అన్వేషించండి

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు కోర్టులో భారీ ఊరట

Telangana News | తెలంగాణలో కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ2 ప్రణీత్ రావుకు నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది.

Nampally Sessions Court Grants bail to Praneeth Rao | హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు (Phone Tapping Case)లో A2గా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుకు ఊరట లభించింది. పలు దఫాలుగా విచారణ చేపట్టిన నాంపల్లి సెషన్స్ కోర్టు ప్రణీత్‌రావుకు బెయిల్ మంజూరు చేసింది. ప్రణీత్‌రావు చంచల్‌గూడ జైలులో  రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై లాయర్ ఉమామహేశ్వరరావు ఫిబ్రవరి 11న ప్రతీణ్ రావు తరఫున వాదనలు వినిపించారు. స్పెషల్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాంబశివారెడ్డి విచారణకు హాజరుకాకపోవడంతో పీపీ వాదనల కోసం విచారణ నేటికి వాయిదా వేశారు. 

దాదాపుగా నిందితులు అందరికీ బెయిల్

ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇతర నిందితులకు కోర్టులు బెయిల్ ఇచ్చాయని, ప్రస్తుతం ప్రణీత్ రావు ఒక్కరై జైలులో ఉన్నాయని లాయర్ ఉమామహేశ్వర రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ ప్రభాకర్ రావులకు తెలంగాణ హైకోర్టు జనవరి 31న మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. మరో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిందని వాదనలు వినిపించారు. ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై ఇరువైపుల వాదనలు విన్న జడ్జీ జస్టిస్ రమాకాంత్ రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు కావడంతో ప్రతీణ్ రావు త్వరలో విడుదల కానున్నారని ఆయన లాయర్ ఉమామహేశ్వరరావ తెలిపారు. 

బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాలపై నిఘా

బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షనేతలైన కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దర్యాప్తు మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దర్యాప్తులో తేలింది. ఎస్ఐబీలో ఉన్న 17 కంప్యూటర్లలో మొత్తం 42 హార్డ్ డిస్క్ లను తొలగించి.. వాటి స్థానంలో కొత్తవి అమర్చారు ప్రణీత్ రావు. పోలీస్ విచారణలో ప్రణీత్ రావు ఈ విషయాన్ని అంగీకరించారని అధికారులు తెలిపారు. మూసీ నదిలో నాలుగో బ్రిడ్జి కింద హార్డ్ డిస్క్ సంబంధించి శకలాలు గుర్తించారు. తమ వివరాలు తెలిసిపోతాయని హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారు. 

Also Read: Hyderabad News: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, కొత్తగా 7 ఫ్లైఓవర్లు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ 

ఒక్కొక్కరిగా అందరికీ బెయిల్ మంజూరు

తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మాజీ ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును మొదట అరెస్ట్ చేసింది. విచారణలో తెలిసిన సమాచారం ఆధారంగా అనంతరం అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు సినీ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాప్ చేసి వారికి సంబంధించిన రాజకీయ, వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారని విచారణలో ఒక్కో విషయం వెల్లడవుతోంది. అయితే ఈ కేసులో ఒక్కొక్కరిగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నలకు కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా ప్రణీత్ రావుకు నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget