అన్వేషించండి

Priyanka Gandhi Parliament Speech: వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi Attacks Modi Govt: విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల బలప్రయోగం, రబ్బరు బుల్లెట్లు, లాఠీఛార్జ్‌ల వాడకంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ లోక్‌సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Priyanka Gandhi Pellet Guns Speech Loksabha: విద్యార్థుల ఆందోళనలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా లోక్‌ సభలో  కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్, బాష్పవాయు గోళాలు , వాటర్ క్యానన్లు ,  పెల్లెట్ తుపాకులు వాడటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు ఏమైనా తీవ్రవాదులా? వారిపై పెల్లెట్ తుపాకులు, ఏకే-47ల స్థాయిలో బలప్రయోగం ఎందుకు చేశారని  కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా నిలదీశారు.

 ఇది ఎవరి సొంత ఆస్తి కాదు.. పార్లమెంట్ ప్రజలది 

విద్యార్థుల  సంసద్ ఛలో  ర్యాలీపై జరిగిన అణచివేతపై ప్రియాంక తీవ్రంగా స్పందిస్తూ.. పార్లమెంట్ ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తి కాదని, ఇది ఈ దేశ యువతదని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు అయిన సొంత పిల్లలపై దాడి చేయించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, హక్కుల కోసం ప్రశ్నిస్తున్న నిరుద్యోగులపై లాఠీలు ఝళిపించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళన వెనుక ఉన్న నిజమైన ఆవేదనను గుర్తించి, ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా వారితో మాట్లాడాలని డిమాండ్ చేశారు.

 మహిళా నిరసనకారులపై వేధింపులు 

ఈ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థినుల పట్ల భద్రతా బలగాలు, యంత్రాంగం ప్రవర్తించిన తీరుపై ప్రియాంకా గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తమ పిల్లలను ఎందుకు ఆందోళనలకు పంపారని వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ దేశంలో మహిళలకు, విద్యార్థినులకు నిరసన తెలిపే రాజ్యాంగ హక్కు లేదా అని ప్రశ్నించిన ఆమె, మహిళా ప్రాతినిధ్యాన్ని అణచివేసేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.   

 ప్రధాని మోదీ, అమిత్ షాల బాధ్యత 

దేశంలో ప్రతి చిన్న విజయానికీ క్రెడిట్ తీసుకునే ప్రధాని నరేంద్ర మోదీ, ఇప్పుడు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి ,  వారిపై జరుగుతున్న దాడులకు కూడా పూర్తి బాధ్యత వహించాలని ప్రియాంక  డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం, వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీలు ఈ ఘటనలపై సభ వేదికగా సమాధానం చెప్పాలని, బాధిత విద్యార్థులపై నమోదు చేసిన తప్పుడు కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని గట్టిగా పట్టుబట్టారు.
  
సభలో ప్రతిపక్షాల ఆందోళనలు, సభ వెలుపల విద్యార్థుల నిరసనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. సమాజంలో ప్రతి రంగానికి సంబంధించిన విజయాలను తమ ఖాతాలో వేసుకునే ప్రభుత్వం, లక్షలాది మంది యువత ఆవేదనను, విద్యార్థుల జీవితాలను తృణీకరించడాన్ని సహించేది లేదని ప్రియాంకా గాంధీ హెచ్చరించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పేపర్ లీకేజీలపై సమగ్ర చర్చ జరిపే వరకు పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Priyanka Gandhi Parliament Speech: వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
CM Vijay Office Shifted: ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget