అన్వేషించండి

Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

AP Deputy CM Pawan Kalyan | తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని, కసబ్ లాంటి ఉగ్రవాదులు దేశంలోకి రాలేదా అని కాకినాడ పోర్టు వద్ద పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan at Kakinada Port | కాకినాడ: గంజాయికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని, కాకినాడ పోర్టులోకి వెళ్లి స్టెల్లా అనే ఓడను పరిశీలించేందుకు వెళ్తే తనకు అధికారులు సహకరించలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదురుగా షిప్ లో చిన్న చిన్న షిప్ నుంచి సరుకులు దింపుతూ ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు. పోర్టులో ఎగుమతి ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారని అడిగితే తమకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉందని చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.

తీరం ఎంత బలమో, అంత బలహీనత - పవన్ కళ్యాణ్

ఏపీకి 975 కిలోమీటర్ల తీరం కలిగి ఉంది. తీర ప్రాంతం మనకు ఎంత బలమో, అంత బలహీనత. గతంలో విశాఖపట్నానికి ఘాజీ అనే పాకిస్తాన్ సబ్ మెరైన్ రావడానికి నిదర్శనం. విదేశాల నుంచి ఆర్డీఎక్స్ దిగుమతి చేసుకోవచ్చు. గ్యాస్ నిక్షేపాల లాంటి సంస్థలు ఉన్నాయి. వంద కిలోల ఆర్డీఎక్స్ తీసుకొచ్చినా చూసే నాథుడే లేడు. ఇది కేవలం బియ్యానికి సంబంధించిన విషయం కాదు. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ లాంటి వాళ్లు కరాచీ నుంచి ఎలా వచ్చారు. మనకు తూర్పు తీరంలో సముద్రమార్గంలో రక్షణ లేదు. ఎస్పీకి మొదటినుంచీ చెబుతున్నా. వారి నుంచి మాకు కనీసం రిపోర్టు రాలేదు. కలెక్టర్, కొండబాబు, సివిల్ సప్లైస్ చైర్మన్ సుధీర్ లాంటి వారు ఎంతో కొంత బియ్యాన్ని పట్టుకుని ఉక్కుపాదం మోపుతున్నారు. - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అధికారులు నాకు సహకరించడం లేదు- పవన్ కళ్యాణ్

స్టెల్లా అనే షిప్‌లో టన్నుల కొద్దీ పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారని, దీని మీద చర్యలు తీసుకోవాలని చూస్తే ఇది పెద్ద నెట్‌వర్క్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈరోజు తనకు షెడ్యూల్ లేకున్నా, ఢిల్లీ నుంచి వచ్చాక కాకినాడ పోర్టుకు తాను వస్తానని తెలియగానే రావొద్దు సార్ వేలాది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయని ఫోన్లు, మెస్సేజ్‌లు వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. డిప్యూటీ సీఎం అయిన తనకే కాకినాడ పోర్టులో స్టెల్లా అనే ఓడను పరిశీలించేందుకు అధికారులు సహకరించడం లేదని సంచలన విషయాలు చెప్పారు. నాదెండ్ల మనోహర్ దీనిపై పోరాటం చేస్తే విషయం వెలుగులోకి వచ్చినా, చర్యలు తీసుకోవడానికి వీలు కావడం లేదంటే.. ఇది చాలా పెద్ద నెట్‌వర్క్ అన్నారు.

ఏపీ నుంచి విదేశాలకు కాకినాడ పోర్టు ద్వారా అక్రమంగా టన్నుల కొద్దీ బియ్యం తరలించడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం నాడు కాకినాడ పోర్టుకు వెళ్లి తనిఖీలు చేపట్టి.. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న సీజ్ చేసిన బియ్యాన్ని పరిశీలించారు. కాకినాడ పోర్టులో సీజ్ చేసిన టన్నుల కొద్ది బియ్యాన్ని పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.

2019 నుంచి 2024 మధ్య కాలంలో అక్రమంగా బియ్యం తరలించారని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఆరోజు డ్రోన్ విజువల్స్ తీసి ప్రపంచానికి తెలిసేలా చేశాం. ఇప్పుడు కాకినాడ పోర్టుకు 1000 నుంచి 1100 లారీల బియ్యం వస్తుంది. ఇక్కడి నుంచి ప్రపంచానికి బియ్యం సరఫరా అవుతుంది. కానీ కాకినాడ పోర్టుకు కేవలం 16 మంది సెక్యూరిటీ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ బియ్యం పట్టుకుని కేసులు పెట్టించి సీరియస్ అయితే అధికారులు స్పందిస్తున్నారు. తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని, వందల కిలోల ఆర్డీఎక్స్ మన దేశంలోకి తీసుకువచ్చినా పట్టించుకునే నాథుడు లేడన్నారు. భద్రత పెంచాల్సిన అవసరం ఉందని, ప్రధాని మోదీతో ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం మాట్లాడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Also Read: Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ఉత్తమ్
Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ఉత్తమ్
Kash Patel as FBI Director: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
Amol Palekar: సినిమా అంటే కలెక్షన్లు మాత్రమేనా... ఆర్ఆర్ఆర్, బాహుబలి గురించే ఎందుకు? సౌత్ వర్సెస్ నార్త్ సినిమా గొడవలపై అమోల్ పాలేకర్
సినిమా అంటే కలెక్షన్లు మాత్రమేనా... ఆర్ఆర్ఆర్, బాహుబలి గురించే ఎందుకు? సౌత్ వర్సెస్ నార్త్ సినిమా గొడవలపై అమోల్ పాలేకర్
SLBC Tunnel Collapse: కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌, సొరంగంలో చిక్కుకున్న 50 కార్మికులు
కుప్పకూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌, సొరంగంలో చిక్కుకున్న 50 కార్మికులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ఉత్తమ్
Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ఉత్తమ్
Kash Patel as FBI Director: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
Amol Palekar: సినిమా అంటే కలెక్షన్లు మాత్రమేనా... ఆర్ఆర్ఆర్, బాహుబలి గురించే ఎందుకు? సౌత్ వర్సెస్ నార్త్ సినిమా గొడవలపై అమోల్ పాలేకర్
సినిమా అంటే కలెక్షన్లు మాత్రమేనా... ఆర్ఆర్ఆర్, బాహుబలి గురించే ఎందుకు? సౌత్ వర్సెస్ నార్త్ సినిమా గొడవలపై అమోల్ పాలేకర్
SLBC Tunnel Collapse: కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌, సొరంగంలో చిక్కుకున్న 50 కార్మికులు
కుప్పకూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌, సొరంగంలో చిక్కుకున్న 50 కార్మికులు
Shikhar Dhawan Girl Friend: మిస్ట‌రీ విమెన్ తో ధావ‌న్ చెట్టా ప‌ట్టాల్.. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప‌బ్లిక్ గా క‌నిపించిన ఈ జంట‌.. సోష‌ల్ మీడియాలో పుకార్లు
మిస్ట‌రీ విమెన్ తో ధావ‌న్ చెట్టాప‌ట్టాల్.. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప‌బ్లిక్ గా క‌నిపించిన ఈ జంట‌.. సోష‌ల్ మీడియాలో పుకార్లు
PM Kisan Amount: ప్రతి రైతు ఖాతాలోకి రూ.2,000, రెండు రోజుల్లో డబ్బులు - రెడీగా ఉండండి
ప్రతి రైతు ఖాతాలోకి రూ.2,000, రెండు రోజుల్లో డబ్బులు - రెడీగా ఉండండి
Hyderabad Metro Phase2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
Taapsee Pannu: కళ్ళ ముందే తిరిగినా పట్టించుకోలేదు... సీక్రెట్ వెడ్డింగ్ గురించి స్పందించిన తాప్సీ
కళ్ళ ముందే తిరిగినా పట్టించుకోలేదు... సీక్రెట్ వెడ్డింగ్ గురించి స్పందించిన తాప్సీ
Embed widget