు నివాళులు అర్పించి, ఆయన సేవల్ని కొనియాడారు. అనంతరం మౌలాలిలోని ఆయన నివాసానికి సాయిబాబా భౌతికకాయాన్ని తరలించారు. ఈ క్రమంలో సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం వెళ్లగా చేదు అనుభవం ఎదురైంది. పౌర హక్కుల నేతలు, ఉద్యమకారుల నుంచి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. KTR గో బ్యాక్ అంటూ గట్టిగా నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ- ఈసారి సీఐ కుర్చీలోనే కూర్చొని హడావుడి- తీవ్ర స్థాయికి చేరిన రేవూరితో విభేదాలు
వరంగల్ జిల్లా పరకాలలోని గీసుకొండలో ఉద్రిక్తత చోట చేసుకుంది. సీఐ కుర్చీలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూర్చోవడంతో ఆమె వర్గీయులు భారీగా పోలీస్ స్టేషన్‌కు రావడంతో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్త నెలకొంది. ఎమ్మెల్యే రేవూరి, మంత్రి కొండా సురేఖకు సంబంధించి పది నెలలుగా తీవ్రమైన వర్గ విభేదాలు తలెత్తాయి. పలు మార్లు అధినాయకత్వం జోక్యం చేసుకున్నా ఈ వివాదం మాత్రం కొలిక్కి రావడం లేదు. గీసుకొండలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

పల్లెపండగ వారోత్సవాలు ప్రారంభం, పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్ కల్యాణ్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30వేల అభివృద్ధి పనులు ఒకేసారి శ్రీకారం చుట్టారు. పైగా ఒకేసారి 4500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దాంతో ఏపీలో పల్లె పల్లెలో పండగ వాతావరణం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన మార్క్ పాలన చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయి నుంచి సచివాలయం వరకు అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు. వైసీపీ హయాంలో పాలనను పూర్తిగా గాడి తప్పించారని ఆరోపిస్తూనే వాటిని సరి చేసి ప్రగతి పట్టాలు ఎక్కిస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు.   పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ- లాటరీ ద్వారా ఖరారు
ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ నేటి ఉదయం ప్రారంభమైంది. పటిష్ట బందోబస్తు మధ్య ఉదయం 8 గంటల నుంచి అధికారులు లాటరీ తీస్తున్నారు. అధికారిక ప్రక్రియలు పూర్తి చేసిన వారి పేర్లను వేసి అందులో ఆయా షాపులను అధికారులు కేటాయిస్తున్నారు. జిల్లాలో ఎ‌న్ని దుకాణాలు ఉన్నప్పటికీ ఒక్కో దుకాణం ఆర్డర్ ప్రకారం లాటరీ తీసి వారికి అందిస్తారు. ముందుగా ఒకటో నెంబర్ కేటాయించి దుకాణానికి వచ్చిన దరఖాస్తులకు నెంబర్లు ఇచ్చి ఉంటారు. వాటిని ఓ డబ్బాలో వేసి ఒకదాన్ని తీసి విజేతగా ప్రకటిస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 

పాలనలో చంద్రబాబే ఆదర్శం, రాష్ట్ర ప్రగతిలో ఫలితం కనిపిస్తోంది- పవన్ కల్యాణ్
సీఎం చంద్రబాబు అనుభవం ఏపీకి బలమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసినందుకు ఇప్పుడు మంచి పనులు జరుగుతున్నాయని ప్రజలకు చెప్పారు. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లభించి రాష్ట్రాభివృద్ధి జరగాలనే సంకల్పంతో టీడీపీతో కలిసి పోటీ చేశామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె పండగ వారోత్సవాలను కృష్ణా జిల్లా కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Chittor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
Crime News: కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
Hyderabad News: చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
Delhi News: వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
Embed widget