అన్వేషించండి

Bonalu Festival 2024 : వందల ఏళ్లుగా జరుగుతున్న సంబురం.. ప్రకృతికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించే బోనం!

Bonalu in Hyderabad 2024: ఆయురారోగ్యాలను ప్రసాదించే దేవతామూర్తికి కృతజ్ఞతతో సమర్పించే నైవేద్యమే బోనం. వందల ఏళ్లుగా నిర్వహిస్తోన్న ఈ వేడుకలో ఘటం, రంగం, పోతురాజుల విన్యాసాలు అత్యంత ముఖ్యమైన ఘట్టాలు

Bonalu in Hyderabad 2024: సృష్టికి మూలమైన శక్తిరూపంగా  దుర్గ, కాళి, లలిత సహా ఎన్నో రూపాల్లో పూజలందుకుంటోంది అమ్మవారు. దుష్టసంహరణార్థం అవతారాలెత్తిన శక్తి..గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని, పాడిపంటల్ని రక్షించేందుకు గ్రామదేవతలుగా, గ్రామ రక్షకులుగా కొలువుతీరారు. వాళ్లే  ఎల్లమ్మ, రేణుక, జగదాంబ, చండీ, మహంకాళి, దుర్గ, పోశమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, డొక్కలమ్మ, కట్టమైసమ్మ, గండిమైసమ్మ... ఒక్కో ఊరిలో ఒక్కో పేరుతో పిలిచినా, కొలిచినా...అమ్మ కరుణాకటాక్షాలు అందరిపైనా సమానంగా ఉంటాయి. అందుకు కృతజ్ఞతగానే ఏటా ఆషాడమాసంలో నెలరోజులూ ఊరూ వాడా సంబురంగా బోనాలు నిర్వహిస్తారు.అమ్మను ఆడబిడ్డగా భావించి పుట్టింటికి ఆహ్వానించి సకల మర్యాదలు చేసి..చీర సారె పెట్టి సాగనంపుతారు. ఇలా చేస్తే ఏడాది మొత్తం అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ఉంటాయని భక్తుల విశ్వాసం.  జూలై 7న గోల్గొండ జగదాంబ అమ్మవారితో మొదలయ్యే బోనాలు ఆగష్టు 4 సికింద్రాబాద్‌ ఉజ్జయిని అమ్మవారి మహంకాళి జాతరతో ముగుస్తుంది. లాల్‌ దర్వాజ తదితర ప్రాంతాల్లోనూ ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 

Also Read: అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!

ఆరు శతాబ్దాల క్రితం నుంచి బోనాలు...

కొండకోనల్లో ఉండేవారు రాయిని దేవతంగా చేసుకుని ప్రకృతి తమకు ఇచ్చిన ఆహారాన్ని కృతజ్ఞతా పూర్వకంగా కొత్త కుండలో సమర్పించడాన్నే బోనం అనేవారు. అప్పట్లో ప్రకృతి నుంచి దొరికే  పత్రి, పూలు, ఆకులు, కొమ్మలు, నీళ్లు, పసుపు కుంకుమ, ధాన్యం, కూరగాయలు ఇవన్నీ సమర్పించేవారు. రాను రాను పద్ధతులు మారుతూ వచ్చాయి. ఆరువందల ఏళ్లక్రితం పల్లవ రాజుల కాలంలో తెలంగాణ నేలపై బోనాల పండుగ ప్రాశస్త్యం పొందిందని చెబుతారు.  15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవ‌రాలు ఏడు కోల్ల ఎల్ల‌మ్మ న‌వదత్తి ఆల‌యాన్ని నిర్మించి అప్పట్లో బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించారట. 1676లో క‌రీంన‌గ‌ర్ హుస్నాబాద్‌లో ఎల్ల‌మ్మ‌గుడిని స‌ర్వాయి పాప‌న్న క‌ట్టించి అక్కడ అమ్మకు బోనం సమర్పించాడని   కైఫీయ‌తుల్లో గౌడ‌నాడులు గ్రంథంలో ఉంది.

Also Read: ఆషాఢ అమావాస్య రోజు ఈ ఒక్కటీ చేస్తే మీ కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోతుంది!

హైదరాబాద్ లో బోనాలు 

హైదరాబాద్ లో  బోనాల సందడి  విషయానికొస్తే 1869లో జంట‌న‌గ‌రాల్లో ప్లేగు వ్యాధి మ‌హ‌మ్మారిలా వచ్చి పడింది. ప్రజలంతా పిట్టల్లా రాలిపోయారు. ఆ సమయంలో అమ్మవారి ఆగ్రహానికి గురయ్యామని భావించిన ప్రజలంతా అమ్మను శాంతపరిచేందుకు  చేపట్టిన క్రతువే ఈ బోనాలు అని చెబుతారు.  గోల్కొండ‌ను పాలించిన  తానీషా  కాలంలో బోనం పండుగ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైందని చరిత్రకారులు అంటారు. మరీ ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ కోసం ఈ బోనాలు పండుగ నిర్వహించడం మొదలైందంటారు ఆరోగ్యనిపుణులు. అందుకే బోనం కుండకు పసుపు రాసి వేపాకులు కట్టడమే కాదు.. పసుపు నీళ్లు విరివిగా చల్లడం కూడా ఇందులో భాగమే అంటారు.  

Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!

బోనం అంటే

బోనం అంటే భోజనం.. ప్రకృతి ప్రసాదించిన వాటిని నైవేద్యంగా మార్చి తిరిగి అమ్మకు సమర్పించడమే బోనం. సర్వం సిద్ధం చేసిన తర్వాత బోనం కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. విస్తారంగా వానలు కురువాలని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. కొందరు అమ్మవారికి బోనంతో పాటు సాక సమర్పిస్తారు. చిన్న మట్టిపాత్రలో నీళ్లుపోసి చక్కెర, బెల్లం కలిపి పానకాన్ని తయారు చేసి..అందులో వేపకొమ్మను ఉంచి అమ్మవారికి నైవేద్యం పెడతారు. బోనాల పండుగ  ఊరేగింపులో పోతురాజులు, శివసత్తుల విన్యాసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  

Also Read: భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర సందడి..జగదాంబికకు జూలై 7న తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభం!

జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు

జ్యేష్టమాసంలో అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి నుంచి ఆషాడమాసం ప్రారంభమవుతుంది. ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం కానీ ఆదివారం అయినా బోనాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 07 ఆదివారం  గోల్కొండలో బోనాలు ప్రారంభమై ఆగష్టు 04 ఆదివారంతో ముగుస్తాయి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget