అన్వేషించండి

PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ

Andhra Pradesh News | ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

former CID chief PV Sunil Kumar | అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. అనుమతులు లేకుండా USA, UAE, స్వీడన్ లో పర్యటించారు. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశీ పర్యటనలపై విచారణ మొదలైంది. సస్పెన్షన్ టైమ్ లో హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఐపీఎస్‌ అధికారి, ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేశారని ఆయనపై ఫిర్యాదులున్నాయి. అప్పటి నరసాపురం ఎంపీ, ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో వేధింపులకు గురి చేసిన కేసులోనూ సునీల్ కుమార్ పై అభియోగాలున్నాయి. 2020 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సునీల్ కుమార్ పలుమార్లు విదేశాలకు వెళ్లారని, ఇది ఆలిండియా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేతృత్వంలో ఈ విషయంపై విచారణ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి.

కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. ఉద్ధేశపూర్వకంగానే కొందరు అధికారులు, వైసీపీ నేతలు, మాజీ మంత్రులపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు.

వైఎస్ జగన్ సీఎంగా వైసీపీ హయాంలో కీలకంగా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత జూలైలో సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అలా చేయడం ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్దమని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. సునీల్ కుమార్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వివరణ ఇవ్వాలని గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది. 

పుట్టినరోజు నాడే రఘురామ అరెస్ట్..
వైసీపీ హయాంలో పీవీ సునీల్ కుమార్ ఎక్కువ కాలం సీఐడీ డీజీగా సేవలు అందించారు. కానీ ఆ సమయంలో ఆయన చర్యలు విమర్శలకు దారితీశాయి. అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును పుట్టినరోజు నాడే అరెస్టు చేశారు. రాజద్రోహం కింద సుమోటోగా కేసులు పెట్టి రఘురామను అరెస్ట్ చేసి గుంటూరు సీఐడీ ఆఫీసుకు తరలించారు. అక్కడ తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ ఆరోపించారు. కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ జరుగుతోంది. ఇటీవల నిందితులను రఘురామ గుర్తుపట్టారు. తన గుండెపై కూర్చుని దాడి చేసిన వ్యక్తిని గుర్తించానని ఆయన తెలిపారు. 

Also Read: Gorantla Butchaih Chowdary: టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget