అన్వేషించండి

Supreme Court : కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వరా ? ఏపీ , బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం !

కరోనా బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంలో ఏపీ, బీహార్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను వర్చువల్‌గా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.యాభై వేల పరిహారం ఇస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. నిధులను కూడా కేటాయించింది.

అయితే కొన్ని రాష్ట్రాలు చురుగ్గా కరోనా మృతుల కుటుంబాలను ఆదుకున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆదేశాలు.. దరఖాస్తులతోనే సరి పెట్టాయి. ఇంత వరకూ ఎవరికీ పరిహారం ఇవ్వలేదు. ఈ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, బీహార్ ఉన్నాయి. పరిహారం ఇవ్వడం లేదని కొంత మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పరిహారం ఎందుకు చెల్లించలేదో సరైన కారణం చెప్పలేకపోవడంతో జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

Also Read: 'టెలిప్రామ్టర్ కూడా మీ అబద్ధాలు తట్టుకోలేకపోయింది..' మోదీపై రాహుల్ సెటైర్

Koo App
కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను వర్చువల్‌గా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల పరిహారం గతంలో ప్రకటించారు. #SupremeCourt #Covid19 #APNews #APCovidDeaths #Corona https://telugu.abplive.com/news/the-ap-and-bihar-governments-have-been-negligent-in-providing-compensation-to-the-families-of-corona-victims-the-supreme-court-was-outraged-at-those-governments-18940 - Shankar (@guest_QJG52) 19 Jan 2022

Supreme Court : కరోనా  మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వరా ? ఏపీ , బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం !

ఏపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు కోర్టు ముందు హాజరుకావాలని, పరిహారం ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. అయితే ధరఖాస్తుల సమయంలోనే అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఎలా ధరఖాస్తు చేసుకోవాలో కూడా స్పష్టత లేకుండా పోయింది.

Also Read: PM Security : ప్రధానిపై దాడికి ఉగ్రకుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన నిఘానివేదిక !?

ఒక్క ఏపీ మాత్రమే కాదు పలు రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది. చివరికి సుప్రీంకోర్టు వద్దకు విషయం చేరింది. గతంలో పరిహారం కూడా ప్రభుత్వాలు స్వతహాగా ఇవ్వాలని నిర్ణయించలేదు. పరిహారం కోసం బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే విచారణ జరిపిన తర్వాత కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ. యాభై వేలు ఇవ్వడానికి అంగీకరించింది. విపత్తు నిధులు అందుకోసం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. కానీ రాష్ట్రాలు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాయి. 

Also Read: ట్వీట్లతోనే "టెస్లా" వచ్చేస్తుందా ? ఎలన్ మస్క్ చెప్పిన "సవాళ్లేంటో" రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఏపీ బడ్జెట్‌లో తల్లికి  వందనం పథకానికి కేటాయింపులెన్ని?
ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి కేటాయింపులెన్ని?
AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ-  వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- బడ్జెట్‌లో కీలక ప్రకటన
AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ- వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- బడ్జెట్‌లో కీలక ప్రకటన
Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల భయమేంటీ?
నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల భయమేంటీ?
Revanth Reddy Latest News: పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఏపీ బడ్జెట్‌లో తల్లికి  వందనం పథకానికి కేటాయింపులెన్ని?
ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి కేటాయింపులెన్ని?
AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ-  వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- బడ్జెట్‌లో కీలక ప్రకటన
AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ- వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- బడ్జెట్‌లో కీలక ప్రకటన
Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల భయమేంటీ?
నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల భయమేంటీ?
Revanth Reddy Latest News: పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
Sabdham Movie Review - 'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా? కాదా?
'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా? కాదా?
Non Local Quota: 'స్థానికేతర' ఉత్తర్వులు జారీ, ఏపీ విద్యార్థులకు ఇక 'నో ఛాన్స్' - ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ
'స్థానికేతర' ఉత్తర్వులు జారీ, ఏపీ విద్యార్థులకు ఇక 'నో ఛాన్స్' - ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ
Pune Crime News: అత్యాచార నిందితుడి కోసం డ్రోన్లతో గాలింపు- 70 గంటల తర్వాత చెరకు తోటలో అరెస్టు
అత్యాచార నిందితుడి కోసం డ్రోన్లతో గాలింపు- 70 గంటల తర్వాత చెరకు తోటలో అరెస్టు
Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Embed widget