అన్వేషించండి

Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?

Bengal Communists: దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నారు. ఒక్క సారి ఓడిపోయే సరికి ఇక మళ్లీ కనిపించకుండా పోయారు. బెంగాల్‌లో కమ్యూనిస్టుల పరిస్థితి ఇదే.

Why did the communists weaken in Bengal :  పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 34 ఏళ్ల పాటు  తిరుగులేని శక్తిగా వెలిగిన వామపక్ష కూటమి  , ఒక్కసారి అధికారం కోల్పోయాక తిరిగి కోలుకోలేనంతగా బలహీనపడటం భారత రాజకీయాల్లో  ఒక హెచ్చరిక.    కమ్యూనిస్టుల తొలినాళ్ల విజయానికి  భూసంస్కరణలు  వెన్నెముకగా నిలిచాయి.  పేద రైతులకు భూమిని పంచడం ద్వారా వారు పటిష్టమైన ఓటు బ్యాంకును సృష్టించుకున్నారు. అయితే, కాలక్రమేణా ఆ భూమి చిన్న చిన్న ముక్కలై, వ్యవసాయం లాభసాటిగా లేక యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం ప్రారంభమైంది. వ్యవసాయంపై ఆధారపడిన పాత తరం తర్వాత వచ్చిన కొత్త తరం ఆకాంక్షలను గుర్తించడంలో సిపిఎం విఫలమైంది.

 సింగూర్, నందిగ్రామ్: ఆత్మహత్యాసదృశ్య నిర్ణయాలు 

దాదాపు మూడు దశాబ్దాల పాలన తర్వాత, రాష్ట్రంలో పారిశ్రామికీకరణ అవసరమని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య వేగంగా అడుగులు వేశారు. అయితే, టాటా నానో ప్లాంట్ కోసం సింగూర్‌లోనూ, కెమికల్ హబ్ కోసం నందిగ్రామ్‌లోనూ బలవంతంగా భూసేకరణ చేపట్టడం పార్టీకి శాపమైంది.  వ్యవసాయం మన పునాది.. పరిశ్రమ మన భవిష్యత్తు  అనే నినాదం క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరలేదు. ఫలితంగా, తమను నమ్ముకున్న రైతాంగం తమకు వ్యతిరేకంగా మారుతుంటే కమ్యూనిస్టులు గ్రహించలేకపోయారు.

పార్టీ  క్యాడరైజేషన్, అహంకారం 

సుదీర్ఘ పాలన వల్ల పార్టీ క్యాడర్‌లో విపరీతమైన అహంకారం పెరిగింది. గ్రామాలు, పట్టణాల్లో చిన్న చిన్న సమస్యల నుండి పోలీసు స్టేషన్ల వరకు అంతా పార్టీ కనుసన్నల్లోనే నడిచేది. ఈ  పార్టీతంత్రం సామాన్య ప్రజలకు భారంగా మారింది. చివరకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్  మా-మతి-మానుష్ అంటే తల్లి-నేల-ప్రజలు నినాదంతో ప్రజల్లోకి వెళ్లినప్పుడు, కమ్యూనిస్టుల ఉక్కుకోటలు పేకమేడల్లా కూలిపోయాయి.

 మమతా బెనర్జీ  మార్కు రాజకీయం 

2011లో అధికారం కోల్పోయిన తర్వాత, కమ్యూనిస్టుల ఓటు బ్యాంకును మమతా బెనర్జీ తన సంక్షేమ పథకాలతో పూర్తిగా తనవైపు తిప్పుకున్నారు. ఉచిత బియ్యం, సైకిళ్లు  , కన్యాశ్రీ వంటి పథకాలు గ్రామీణ ఓటర్లను టిఎంసికి శాశ్వత మద్దతుదారులుగా మార్చాయి. కమ్యూనిస్టులు సిద్ధాంతాలకే పరిమితం కాగా, మమత ప్రత్యక్ష ప్రయోజనాలపై దృష్టి పెట్టారు.

 బీజేపీ ఆవిర్భావం - కనుమరుగైన వామపక్షాలు 

కమ్యూనిస్టులు బలహీనపడటంతో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికి బీజేపీకి అవకాశం దక్కింది.  ముందు మమతను దించాలి, ఆ తర్వాత మనల్ని మనం చూసుకోవచ్చు  అనే భావనతో కమ్యూనిస్టుల ఓటు బ్యాంకులో గణనీయమైన భాగం బీజేపీ వైపు మళ్లింది. 2019 ఎంపీ ఎన్నికలు,  2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు ఒక్క సీటు కూడా గెలవలేక సున్నాకే పరిమితం కావడం వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
 
సిద్ధాంతపరమైన మొండితనం, మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోవడం,  ప్రజల మనోభావాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం బెంగాల్ కమ్యూనిస్టులను పతనం అంచుకు నెట్టాయి. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో వారు మనుగడ కోసం పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.                    

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
Tamil Nadu Assembly Elections 2026: విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?
విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget