Railways Not Restored Senior Citizen Concessions : ఆశపడకండి - వృద్ధులకు రైల్వే రాయితీ పునరుద్ధరించడం లేదు - ప్రచారం ఫేక్ !
Fact Check: వృద్ధులకు రైల్వే ఇస్తున్న రాయితీని పునరుద్ధరిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారం ఫేక్. రైల్వే శాఖ అలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Indian Railways Has Not Restored Senior Citizen Concessions on Train Ticket Fares: సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్ ఛార్జీలపై 50% రాయితీని అందించే కొత్త విధానాన్ని భారతీయ రైల్వేలు ప్రకటించాయని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.అందులో ఇందులో నిజం ఎంత అనేది మేము పరిశీలన చేశాం.
క్లెయిమ్: సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై 50% రాయితీని ఇచ్చే కొత్త విధానాన్ని భారత రైల్వే ప్రకటించింది.
ఫ్యాక్ట్ చెక్ : ఈ వాదన తప్పు. COVID-19 చర్యలలో భాగంగా భారత రైల్వే మార్చి 2020లో సీనియర్ సిటిజన్ రాయితీలను నిలిపివేసింది. ఆర్థిక పరిమితుల కారణంగా ఈ రాయితీలను పునరుద్ధరించే ప్రణాళికలు లేవని ప్రభుత్వం పదేపదే స్పష్టం చేసింది. IRCTC పోర్టల్ కూడా సీనియర్ సిటిజన్లకు సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే ఛార్జీలు వసూలు చేస్తోంది. అదనంగా, 2025-26 కేంద్ర బడ్జెట్లో ఈ రాయితీలను పునరుద్ధరించే ప్రస్తావన లేదు. కాబట్టి పోస్ట్లో చేసిన వాదన ఫేక్
రైల్వే మంత్రిత్వ శాఖ (ఆర్కైవ్) ప్రకారం, COVID-19 వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా, కేంద్ర ప్రభుత్వం మార్చి 2020లో రైళ్లలో సీనియర్ సిటిజన్ రాయితీతో సహా అనేక రాయితీలను ఉపసంహరించుకుంది. దీనికి ముందు, రైల్వేలు అన్ని మెయిల్ , ఎక్స్ప్రెస్ రైళ్లలో 58 ఏళ్లు పైబడిన మహిళలకు టికెట్ ఛార్జీలపై 50% తగ్గింపు , 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40% తగ్గింపును అందించాయి. అయితే, ఈ రాయితీని పునరుద్ధరించడాన్ని రైల్వేలు అధికారికంగా ప్రకటించలేదు. IRCTC పోర్టల్ కూడా సీనియర్ సిటిజన్లకు టికెట్ ధరలు జనరల్-కేటగిరీప్రయాణీకుల మాదిరిగానే ఉన్నాయని చూపిస్తుంది.
సీనియర్ సిటిజన్లకు రాయితీలను తిరిగి ప్రవేశపెట్టే ప్రణాళికలు లేవని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో పదేపదే స్పష్టం చేశారు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ), తక్కువ టికెట్ ధరల కారణంగా భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ ఖర్చులలో సుమారు 50% సబ్సిడీ ఇస్తుందని, అదే సమయంలో వికలాంగులు, రోగులు మరియు విద్యార్థులకు రాయితీలను అందిస్తుందని చెప్పారు. మహమ్మారి తర్వాత మొత్తం ప్రయాణీకుల ఆదాయంలో తగ్గుదల కారణంగా ఏర్పడిన గణనీయమైన ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ రాయితీలను సీనియర్ సిటిజన్లకు విస్తరించడం సాధ్యం కాదని మార్చి 2022లో ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 2023లో, సీనియర్ సిటిజన్ రాయితీలను తిరిగి ప్రవేశపెట్టే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. కానీ సుప్రీంకోర్టు కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది,
చివరగా, భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై రాయితీలను పునరుద్ధరించిందనే వాదన అబద్ధం.
Also Read: మోసం బాసూ... మోనాలీసా కాదు.
This story was originally published by Factly as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction, this story has not been edited by ABP DESAM staff.
Follow Fact Check News on ABP DESAM for more latest stories and trending topics.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

