అన్వేషించండి

Tirumala News: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, శ్రీవారి భక్తులు షాక్

Andhra Pradesh News | తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం వివాదాస్పదమైంది. సిబ్బందిపైనే ఇంత దారుణమా, సామాన్యుల పరిస్థితి ఏంటని శ్రీవారి భక్తులు షాక్ అవుతున్నారు.

TTD Board Member | తిరుమల: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణానికి అంతా షాకయ్యారు. అది కూడా కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం ముందు టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ బూతులతో రెచ్చిపోయాడు. శ్రీవారి ఆలయం ముందు మాకు ఇదేంటి అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల ఆలయం ప్రాంగణంలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ అసభ్యకర పదజాలంతో ఇష్టరీతిన ప్రవర్తించడం వివాదాస్పదమవుతోంది.

మహాద్వారం గేటు నుంచి బయటకు పంపడం లేదని టీటీడీ ఉద్యోగి చెప్పడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడని తెలుస్తోంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్వు ఏమనుకుంటున్నావ్? థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు?' అంటూ నరేశ్ దూర్భాషలాడారు. నిబంధనలు ప్రకారం ఎవరైనా బయటికి వెళ్లాలన్నారు. దాంతో ఆవేశానికి లోనైన నరేష్ ఆగ్రహంతో "ఎవ‌డ్రా నువ్వు బ‌య‌టికి పోరా, థ‌ర్డ్ క్లాస్ నా XXXను ఫ‌స్ట్ బ‌య‌టికి పంపండంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. తిరుమలలో స్వామి వారి దర్శనభాగ్యం వచ్చే భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన టీటీడీ సభ్యుడు, సిబ్బందిపై ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు.

తిరుమలను వీడని వావాదాలు..

 కొన్ని నెలలుగా తిరుమలను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది కల్తీ నెయ్యి ఆరోపణలతో తిరుమలలో వివాదం మొదలైంది. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూ తయారుచేసి భక్తులు ప్రసాదాలు విక్రయించారని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. టీటీడీ అధికారులు స్పందించి నెయ్యి శాంపిల్స్ ను గుజరాత్ కు పంపి టెస్ట్ చేపించారు. కల్తీ నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగించకుండా తిరిగి పంపించామని టీటీడీ చెప్పింది. ఆపై వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల జారీ కోసం క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు చనిపోవడం తెలిసిందే.

మరోవైపు కల్తీ నెయ్యి అంశంపై ఏర్పాటు చేసిన సిట్ అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. సిట్ అధికారులు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కొందరు నిందితుల్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కోర్టు ఇచ్చిన పోలీస్ కస్టడీ ముగిసింది. విచారణలో తమకు సరిగా సహకరించడం లేదని, మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరనున్నారని తెలుస్తోంది.

Also Read: Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Arava Sridhar: పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget