అన్వేషించండి

Weather In AP, Telangana: 125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

Telangana Weather | 125 ఏళ్లలోనే ఈ సమ్మర్‌లో సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కానున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేసింది.

Temperature in Hyderabad | హైదరాబాద్‌: ఈ ఏడాది భానుడు మరింత ప్రతాపం చూపనున్నాడని వాతావరణ కేంద్రం తెలిపింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఎండలు చూసి బెంబెలెత్తిన తెలుగు ప్రజలకు అనంతరం మూడు వారాలు సాధారణ ఉష్ణోగ్రతలు చూశారు. కానీ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు నెలలు ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని ప్రజలు ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు, వైద్య నిపుణులు సూచించారు. ఏప్రిల్, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఈ ఏడాది సైతం నిప్పులకొలిమే..

గత ఏడాదే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు చూసిన భారత ప్రజలు ఈ ఏడాది అంతకుమించి ఎండలు ఉంటాయన్న వాతావరణ కేంద్రం ప్రకటనతో ఆందోళన నెలకొంది. ఈ ఎండలకు ఫ్యాన్, కూలర్లు కాదు ఏసీలే ఆప్షన్ అని ప్రజలు భావిస్తున్నారు. సమ్మర్ స్టార్ట్ కాగానే ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరిగింది. వాటి ధరలు సైతం అనూహ్యంగా పెరిగిపోయి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. గత 100, 125 ఏళ్లలో సగటు ఉష్ణోగ్రతల కంటే ఈ సమ్మర్ లో ఎక్కువ ఎండలు చూస్తారని ప్రజల్ని అలర్ట్ చేశారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు దక్షిణ, మధ్య తెలంగాణలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రివేళ సైతం కనిష్ట ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీల మేర పెరిగి ఉక్కపోత ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. గాలిలో ప్రతి ఏడాది తేమ తగ్గిపోతోందని, ఓజోన్ పోర మరింత విచ్ఛిన్నం అవుతుండటం అందుకు ప్రధాన కారణం. 

తెలంగాణలో వెదర్ అప్‌డేట్
తూర్పు, ఉత్తర తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ నిపుణులు అంచనా వేశారు. తూర్పు తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు ఉండవచ్చు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఎండ మంట తప్పదు. నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీల వరకు పెరుగుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 36- 37 డిగ్రీల వరకు నమోదు కానుందని, నగర వాసులు ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు వెదర్..
ఏపీలోనూ గత కొన్నేళ్లుగా ఎండలు మండిపోతున్నాయి. అసలే తీర ప్రాంతం అధికంగా ఉన్న కారణంగా, ఎండలతో పాటు తీర ప్రాంతాల్లో ఉక్కపోత అధికం కానుంది. మధ్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు ఉండవచ్చు. అటు నంద్యాల, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 38 డిగ్రీల కంటే ఎక్కువ నమోదు కానుంది. విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రత 32- 33 డిగ్రీల వరకు ఉండవచ్చు. కానీ ఉక్కపోతతో ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారు.

Also Read: CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget