అన్వేషించండి

JNTU: ఇక విదేశాల్లోనూ జేఎన్‌టీయూ క్యాంపస్‌లు, ఏర్పాటుకు సన్నాహాలు- ఏయే దేశాల్లో అంటే?

నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జేఎన్‌టీయూ క్యాంపస్‌లను ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయా దేశాల్లోని పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా దేశీయ యూనివర్సిటీలు విదేశాల్లోనూ పాగవేయనున్నాయి. ఇప్పటికే విదేశీ యూనివర్సిటీలతో కలిసి ఇంటిగ్రేడెట్ కోర్సులను ప్రవేశపెట్టిన స్వదేశీ యూనివర్సిటీలు.. ఇక అక్కడే క్యాంపస్‌లు ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతున్నాయి. ఇందుకు జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ) ముందడుగు వేసింది. విదేశాల్లో క్యాంపస్‌లు ప్రారంభించేందుకు జేఎన్‌టీయూ సన్నాహాలు చేస్తోంది. 

నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో విశ్వవిద్యాలయ క్యాంపస్‌లను ప్రారంభించనుంది. ఇందుకోసం ఆయా దేశాల్లోని పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోనుంది. వీటిపై చర్చించేందుకు జేఎన్‌టీయూ వైస్ ఛాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ న‌వంబ‌రు 2న‌ అమెరికా పర్యటనకు వెళ్లారు. పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు డాక్టర్‌ హరి ఇప్పనపల్లి వీరికి సహకరిస్తున్నారు. 

విదేశాల్లో జేఎన్‌టీయూ క్యాంపస్‌ల ఏర్పాటుకు స్థానిక రాష్ట్రాల నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభించనున్నారు. మరోవైపు డ్యూయల్‌ డిగ్రీ కోర్సు ఒప్పందాల్లో భాగంగా లాస్‌వేగాస్, న్యూయార్క్, న్యూజెర్సీ, డెట్రాయిట్, అలబామాలోని విదేశీ వర్సిటీల అధికారులను కలుసుకోనున్నారు.

ఇక్కడ మూడేళ్లు, అక్కడ రెండేళ్లు...
జేఎన్‌టీయూ పరిధిలో ఐదేళ్ల ఇంజినీరింగ్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సులో మూడేళ్లు హైదరాబాద్‌లో, నాలుగో సంవత్సరం అమెరికాలో, ఐదో సంవత్సరం ఎంఎస్‌ చదవాల్సి ఉంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువారు జేఎన్‌టీయూ క్యాంపస్‌లలో తమ పిల్లలను చేర్పించే అవకాశాలున్నాయి.

ఉన్నత విద్యలో నాణ్యత పెరగాలి - ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి 
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు మరింత మెరుగుపడాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి తెలిపారు. గురువారం ఢిల్లీలో నీతి ఆయోగ్‌(ఎడ్యుకేషనల్‌ వర్టికల్‌), అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌(ఏఐయూ)లు సంయుక్తంగా ‘యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఇందులో ఐదు రాష్ర్టాల ఉన్నత విద్యామండలి చైర్మన్లు, 60 యూనివర్సిటీల వీసీలు హాజరయ్యారు. ‘క్వాలిటీ, ఫైనాన్సింగ్‌, గవర్నెన్స్‌ అండ్‌ ఎంప్లాయిబిలిటీ ’ అనే అంశాలపై కీలకంగా చర్చించారు. ఉన్నత విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, అందుకే యూనివర్సిటీ విద్యపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని లింబాద్రి చెప్పారు. ఈ సదస్సులో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ వీ వెంకట రమణ హాజరయ్యారు.

ALSO READ:

జేఈఈ మెయిన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు ప్రకారం నవంబరు 1న ప్రారంభంకావాల్సి ఉండగా... నవంబరు 2న ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ దరఖాస్తు ద్వారా నవంబర్‌ 30న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  ఈ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్‌, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు జనవరి సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నవంబరు 1న విడుదల చేసింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12న ఫలితాలను విడుదల చేస్తారు.
జేఈఈ మెయిన్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget