Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలోని చోడవరం మండలం గోవాడలో ఓ మహిళ ఇంట్లో ఏకంగా 65 తులాల బంగారం, నగదు చోరీ జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Anakapalle News | చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో భారీ చోరీ జరిగింది. గోవాడ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడి భారీ మొత్తంలో బంగారం, నగదును ఎత్తుకుపోయారు. బీఎన్ రోడ్డు పక్కనే నివసిస్తున్న సుజాత అనే మహిళ ఇంట్లో ఈ చోరీ జరిగింది. బాధితులు ఇంట్లో లేని సమయం చూసి దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు.
ఈ చోరీలో సుమారు 65 తులాల బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదును దొంగలు ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు తెలిపారు. చోరీకి గురైన బంగారం, నగదు విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు 1.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళన వ్యక్తమవుతోంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలను సేకరిస్తున్నాయి. సీసీ ఫుటేజీ సేకరించే పనిలో ఉన్నారు. అందుబాటులో ఫుటేజీలు చెక్ చేస్తున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ట్రెండింగ్ వార్తలు






















