అన్వేషించండి

Telangana News: రేవంత్ రెడ్డి, స్టాలిన్ చేసేది దుష్ప్రచారమే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేంద్రం వెనుకడుగు వేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం భూముల అప్పగింతలో జాప్యం కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Union Minister Kishan Reddy | హైదరాబాద్: తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 6,280కోట్లు ఖర్చు చేసిందని, ఉత్తర ప్రాంత రీజినల్​రింగ్​ రోడ్డు​(Hyderabad Regional Ring Road) నిర్మాణానికి రూ. 18,772 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయని, రాష్ర్ట ప్రభుత్వం భూములు అందజేయడంలో జాప్యం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బీజేపీ ఆఫీసులో జాతీయ రహదారులు, కనెక్టివిటీలకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరుకాలేదు. కానీ రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం సహకారాన్ని కిషన్ రెడ్డి వివరించారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులు 95 శాతం పూర్తవుతున్నా, తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్​అక్విజేషన్​ద్వారా ఇవ్వాల్సిన భూమిని అందించకపోవడంతోనే నిర్మాణంలో జాప్యం జరుగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. పలుమార్లు రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి ఈ విషయంపై తీసుకువెళ్లామని, మరోమారు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో 10 జాతీయ రహదారులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని.. త్వరలోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభానికి రానున్నారని తెలిపారు.  

కనెక్టివిటీ పెంచేలా రహదారుల నిర్మాణం

‘ఎన్‌హెచ్​ 44, 565, 65, 167, 202, 365ఎ, రూ.61 వేల కోట్లతో తెలంగాణ సరిహద్దు ప్రాంతాలను ఇతర రాష్ర్టాలతో కనెక్టివిటీని పెంచే పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. పలు చోట్ల రాష్ర్ట ప్రభుత్వం భూములు అందించకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. హైదరాబాద్ లోని ఆరాంఘర్ నుంచి శంషాబాద్ (Shamshabad)​ వరకు ఆరులేన్ల విస్తరణ రూ. 300 కోట్లతో పూర్తయ్యింది. హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రజలకు సిగ్నల్స్​ ఫ్రీగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేశాం. అంబర్​పేట్​ ఫ్లై ఓవర్ కింద రోడ్డు నిర్మాణం కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం, రాష్ర్ట ప్రభుత్వం భూమిని అప్పగిస్తే పనులు మొదలు పెడతాం. హైదరాబాద్​–పూణే, మహబూబ్ నగర్​– జడ్చర్ల, మిర్యాలగుడ, మహబూబ్ నగర్​–చించోలి, మహబూబ్ నగర్​–కల్వకుర్తి, కోదాడ–ఖమ్మం, నకిరేకల్​–నాగార్జునసాగర్, నిర్మల్ ఖానాపూర్, మంచిర్యాల – రేపల్లెవాడ లాంటి పనులు జాతీయ రహదారి పనులు పూర్తి కావచ్చాయని’ కిషన్​ రెడ్డి తెలిపారు.

బీఆర్ఎస్​హయాంలోనే తెలంగాణకు రూ. 7.50 లక్షల కోట్ల అప్పు ఉందని గతంలో చెప్పిన రేవంత్​ రెడ్డి, ఇప్పుడేమో తనకు ఇంత అప్పు ఉందని తెలియదని చెప్పడం ఏంటని నిలదీశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రాజెక్టులు పూర్తి చేస్తుంది.. కానీ సోనియా గాంధీ, రాహుల్​గాంధీ, రేవంత్​ ఇచ్చిన హామీలతో తమకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.  కోచ్​ ఫ్యాక్టరీపై అసత్యాలు, హామీలపై దాటవేత ధోరణి, అప్పులపై ఏడుపులు, భాషపై అబద్ధాలు ఆ పార్టీ నేతల విధానమని కిషన్ రెడ్డి విమర్శించారు.

ఒక్క ఎంపీ సీటు తగ్గదు..
నియోజకవర్గాల పునర్ విభజనపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గానీ, దక్షిణ భారతదేశంలో గానీ ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు. తెలంగాణలో ఓట్లు తగ్గినా, జనాభా తగ్గినా పార్లమెంట్​సీట్లు తగ్గబోవు. ప్రధాని మోదీ లోక్​సభలో ఈ విషయాన్ని చెప్పారు. దక్షిణాదిన ఎంపీ సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం స్టాలిన్, రేవంత్ రెడ్డిలు మాట్లాడేవన్నీ బోగస్​ మాటలే. జనాభా సేకరణ, రీ ఆర్గనైజేషన్​కమిటీ ఏర్పాటు చేసిన తరువాత మార్గదర్శకాలు విడుదలవుతాయి. త్వరలో ఎన్నికలు రానుండడంతో తమిళనాడును దోచుకున్న స్టాలిన్​ కుటుంబం ఓట్ల కోసం అసత్యాలను ప్రచారం చేస్తుంది. ప్రజలకు ఏం చేశారో చెప్పడానికి బదులు హిందీ భాషకు రంగులు వేయాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గుజరాత్, తమిళ కాశీ,  తెలుగు, తమిళ సంఘాన్ని ఏర్పాటు చేశాం. కొత్త ఎడ్యుకేషన్​ పాలసీలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపట్టాం. హిందీదీ నేర్చుకోవాలని ఏ ఒక్కరినీ కేంద్రం బలవంత పెట్టలేదని’ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.  

ఎంఎంటీఎస్ పై చేతులెత్తేశారు..
రిజినల్​రింగ్ రోడ్డు (Hyderabad RRR)కు కూడా కేవలం రూ. 100 కోట్లు మాత్రమే డిపాజిట్​చేశారని, డబ్బులు లేవని తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. పనులు ఆగవద్దని తాను కేంద్రాన్ని కోరానని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు తొలిసారి ఈ విషయాన్ని అందరికీ తెలిపా అన్నారు. ఎంఎంటీఎస్ (MMTS)కు తెలంగాణ ప్రభుత్వం రూ. 1200 కోట్లు కేటాయించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రెండేళ్లు మూలన పడిన ప్రాజెక్టు ప్రారంభించేలా చొరవ తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో వెనక్కు తగ్గేది లేదని మా నిర్ణయాలతో రుజువైందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: Telangana Latest News: మ‌హిళా సంఘాల‌కు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget