అన్వేషించండి

Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఘాటెక్కుతోంది. మిర్చియార్డ్ సందర్శించిన జగన్‌ విమర్శలు అందుకున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ మొదలైంది.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలతోపాటు రాజకీయం కూడా వేడెక్కింది. అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్న ప్రభుత్వానికి జనంలో ఉంటూనే జగన్ మోహన్ రెడ్డి బదులిస్తున్నారు. ప్రశ్నలు సంధిస్తున్నారు. అటు నుంచి అధికార పార్టీ నేతలు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. మరోవైపు షర్మిల ఇద్దరిపై విరుచుకుపడుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మిర్చి మసాలగా మారింది. 

రైతులు సంతోషంగా లేరు: జగన్

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పీడ్ పెంచినట్టు కనిపిస్తున్నారు. మంగళవారం జైల్లో వంశీని పరామర్శించారు. బుధవారం గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ఆంధ్రప్రదేశ్‌లో రైతులు సంతోషంగా లేరని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి న్యాయం జరగడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని ధ్వజమెత్తారు. 

కొత్తప్రభుత్వం వచ్చన తర్వాత పెట్టుబడి సాయం రావడం లేదని, సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేకపోయారని జగన్ మండిపడ్డారు. కల్తీ విత్తనాలు సరఫరా ప్రభుత్వమే చేస్తోందని ఆరోపించారు. మిర్చి రైతుల కష్టాలు చంద్రబాబుకు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రైతులకు అండగా వైసీపీ పోరుబాట పడుతుందన్నారు జగన్. 

మాది స్వర్ణ యుగం: జగన్ 

ఈ టూర్ తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన జగన్ కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో మొన్నటి వరకు ధాన్యం రైతులు ఇబ్బంది పడ్డారని ఇప్పుడు మిర్చి రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. చంద్రబాబు వచ్చినప్పటి నుంచి రైతులను పట్టి పీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో క్వింటా ధర రూ.21-27 వేలు పలికిందని ఇప్పుడు రూ.8-11వేలకు పడిపోయిందన్నారు. 

Also Read: రాష్ట్ర వేడుకగా జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం-త్వరలోనే నిర్ణయం

పథకాలు మూలన పడేశారు: జగన్

ఈ ఏడాది తెగుళ్లు కారణంగా మిర్చి పంట దిగుబడి పడిపోయిందని ఎకరాకు పది క్వింటాళ్లకు మించి రాలేదన్నారు. కౌలు రైతు పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లా రైతులు మరిన్ని ఇబ్బందు పడతున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. దీనిపై రివ్యూ కూడా చేయలేదన్నారు. రైతులకు సాయం చేయకపోగా తాము తీసుకొచ్చిన విప్లవాత్మక పథకాలు కూడా మూల పడేశారని ధ్వజమెత్తారు. 

ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 

జగన్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు కనీసం అడుగు బయట పెట్టని వ్యక్తి ఇప్పుడు ఏదో రాజకీయం చేయడానికి బయటకు వస్తున్నారని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. జగన్‌ చేసిన కామెంట్స్ చూస్తుంటే మానసికస్థితి సరిగా లేదని అర్థమవుతుందని ధ్వజమెత్తారు. జగన్ చెప్పే అబద్దాలు విన్న ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌కు పని లేకపోవడంతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. వ్యవసాయం కోసం జగన్ చేసిందేంటని ప్రశ్నించారు. దీనికి తోడు భారీగా బకాయిలు పెట్టి వెళ్లిపోయారని మండిపడ్డారు.

ఇద్దరీ ప్రజల పట్ల చిత్త శుద్ధి లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఎన్నికల హామీలు అమలు చేసి ప్రజలను ఆదుకోవడం తెలియడం లేదని ఆక్షేపించారు. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా జగన్‌కు లేదని మండిపడ్డారు. 

Also Read: చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు- జగన్‌కు దమ్ములేదు- రెండు పార్టీలపై షర్మిల ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Ind vs Aus Semi Final: 14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
SSMB29: రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
Andhra MLC Elections: కలసి ఉంటే కలదు విజయం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - కళ్లు తిరిగే మెజార్టీలు
కలసి ఉంటే కలదు విజయం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - కళ్లు తిరిగే మెజార్టీలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Aus Semi final Preview | Champions Trophy 2025 లోనైనా ఆసీస్ ఆ రికార్డు బద్ధలు అవుతుందా | ABPTravis Head vs India | హెడ్ మాస్టర్ ని ఆపగలిగితే Champions Trophy 2025 ఫైనల్ కి మనమే | ABP DesamInd vs Aus Semis 1 Preview | Champions Trophy 2025 లో కంగారూలను టీమిండియా కుమ్మేస్తుందా.? | ABPOscar 2025 | 97వ ఆస్కార్‌ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన అనోరా సినిమా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Ind vs Aus Semi Final: 14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
SSMB29: రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
Andhra MLC Elections: కలసి ఉంటే కలదు విజయం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - కళ్లు తిరిగే మెజార్టీలు
కలసి ఉంటే కలదు విజయం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - కళ్లు తిరిగే మెజార్టీలు
Ind Vs Aus Semis Rohit Comments: టాస్ ఓడ‌ట‌మే మంచిదైంది..!  బ్యాటింగ్, బౌలింగ్ లో ఏం చేయాలో అర్థం కాలేదు..:!! రోహిత్ వ్యాఖ్య‌
టాస్ ఓడ‌ట‌మే మంచిదైంది..!  బ్యాటింగ్, బౌలింగ్ లో ఏం చేయాలో అర్థం కాలేదు..:!! రోహిత్ వ్యాఖ్య‌
Mass Jathara: రవితేజకు తాతగా రాజేంద్రుడు... మాస్ జాతర మామూలుగా ఉండదు తమ్ముళ్లూ!
రవితేజకు తాతగా రాజేంద్రుడు... మాస్ జాతర మామూలుగా ఉండదు తమ్ముళ్లూ!
Godavari Graduates MLC Winner: గోదావరిలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం, ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు వీరే..
గోదావరిలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం, ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు వీరే..
Lokesh on Talliki Vandanam: తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్, శాసన మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి
తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్, శాసన మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి
Embed widget