అన్వేషించండి

KTR News: ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం

Professor Saibaba News | ఇటీవల కన్నుమూసిన ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. కేటీఆర్ గోబ్యాక్ అని నినాదాలు చేశారు.

KTR Pays Tribute to Professor Saibaba at Moulali | హైదరాబాద్: ప్రొఫెసర్‌ సాయిబాబా పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. గన్ పార్కులోని అమరవీరులస్థూపం వద్ద నుంచి సాయిబాబా భౌతికకాయాన్ని మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ క్రమంలో సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మౌలాలిలోని ప్రొఫెసర్ నివాసానికి సోమవారం వెళ్లగా చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఉన్న ఉద్యమకారులు, పౌర హక్కుల నేతల నుంచి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. KTR గో బ్యాక్, KTR గో బ్యాక్ అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. 

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఉపా కేసులతో ఉద్యమ కారులను జైలుకు పంపారని ఆరోపించారు. ఉద్యకారులపై ఉక్కుపాదం మోపింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరాం, విమలక్కపై, హరగోపాల్ లాంటి నేతలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసింది ఎలా మరిచిపోతాం అని ఉద్యమకారులు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయానికి నివాళులు అర్పించి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గన్‌పార్క్ వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత
అంతకుముందు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రొఫెసర్‌ సాయిబాబా పార్థివదేహాన్ని అక్కడ కాసేపు ఉంచి నివాళులు అర్పించాలని చూడగా అందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. సీపీఐ నేత నారాయణ, వామపక్ష నేతలు ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయానికి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున అభిమానులు గన్ పార్క్ కు తరలివచ్చి కామ్రేడ్‌ సాయిబాబా అమర్‌రహే, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఓ అయిదు నిమిషాలు సంతాప సమావేశానికి  కుటుంబసభ్యులు, అభిమానులు పర్మిషన్ కోరగా శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని అందుకు పోలీసులు నిరాకరించారు. అంబులెన్స్‌లోనే ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయానికి పలువురు నివాళులు అర్పించారు. మరోవైపు పర్మిషన్ లభించకపోవడంతో సాయిబాబా అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి, గన్ పార్క్ వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. . అనంతరం ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయాన్ని మౌలాలికి తరలించారు. 

సమాజాన్ని చదివేవారు మేధావులు అని, ప్రొఫెసర్ సాయిబాబా అలాంటి వ్యక్తి అని గన్‌పార్కు వద్ద సీపీఐ నేత నారాయణ కొనియాడారు. అంగవైకల్యం ఉన్న మేధావి సాయిబాబాను అన్యాయంగా 10 సంవత్సరాలు జైల్లో నిర్బంధించారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు దోషులు ఎవరో తేల్చాలని సుప్రీంకోర్టుకు లేఖ రాస్తామని చెప్పారు.

హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సాయిబాబా: హరీష్ రావు
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులర్పించారు. మౌలాలిలోని ఆయన నివాసానికి వెళ్లి ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయానికి హరీష్ రావు, ప్రొఫెసర్ కోదందరామ్, పలువురు బీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళి అర్పించారు. సమాజంలో మార్పు రావాలని, హక్కుల కోసం పోరాడిన సాయిబాబా జైలు నుంచి విడుదలైన కొంత కాలానికే చనిపోవడం బాధాకరం అన్నారు. హక్కుల కోసం పోరాడేవారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆయనపై కేంద్రం అణచివేత ధోరణితో వ్యవహరించిందని తెలిపారు. హక్కుల కోసం పోరాడిన వ్యక్తిని జైల్లో పెట్టారని, ఆ సమయంలో ప్రజాస్వామ్యవాదులు సాయిబాబా నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారని కోదండరాం గుర్తుచేశారు.

Also Read: Warangal News: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ- ఈసారి సీఐ కుర్చీలోనే కూర్చొని హడావుడి- తీవ్ర స్థాయికి చేరిన రేవూరితో విభేదాలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget