అన్వేషించండి

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో మమత బెనర్జీ ప్లాన్ బీ- తెరపైకి బీజేపీ మాజీ నేత

పవార్, గోపాల కృష్ణ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా ఎగ్జిట్‌ తర్వాత యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది.

యశ్వంత్‌ సిన్హాను ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తూ ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. ఈమేరకు కొందరు నేతలతో మమత బెనర్జీ మాట్లాడినట్టు తెలుస్తోంది. 

తృణముల్ కాంగ్రెస్‌ సహ అధ్యక్షుడు యశ్వంత్‌ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుందనే ఆలోచన మమత బెనర్జీ చేస్తున్నారు. దీనిపై ఆయన నామినేషన్ వేసే ఛాన్స్ ఉందని తృణముల్ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. గతేడాది పశ్చిమబెంగాల్ ఎన్నికల సందర్భంగా యశ్వంత్ సిన్హా టీఎంసీలో చేరారు. ఇప్పుడు ఆయన్ని ప్రతిపక్షాల తరుఫున రాష్ట్ర పతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తోంది టీఎంసీ. దీనికి మూడు నాలుగు పార్టీలు కూడా మద్దతు తెలిపినట్టు సమాచారం. 

యశ్వంత్ సిన్హా  అభ్యర్థిత్వంపై ఇప్పటికే మమత బెనర్జీ కొందరి నేతలతో మాట్లాడినట్టు టీఎంసీ నేతలు చెబుతున్నారు.  ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడేందుకు ఎన్సీపీ చీఫ్‌ శరద్ పవార్, నేషనల్‌ కాన్ఫెరెన్స్ లీడర్ ఫరూఖ్‌ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్ గోపాల్ క్రిష్ణ గాంధీ నిరాకరించిన సంగతి తెలిసిందే. అందుకే యశ్వంత్‌ పేరు తెరపైకి వచ్చింది. 

సిన్హా  ఇప్పుడు TMCలో ఉన్నారు. అందువల్ల ఇది టీఎంసీ ప్రతిపాదనగా ఎవరూ అనుకోవద్దని... వేరే పార్టీల సూచన మేరకే సిన్హా పేరు తెరపైకి వచ్చిందని టీఎంసీ సీనియర్ నాయకుడు అన్నారు.

రేపు దిల్లీలో శరద్‌పవార్‌ ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీలతో సమావేశమై యశ్వంత్ సిన్హా పేరును ప్రతిపాదించనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిబెట్టడంతో ఏకాభిప్రాయం సాధించే దిశగా శరద్‌పవార్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకొని చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశంలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ పాల్గోనున్నారు. తమ పార్టీ అభిప్రాయాన్ని పంచుకోనున్నారు. 

మమతా బెనర్జీ గత వారం దిల్లీలో 22 బీజేపీయేతర పార్టీలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పదిహేడు మంది పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా శరద్‌ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, గోపాల్‌ కృష్ణ గాంధీని మమత బెనర్జీ ఈ సమావేశంలో ప్రతిపాదించారు. ఆరోజే శరద్‌పవార్‌ తన అభిప్రాయాన్ని చెప్పేశారు. తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. అక్కడకు మూడు రోజుల తర్వాత ఫరూఖ్‌ అబ్దుల్లా నిరాకరించారు. తనకు రాష్ట్ర రాజకీయాలే ముఖ్యమని వెల్లడించారు. ప్రసుత్తానికి వేరే ఆలోచనలు లేవన్నారు. ఆఖరుకు గోపాల్‌ కృష్ణ గాంధీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో యశ్వంత్‌ సిన్హా పేరు తెరపైకి వచ్చింది.

సిన్హా  రెండుసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఒకసారి 1990లో చంద్రశేఖర్ మంత్రివర్గంలో పని చేస్తే. ఆ తర్వాత మరోసారి వాజ్‌పేయి మంత్రివర్గంలో మంత్రిగా సేవలు అందించారు. వాజ్‌పేయి క్యాబినెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖను కూడా ఆయన నిర్వహించారు.

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ జూలై 18న ప్రారంభం కానుండగా, జూలై 21న ఫలితాలు వెల్లడికానున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు
ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా, చివరి స్థానంలో చిత్తూరు- జిల్లాలవారీగా పాస్ శాతాలు, పూర్తి వివరాలు
Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్  పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK Dot Balls Tree Saplings | IPL 2025 సామాజిక సందేశ స్ఫూర్తి కోసం ఓడిపోతున్న చెన్నైMS Dhoni LBW Out Controversy | ధోనీ నిజంగా అవుట్ అయ్యాడా..నాటౌటా..ఎందుకీ వివాదం..?SRH vs PBKS Match Preview IPL 2025 | పరాజయాల పరంపరలో పంజాబ్ పై సన్ రైజర్స్ పంజా విసురుతుందా..?Rohit Sharma Panic Delhi Thunderstorm | ముంబై మ్యాచ్ ప్రాక్టీస్ లో సుడిగాలి బీభత్సం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు
ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా, చివరి స్థానంలో చిత్తూరు- జిల్లాలవారీగా పాస్ శాతాలు, పూర్తి వివరాలు
Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్  పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
Love Story: ప్రేమిస్తే సినిమా చూపించాడు ఈ ప్రేమికుడు - కాకపోతే ఇంకా వైల్డ్ గా - వీడియో చూస్తే షాకే !
ప్రేమిస్తే సినిమా చూపించాడు ఈ ప్రేమికుడు - కాకపోతే ఇంకా వైల్డ్ గా - వీడియో చూస్తే షాకే !
Tamil Nadu: గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
Gold Price News: మరో వారంలో 10 గ్రాముల బంగారం ధర 1 లక్షకు చేరుకుంటుందా? నిపుణుల అభిప్రాయం ఏంటీ?
మరో వారంలో 10 గ్రాముల బంగారం ధర 1 లక్షకు చేరుకుంటుందా? నిపుణుల అభిప్రాయం ఏంటీ?
Embed widget