అన్వేషించండి

Tirumala News: పురటాసి మాసం అంటే ఏంటీ? తిరుమలకు గ్రామాలకు గ్రామాలే ఎందుకు తరలి వస్తున్నాయి?

Tirumala News: పవిత్రమైన పురటాసి మాసం ప్రారంభమైంది. ఈ నెల రోజులు భక్తులు ఎంతో పవిత్రంగా భావించి స్వామి వారి కి పూజలు చేస్తారు. వందల కిలో మీటర్లు పాదయాత్రగా వస్తారు. ఇందులో తామిలలు ఎక్కువ.

Tirumala News: కలియుగ వైకుంఠంనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆయన ఈ భూమి పై ఆవతరించిన మాసం పురటాసి మాసంగా భక్తులు భావిస్తారు. తమిళలు పురాటాసి (పెరటాసి), (తిరుమల శనివారాలు)గా పిలుస్తారు. తమిళలు ఈ మాసం లో స్వామి వారిని దర్శించుకోవడానికి ఇష్టపడుతారు. ఈ నెల మొత్తం చాల భక్తి శ్రద్ధలతో స్వామి వారిని ప్రార్థిస్తారు. మద్యం, మాంసం లేకుండా స్వామి వారిని స్మరిస్తూ దూర ప్రాంతాల నుంచి సైతం కాలినడకన తిరుమలకు వస్తారు భక్తులు. ఈ సాంప్రదాయం తమిళులు ప్రారంభించినా నేటికి స్వామి వారి భక్తులు ఎక్కడ ఉన్న ఈ పురటాసి మాసాన్ని ఆచరిస్తారు.

వందల కిలోమీటర్లు ప్రయాణం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుపతి నుంచి అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గంలో నుంచి తిరుమలకు చేరుకుంటామని అందరికి తెలుసు. నడవలేని భక్తులు వాహనాలు, బస్సుల్లో తిరుమలకు వస్తారు. మరీ వందల కిలోమీటర్లు భక్తులు తిరుమలకు పాదయాత్రగా వస్తారని తెలుసా.

పురటాసి మాసం లో తమిళనాడు, కర్ణాటక, ఏపీ నుంచి వచ్చే భక్తులు తమ గ్రామాలు నుంచి అందరూ గోవింద మాలధారణ చేస్తారు. పురటాసి మాసం మొత్తం గ్రామాలకు గ్రామాలు తరలి పాదయాత్రగా తిరుమలకు ప్రయాణం అవుతారు. పసుపు రంగు బట్టలు ధరించి గోవింద స్మరణ చేస్తూ తిరుపతికి చేరుకుంటారు. ఇక్కడ తిరుమల మెట్ల పూజ చేసి అనంతరం సప్తగిరులను అధిరోహిస్తారు. 

తిరుమలకు రాలేని భక్తులు తమ ఇంటి వద్ద స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పిండి దీపాలు వెలిగించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి ప్రార్థిస్తారు. ఇది పురటాసి మాసంలో ప్రతి శనివారం నిర్వహించే కార్యక్రమంగా మారిపోయింది. ఈ మాసం కోసం ఏడాది పాటు భక్తులు వేచి చూస్తారు అంటే ఆశ్చర్యం వేయక మానదు.

సౌకర్యాలు కల్పించాలి
దేశంలోని శ్రీవారి భక్తులు తిరుమల శనివారాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. తమకు ఉన్నదానిలో స్వామి వారిని పూజిస్తారు. తమిళనాడు, కర్నాటక నుంచి వందలాది కిలో మీటర్లు భక్తులు పాదయాత్ర చేసి తిరుమల శ్రీవారి దర్శించుకుంటారు. ఇలాంటి భక్తులకు పూర్వం శ్రీకృష్ణ దేవరాయలు మండపాలను కట్టించారని ప్రతీతి. పాదయాత్రగా వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే ఇలాంటి మండపాలు నేటికి కొన్ని అందుబాటులో ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం నుంచి ఏపీలోకి ప్రవేశించే నగరి, చిత్తూరు, సత్యవేడు ఇలాంటి ప్రాంతాల్లో మండపాలు కొన్నింటిని నేటికి పరిరక్షించారు. అయితే మరికొన్ని శిథిలావస్థకు చేరుకుంది. వాటిని పునఃనిర్మాణం చేయాలని భక్తులు కోరుతున్నారు.

తిరుమల కు వచ్చే భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. తిరుపతిలో కొన్ని సౌకర్యాలు ఉన్నా అవి పూర్తి స్థాయిలో లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరి పాదయాత్రగా వచ్చే భక్తుల కష్టాలు అయితే వర్ణనాతీతం. పాదయాత్ర కోసం వచ్చే భక్తులకు సరైన వసతి సౌకర్యాలు లేవు. పూర్వం ఉన్న మండపాలు లేవు. నీరు, నీడ లేక అవస్తలు పడుతున్నారు భక్తులు. రోడ్డులో ఉన్న ఆలయాలు, ఫుట్ పాత్ లు, బస్ షెల్టర్ వద్ద విశ్రాంతి తీసుకునే పరిస్థితి నెలకొంది. పాదయాత్రగా వచ్చే భక్తులకు కొందరు స్వచ్చందంగా సేవ చేస్తున్న టీటీడీ చొరవ తీసుకుని ఇలాంటి భక్తులకు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

పురటాసి మాసం 
పురటాసి మాసం ఈనెల 17 వ తేదీ ప్రారంభమైంది. ఈనెల 21న మొదటి శనివారం, ఈనెల 28న రెండో శనివారం, అక్టోబర్ 5న మూడో శనివారం, అక్టోబర్ 12న నాలుగో శనివారం నిర్వహిస్తారు. అక్టోబర్ 15వ తేదీతో పురటాసి మాసం ముగుస్తుంది. ఈ మాసంలోనే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్టోబర్ 4 నుంచి 12 వ తేదీ వరకు ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
Embed widget