అన్వేషించండి

New Data Privacy Rules : సోషల్ మీడియా వినియోగంపై కొత్త రూల్స్ - డేటా ప్రొటెక్షన్ బిల్లు - డ్రాఫ్ట్ రూల్స్ ఇవే

New Data Privacy Rules : సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి సంస్థలు యూజర్ డేటాను 3 సంవత్సరాల తర్వాత తొలగించాలని కేంద్రం పేర్కొంది.

New Data Privacy Rules : ఈ టెక్ యుగంలో చవక ధరలోనే ఇంటర్నెట్ లభిస్తుండడంతో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్నారు. నగదు చెల్లింపులు, షాపింగ్ అంటూ ప్రతి దానికీ టెక్నాలజీ ఆయుధంగా మారిపోయింది. ముఖ్యంగా చిన్నారులు గంటల కొద్దీ సోషల్ మీడియాలో గడుపుతున్నారు. దీని వల్ల బయట ఆడుకునే సమయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా ఆనేక అనారోగ్యాల పాలవుతున్నారు. ఇలా అవసరానికి మించి ఉపయోగించి లేని, పోని చిక్కుల్లో పడుతున్నారు. ఈ క్రమంలో చిన్నారులు సోషల్ మీడియా వినియోగంపై కేంద్రం చర్యలు చేపట్టింది. , 18ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

డేటా ప్రొటెక్షన్ బిల్లు - పిల్లలకు ఎంతో మేలు

కాలక్షేపం కోసం పిల్లలు ఫోన్ వాడడం కామన్. కానీ అదే అదనుగా చేసుకుని వారి వ్యక్తిగత సమాచారాన్ని కొందరు సైబర్ మోసగాళ్లు దొంగిలిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా డేటా ఉల్లంఘనలపైనా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిన్నారులను ఇంటర్నెట్‌కు, అందులోను ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇటీవల కొన్ని దేశాలు చర్యలు తీసుకున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ దిశలో పయనిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025కు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 18ఏళ్ల పిల్లలు ఎవరైనా సరే సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పింది. 

డిజిటల్ ఇండియా కోసం, డేటా ప్రొటెక్షన్ బిల్లు (DPDP)ను మొదట్లో 2022లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సంవత్సరం పార్లమెంటులో ఆమోదించబడినప్పటి నుండి ఈ నియమాల అమలుకు చాలా సమయం పట్టింది. ఇప్పుడు అందుబాటులోకి తీసుకురానున్న ఈ కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్(డీపీడీపీ) రూల్స్ 2025 పై MyGov పోర్టల్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలపవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సూచించింది. ఏమైనా అభ్యంతరాలుంటే mygov.inలో తెలియజేయాలని చెప్పింది. ఫిబ్రవరి 18 వరకు సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆ తర్వాత ప్రజలు, పలు సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. 

డేటా సంరక్షణపై వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉండేలా నిబంధనలు రూపొందించారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించి కంపెనీలు మరింత పారదర్శకంగా ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ యూజర్స్ సమాచారాన్ని 3సంవత్సరాల వ్యవధిలో తొలగించాలి. ఈ డేటా తొలగింపుకు 48గంటల ముందు వారికి తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారు ఖాతాలలో ప్రొఫైల్, ఫోన్ నంబర్‌లు లేదా సేవలను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఇమెయిల్ అడ్రస్ లాంటి వివరాలు ఇటీవలి కాలంలో దోపిడీకి గురవుతోన్న ఈ సమయంలో ఈ చర్యలు తీసుకున్నారు.

కేంద్ర మంత్రి ట్వీట్

కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ సందర్భంగా ఎక్స్​లో పోస్ట్ చేశారు. "డ్రాఫ్ట్ డిజిటల్ ప్రొటెక్షన్ డేటా బిల్లు నియమాలను సంప్రదింపుల కోసం విడుదల చేస్తున్నాం. దీనిపై ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలి" అని సూచించారు. ఇకపోతే డేటా వినియోగానికి సంబంధించిన తప్పులు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఎక్కువగా ఎదుర్కొంటోన్న ఈ సమయంలో ఈ నిబంధనలన్నీ చాలా సంక్లిష్టమైన డిజిటల్ రంగానికి మరింత పారదర్శకతను తెస్తాయని భావిస్తున్నారు.

Also Read : Strict Action on Banned Apps : A కంటెంట్ ను చూపే యాప్స్ పై స్ట్రిక్ట్ యాక్షన్ - ఇండియాలో ఈ వెబ్ సైట్స్ కు నో యాక్సెస్

 
 

 

 

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
Embed widget