అన్వేషించండి

CJI NV Ramana: 16 నెలల పదవీ కాలంలో కీలక తీర్పులు, ఉత్తర్వులు - ప్రజల జడ్డ్‌గా ఎన్‌వీ రమణ

CJI NV Ramana: 16 నెలల పదవీ కాలంలో జస్టిస్ ఎన్‌వీ రమణ ఎన్నో కీలక తీర్పులు, ఉత్తర్వులు జారీ చేశారు.

Justice NV Ramana: 

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ 16 నెలల పదవీకాలంలో జనహితమే ధ్యేయంగా పలు కీలక తీర్పులు, ఉత్తర్వులు వెలువ రించారు. ఐతే.. ఎన్ని తీర్పులు ఇచ్చినా.. పదవీ విరమణ తరువాత అందరికి గుర్తుండేవి కొన్ని  మాత్రమే. ఆయన సీజేఐగా ఇచ్చినతీర్పులేంటో ఓ సారి చూద్దాం. 

పలు కీలక తీర్పులు..

ప్రభుత్వాలు సెక్షన్ -124 A ను ఇష్టారితీన ఉపయోగించడాన్ని సీజేఐగా ఎన్.వి. రమణ తప్పు పట్టారు. వలస కాలం నాటి చట్టాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించేంతవరకూ దానికింద ఎఫ్‌ఆఐర్‌లు నమోదు చేయడంలో సంయమనం పాటించాలని ఆదేశించారు. ఈ సెక్షన్ కింద..  జైళ్లలో మగ్గుతున్నవారు బెయిలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని స్పష్టతనిచ్చారు. కోర్టులు బెయిలు మంజూరు చేసినా.. ఆ ఉత్తర్వులు అందలేదన్న కారణంతో ఖైదీల విడుదలలో అలసత్వాన్ని నివారించాడానికి  ‘ఫాస్టర్‌’ పేరుతో సురక్షితమైన ఎలక్ట్రానిక్‌ వ్యవస్థను అందుబాటు లోకి తెచ్చారు. కఠినమైన UAPA చట్టం కింద అరెస్టైన ఓ కేరళ జర్నలిస్ట్ కి దిల్లీలో వైద్య సేవలు అందించాలని జస్టిస్‌ రమణ ఆదేశించారు. విచారణలో ఉన్నవారికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. 

ప్రజల జడ్జ్‌గా..

ఝార్ఖండ్‌లో ధన్‌బాధ్‌ అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను పట్టపగలు ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనను సుమోటోగా తీసుకొని సీబీఐ దర్యాప్తునకు సీజేఐ జస్టిస్‌ రమణ ఆదేశించారు. ఆ దారుణానికి పాల్పడినవారికి ఏడాది కంటే తక్కువ సమయంలోనే శిక్ష ఖరారయ్యేలా చేశారు. జస్టిస్‌ రమణ సీజేఐ పీఠమెక్కాక ఇప్పటి వరకు సుప్రీంకోర్టు కొలీజియం 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు 250 మందికిపైగా హైకోర్టు జడ్జీలను నియమించింది. 15 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాన్ని పూర్తిచేసింది. తద్వారా ఖాళీల భర్తీ విషయంలో జస్టిస్‌ రమణ సరికొత్త రికార్డు నెలకొల్పారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచాలని ప్రయత్నించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటుకు కృషి చేశారు. ఏళ్లకు ఏళ్లు గెలుపు కోసం కోర్టుల చుట్టు తిరగడం కంటే.. మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో ఇరు వర్గాలు గెలుపు పొందవచ్చు. ఇలా.. మధ్యవర్తిత్వాన్ని ఇంతలా ప్రోత్సహించిన సీజేఐ మరోకరు బహుశా లేరేమో. అందుకే.. ఎన్.వి. రమణ ప్రజల జడ్జిగా గుర్తింపు పొందారు. 

పెండింగ్‌లో కొన్ని..

ఐతే.. జస్టిస్ ఎన్.వి. రమణ  కొన్ని రాజ్యంగ విధానపరమైన అంశాలకు సంబంధించిన 53 కేసులలో constitution bench అవసరమైనప్పటీకి న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించుకోలేదనే వాదనలున్నాయి. అవేంటంటే.. ఆర్టికల్ 370 రద్దుపై వేసిన పిటిషన్ న్ ను 11 వందలకుపైగా రోజులుగా పెండింగ్ లోనే పెట్టారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో హిజాబ్  ధరించడాన్ని  కర్ణాటక ప్రభుత్వం రద్దు చేయడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. కానీ, ఇది సుమారు 160 రోజులుగా పెండింగ్ లోనే ఉంది. కులం ఆధారంగా కాకుండా.. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే పిటిషన్ దాదాపుగా  13వందల రోజులకుపైగా పెండింగ్ లో ఉంది. ఉపా యాక్ట్ -1967 సవాల్ చేస్తు వేసి కేసు సైతం 11 వందల రోజులకుపైగా పెండింగ్ లో ఉంది. రాజకీయ పార్టీలకు ఇచ్చే ఎలక్ట్రోల్ బాండ్ లపై పారదర్శకత అవసరమనే దానిపై వేసిన కేసు  18 వందల రోజులకుపైగా పెండింగ్ లో ఉంది. దీంతో.. సాధారణ తీర్పుల్లో వైవిధ్యం, సామాన్యుడికి చేరువయ్యే ప్రయత్నం చేసిన జస్టిస్ ఎన్. వి. రమణ... రాజ్యంగ విధాన పరమైన కేసులలో మాత్రం కాస్త సంయమనం పాటించారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger and Leopard Deaths: వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger and Leopard Deaths: వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Embed widget