అన్వేషించండి

Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా

Flood Relief To AP and Telangana | కేంద్ర ప్రభుత్వం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం ప్రకటించింది. అందులో అత్యధిక వాటా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించగా.. తెలంగాణకు రూ.231.75 కోట్లు ఇవ్వనుంది.

Union Govt approves Rs.1554.99 crore of assistance to 5 States | న్యూఢిల్లీ: గత ఏడాది సంభవించిన వరదలకు సంబంధించిన వరద సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ 5 రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లో సంభవించిన విపత్తులకుగానూ కేంద్రం ఆయా రాష్ట్రాలకు విపత్తు సాయంపై నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదలు రావడం సహా కొండ చరియలు విరిగి పడటం లాంటి ప్రకృతి విపత్తులు జరిగిన రాష్ట్రాలకు కలిపి నిధులు కేటాయించింది. 

ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించారంటే..

2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం SDRFలో భాగంగా 27 రాష్ట్రాలకుగానూ రూ.18,322.80 కోట్లు విడుదల చేసింది. అదే విధంగా NDRF నుంచి 18 రాష్ట్రాలకు 4,808.30 కోట్లు కేంద్రం అందించింది. తాజాగా కేంద్రం అదనంగా కేటాయించిన మొత్తం రూ.1554.99 కోట్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.608.08 కోట్లు, రూ. తెలంగాణకు రూ.231.75 కోట్లు, త్రిపురకు రూ. 288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకుంది. 

గత ఏడాది పలు రాష్ట్రాల్లో విపత్తులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రాష్ట్రాల పరిస్థితిని పరిశీలిస్తోంది. ఈ క్రమంలో గత ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన 5 రాష్ట్రాల ప్రజలకు సహాయం చేయడానికి హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ నిధులు కేటాయించింది. గత ఏడాది కొండచరియలు విరిగిపడటం, వరదలు, ఆకస్మిక వరదలు, తుఫాను ప్రభావిత రాష్ట్రాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) కింద ఉన్నత స్థాయి కమిటీ రూ.1554.99 కోట్ల అదనపు నిధులు కేటాయిస్తూ వారికి శుభవార్త చెప్పింది. 

షా నేతృత్వంలోని కమిటీ నిర్ణయం

అమిత్ షా నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ తాజాగా కేటాయించిన ఈ అదనపు సాయం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడుదల చేసిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నిధుల కంటే ఎక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం SDRFలో భాగంగా 27 రాష్ట్రాలకు రూ. 18,322.80 కోట్లు ఇవ్వగా, NDRF కింద 18 రాష్ట్రాలకు రూ. 4,808.30 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నిధి (SDMF) నుంచి 14 రాష్ట్రాలకుగారూ రూ. 2208.55 కోట్లు, జాతీయ విపత్తు నిధి (NDMF) నుంచి 8 రాష్ట్రాలకుగానూ కేంద్రం ఇదివరకే రూ. 719.72 కోట్లు విడుదల చేయడం తెలిసిందే.

విపత్తులు సంభవించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు విపత్తు నష్టం అంచనాకు మంత్రులు, అధికారుల బృందాలను పంపి రిపోర్ట్ తెప్పించింది. ఆ వివరాలు పరిశీలించిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో సంభవించిన నష్టానికిగానూ అదనపు వరద సాయంపై ప్రకటన చేసింది. ఎన్డీఏ మిత్రపక్షాలలో ఏపీ, బిహార్ లకు అధిక వాటా కేటాయించారని తెలంగాణకు తక్కువ కేటాయించారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. 

Also Read: Kodali Nani About Red Book: నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Stalin On Delimitation: జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయవద్దు, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Stalin On Delimitation: జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయవద్దు, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Shamila on Delimitation:  సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Fair Delimitation Meet In Chennai: డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stalin On Delimitation: జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయవద్దు, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Stalin On Delimitation: జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయవద్దు, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Shamila on Delimitation:  సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Fair Delimitation Meet In Chennai: డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
బాయ్‌ఫ్రెండ్‌ను 300 ముక్కలుగా నరికి చంపిన నటి... సినిమాలను మించిన ట్విస్ట్‌లతో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ
బాయ్‌ఫ్రెండ్‌ను 300 ముక్కలుగా నరికి చంపిన నటి... సినిమాలను మించిన ట్విస్ట్‌లతో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ
UPI Payment: ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్‌
ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్‌
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Embed widget