అన్వేషించండి

PM Security : ప్రధానిపై దాడికి ఉగ్రకుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన నిఘానివేదిక !?

రిపబ్లిక్ వేడుకల సందర్భంగా దేశంలో విధ్వంసం సృష్టించేందుకు టెర్రరిస్టులు ప్రణాళికలు వేసినట్లుగా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖుల్ని టార్గెట్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు

రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారత ప్రధానిపై దాడి జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ గట్టి హెచ్చరికలు చేయడం సంచలనంగా మారింది.  గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి.  ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరే కాదని.. పలువురు ప్రముఖులపై దాడికి టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లుగా చెబుతున్నారు  ఈ మేరకు ఇంటెలిజెన్స్ నివేదిక కేంద్ర హోంశాఖకు చేరినట్టు తెలుస్తోంది. 

Also Read: పంజాబ్‌లో డ్యూటీ ఎక్కిన ఈడీ..! ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై ఈ దాడులు తప్పవా ?

పాకిస్థాన్, ఆఫ్గన్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు ఉందని నిఘావర్గాలు గుర్తించాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే ప్రముఖులతోపాటు బహిరంగసభలు, కీలకమైన సంస్థలు, రద్దీ ప్రదేశాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సమూహాలు కుట్ర చేసినట్టు ఐబీ వెల్లడించింది. డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడవచ్చని అంచనా వేశారు.   లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి టెర్రర్‌ సంస్థలు ఈ ఉగ్ర ప్రణాళిక వెనుక ఉన్నాయి. 

Also Read: ట్వీట్లతోనే "టెస్లా" వచ్చేస్తుందా ? ఎలన్ మస్క్ చెప్పిన "సవాళ్లేంటో" రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసా ?

భారత రిపబ్లిక్ వేడుకలపై టెర్రరిస్టులు ప్రతీ సారి గురి  పెడుతూ ఉంటారు.అయితే భారత నిఘా శక్తి కారణంగా ఎప్పటికప్పుడు వారి ప్రయత్నాను బలగాలు నిర్వీర్యం చేస్తూ ఉంటాయి . అయితే ఈ సారి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నారు. ఇటీవల పంజాబ్‌లో  ప్రధాని మోడీ భద్రత విషయంలో ఆందోళనకర పరిణామాలు ఏర్పడటం..  ఆ తర్వాత ఖలీస్థానీ గ్రూపుల నుంచి హెచ్చరికలు రావడంతో  పరిస్థితి మరింత సీరియస్‌ గా మారింది. 

Also Read: వరంగల్ బాలుడికి గ్రేట్ ఛాన్స్.. ఏకంగా ఎలన్ మస్క్‌నే మెప్పించి.. అదేం అంత సులువు కాదు!

పాకిస్తాన్‌లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరింపజేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయని ఇప్పటికే కేంద్రం ఓ అంచనాకు వచ్చింది.  పంజాబ్‌పాటు ఇతర రాష్ట్రాల్లోనూ దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు దేశం మొత్తం సోదాలు పెంచారు. కీలకమైన చోట్ల భద్రతా ఏర్పాట్లు పెంచుతున్నారు. 

Also Read: భారత్‌ ఇలా చేస్తే కేసులు తగ్గుతాయి.. లాక్‌డౌన్‌ అక్కర్లేదు: WHOలో భారత ప్రతినిధి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Akshaya Tritiya 2025 Date : అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
Embed widget